Drop Down Menus

పర్యాటకులకు గుడ్‌న్యూస్.. పాపికొండలు యాత్రకు గ్రీన్ సిగ్నల్.. | Papikondalu Tourism (2021)

పర్యాటకులకు గుడ్‌న్యూస్.. పాపికొండలు యాత్రకు గ్రీన్ సిగ్నల్.. బోటు సర్వీసులు ఎప్పటినుంచంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో బోటింగ్‌కు అనువైన.. చూడచక్కని ప్రదేశం ఏంటంటే.. టక్కున గుర్తొచ్చేది పాపికొండలు. చుట్టూ దట్టమైన అడవులు.. మధ్యలో నీళ్లు.. అక్కడో ఎత్తైన పర్వతశ్రేణి.. ఆహా తలచుకుంటేనే స్వర్గ ద్వారం అలా తెరుచుకుంటున్నట్లు ఉంది కదా.. కరోనాతో బ్రేక్ పడ్డ ఆ బోటు షికారుకు మళ్లీ తలుపులు తెరుచుకున్నాయి. పాపికొండల్లో బోటింగ్‌కు అనుమతిస్తున్నట్లు పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు.

పర్యాటకులకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. నవంబర్ 7వ తేదీ నుంచి పాపికొండల్లో బోటింగ్‌కు అనుమతిస్తున్నట్లు పర్యాటక శాఖ మంత్రి అవంతి వెల్లడించారు.

అయితే.. రాజమండ్రి నుంచి పాపికొండలు వెళ్లే ఒక్కో ప్రయాణికుడికి రవాణా, భోజన వసతితో కలపి టికెట్‌ ధరను రూ.1,250 గా నిర్ణయించినట్టు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. భవిష్యత్‌లో పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని టూరిస్ట్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని తెలిపారు. గతేడాది గోదావరి నదిలో బోటు ప్రమాదం తర్వాత ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టిందని వివరించారు.

ఈ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ బోటు యాత్ర ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు. కంట్రోలు రూమ్‌లు ఏర్పాటు చేసినప్పటికీ పాపికొండలలో సిగ్నల్స్‌ లేనందున అక్కడి సమాచారం అందే అవకాశాలు తక్కువే. గతంలో రూపొందించిన నిబంధనలు పాటిస్తూ బోటు షికారు మొదలుపెడితే మంచిది. లైసెన్స్‌ ఉన్న బోట్లకు అనుమతి ఇవ్వాలని, డ్రైవర్లకు శిక్షణ ఉండాలని, అంతా లైఫ్ జాకెట్లు ధరించాలని, రెండు ఇంజన్లు ఉం డాలని, గజఈతగాళ్లు ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. అంతేకాక యాత్రికులు బోటులోకి ఎక్కడానికి దిగడానికి గోదావరి ఒడ్డున సరైన ఏర్పాట్లు కూడా ఉండాలని కోరుతున్నారు.

పాపికొండలు ఎక్కడున్నాయంటే..

పాపికొండలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నడుమ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి మరియు ఖమ్మం జిల్లాల నడుమ ఉండేవి. ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరం నగరానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలోను, తెలంగాణ లోని భద్రాచలం పట్టణం నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలోను, తెలంగాణ రాజధాని హైదరాబాదు నగరానికి 410 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాపికొండల ప్రాంతం జాతీయ పార్కుగా గుర్తించబడింది కొండలూ, జలపాతాలు, గ్రామీణ వాతావరణం ఉండటంతో ప్రకృతి ప్రేమికులు దీనిని ఆంధ్రా కశ్మీరం అని పిలుస్తుంటారు. భధ్రాచలం వద్ద మునివాటం ప్రదేశం దగ్గరలో జలపాతం ఉంది. ఇక్కడ ఉండే ఒక శివలింగం సర్పం నీడలో అద్భుతంగా ఉంటుంది.

పాపికొండల వద్ద గోదావరి చాలా తక్కువ వెడల్పులో రెండు కొండల మధ్య ప్రవహిస్తూ ఉంటుంది. రాజమండ్రి నుంచి పాపికొండలకు వచ్చే లాంచీ ప్రయాణం పర్యాటకులకు ఒక మంచి అనుభూతిని కలిగిస్తుంది. పాపికొండల విహార యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టిసం ద్వీపం నుంచి మొదవుతుంది. పట్టిసం ద్వీపం నుంచి పోలవరం, గొందూరు, సిరివాక, కొల్లూరు, పేరంటాలపల్లి మీదుగా సాగుతుంది.

Famous Posts:

సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు

ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు

ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే

అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం

> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి

100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

పాపికొండలు, Papikondalu Boat trip, Rajahmundry to Papikondalu, papikondalu boat trip price, papikondalu tourism, papikondalu couple package, rajahmundry to papikondalu boat trip cost

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

  1. Papikondalu Tour Agents : Papikondalu is a great tourist Place every one should visit once in his life. Boat Travelling is giving us excellent and joyfull experience. its family Holiday Tour visit for More Details

    ReplyDelete

Post a Comment

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.