Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

వలస కూలీలకు రూ.50 వేల కోట్లతో ఉపాధి | Schemes | Ministry of Labour


గరీబ్ కళ్యాణ్ రోజ్‌గార్ యోజన’ ప్రారంభం.. వలస కూలీలకు రూ.50 వేల కోట్లతో ఉపాధి
వలస కార్మికులకు వారి స్వస్థలాల్లోనే ఉపాధి కల్పించే ఉద్దేశంతో ‘గరీబ్ కళ్యాణ్ రోజ్‌గార్ యోజన’ను ప్రధాని మోదీ ప్రారంభించారు. బిహార్‌లోని ఖగారియా జిల్లాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఆరు రాష్ట్రాల్లోని 116 జిల్లాలో ఈ పథకం అమలవుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెంచడమే ఈ పథకం లక్ష్యమన్న మోదీ.. ఇందుకోసం రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు.

వచ్చే 125 రోజుల్లో దాదాపు 25 పథకాల ద్వారా వలస కూలీలకు లబ్ధి చేకూరుస్తామని ప్రధాని తెలిపారు. ఇప్పటి వరకూ పట్టణాల పురోగతి కోసం పాటు పడిన వలస కార్మికులు.. ఇక నుంచి తమ గ్రామాలను, ప్రాంతాన్ని ప్రగతి పథంలో నిలపాలని మోదీ ఆకాంక్షించారు.

ఈ రోజు చారిత్రాత్మకమైందన్న మోదీ.. పేదల సంక్షేమం, ఉపాధి కోసం భారీ పథకాన్ని ప్రారంభించామన్నారు. పల్లె ప్రాంతాల్లో నివసిస్తోన్న శ్రామికులైన మన సోదర సోదరీమణులకు, యువతకు, మన బిడ్డల కోసం ఈ పథకాన్ని అంకితం చేస్తున్నానని మోదీ తెలిపారు.

మన దేశంలో ఆరు లక్షలకుపైగా గ్రామాలున్నాయన్న మోదీ.. మూడింట రెండొంతుల జనాభా పల్లెల్లోనే నివసిస్తున్నారన్నారు. గ్రామాల్లో నివసిస్తోన్న 80-85 కోట్ల మంది.. గ్రామీణ భారతానికి కరోనా విస్తరించకుండా సమర్థవంతంగా నిరోధించారన్నారు. యూరప్ మొత్తం జనాభా కంటే భారత జనాభా ఎక్కువ.. అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా జనాభాను కలుపుకున్న మన దేశ జనాభానే ఎక్కువ అని మోదీ తెలిపారు.

ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్ లాంటి వలస కూలీలు ఎక్కువగా ఉన్నారు. వీరికి ప్రయోజనం చేకూర్చేలా గ్రామీణ్ కళ్యాణ్ యోజన ఉంటుంది. వలస కార్మికులు ఆయా జిల్లాల్లోని గ్రామాలు కామన్ సర్వీస్ సెంటర్లు, కృషి విజ్ఞాన్ కేంద్రాల ద్వారా ఈ పథకంలో చేరవచ్చు.

Famous Books:






modi scheme labours, pmsym scheme, labour scheme, ministry of labour and employment, maan-dhan yojana online form, labour department, pm scheme, pmsym status, child labour schemes

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు