ఖైరతాబాద్ గణేష్ 2020 | Journey Khairthabad Ganesh | Khairthabad Ganapati History
ధన్వంతరి నారాయణ మహా గణపతి - ఖైరతాబాద్ :
దేశ వ్యాప్తంగా పేరు పొందిన ఖైరతాబాద్ గణేషుడికి నేటితో 66 సం చరిత్ర కలిగి ఉన్నది. ప్రపంచ వ్యాప్తంగా ఖైరతాబాద్ గణపతి అనగానే భారీ వినాయకుడు అనే పేరు గుర్తుకు వస్తుంది. 1954 మొదటి సారి ఒక్క అడుగుతో ప్రారంభం చేశారు ఆ ప్రాంత కౌంస్సేలర్ సింగరి శంకరయ్య గారు. స్వాతంత్ర్య పోరాటంలో బాలగంగాధర్ తిలక్ ఇచ్చిన పిలుపు మేరకు ఖైరతాబాద్ ప్రాంతంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఉత్సవాలు ప్రారంభించారు. అలా ప్రతి ఏటా ఒక్కో అడుగు పెరుగుతూ విగ్రహన్ని ఏర్పాటు చేశారు. 1979 లో 20 అడుగుల వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ప్రతిష్ట చేశారు. 1981 లో 25 అడుగుల నాట్య వినాయకుడు గాను , 1982 లో ముషీక వాహన వినాయకుడు చేయడం వల్ల అప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా ఈ గణపతి కి పేరు లభించినది. 1987 నుంచి క్రమంగా పెంచుతూ వెళ్లారు. 2015లో 60అడుగుల భారీ గణపతి తయారు చేశారు. సింగరీ శంకరయ్య మరణ అనంతరం ఆయన సోదరుడు సింగరీ సుదర్శన్ ఆధ్వర్యంలో ఈ ఉస్తావాలు జరుగుతున్నాయి. అప్పటి కాలంలో కేవలం పాతబస్తి , ధూల్ పేట్ , కింగ్ కోటి , ఖైరతాబాద్ లో మాత్రమే ఈ ఉత్సవాలు జరిగేవి. 1985 వరకు ఖైరతాబాద్ గణపతిని నెల రోజుల వరకు జరిపి దసరా రోజు నిమార్జనం చేసేవారు.
1954 లో వినాయకుడిని ఒక చిన్న గ్రంధాలయాలో ప్రతిష్ట చేశారు. అలా భక్తుల తాకిడి పెరగడం పెరిగి పెరిగి భారీ స్థాయి లో నిర్వహించడం జరిగినది. ఒక్క అడుగుతో మొదలు చేసి 62 అడుగుల వరకు వెళ్ళి భక్తుల హృదయలలో నిలిచిపోయాడు ఖైరతాబాద్ వినాయకుడు. చరిత్రలోనే మొదటిసరిగా మట్టి వినాయకుడు గా దర్శనం ఇవ్వనున్నాడు ఈ సం మన ఖైరతాబాద్ గణపతి. 11 రోజుల అనంతరం అక్కడే నిమర్జనం చేయనున్నారు.
ఆరోగ్యానికి ఆది దేవుడు ధన్వంతరి దేవుడు. ప్రస్తుతం ప్రపంచం అంతా కరొన బారిన పడి విలవిలడుతోంది. ఈ సమయంలో సకల విఘ్నాలు తొలగి విజ్ఞేశ్వరుడు అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించేలా ఈ ఏడాది శ్రీ ధన్వంతరి నారాయణ మహా గణపతిగా దర్శనం ఇస్తున్నాడు. సహజమైన బంకమట్టితో స్వామి వారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తద్వారా పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడిన వారు అవూతాము అని కమిటీ ఉద్దేశం.
గత సం అత్యధికంగా 62 అడుగుల ద్వాదశ ఆదిత్యుల గణపతిగా దర్శనం ఇచ్చారు. కానీ ఈ సం || 9 అడుగుల ధన్వంతరి నారాయణ మహా గణపతిగా ఏర్పాటు చేశారు. ఈ గణపతిని ఏర్పాటు చేయడానికి బీహార్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ లో సుమారు 30 మంది కార్మికులు పని చేశారు. 22 న స్వామి వారి పూజ ప్రారంభం చేసి సెప్టెంబర్ 1న 9 కలశాలతో అభిషేకం చేసి అక్కడే నిమార్జనం చేస్తారు.
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరొన వైరస్ భారీ నుంచి అందరూ కొలుకొని ఆరోగ్యంతో ఉండాలి అని కోరుకుందాం. కానీ నేడు ఖైరతాబాద్ గణపతిని దర్శించుకునేందుకు భక్తులు రావొద్దుని ఉత్సవ కమిటీ సూచించినది. భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడం వల్ల కరొన సోకే ప్రమాదం ఉందని కావున భకులు www.ganapathideva.org ద్వారా ఆన్లైన్లో గణనాధునని దర్శించుకోవచ్చు అని తెలిపింది. తెల్లవారుజామున 5గంటల నుంచి 10.30 వరకు మళ్లీ సాయంత్రం 4 గంటల నుంచి 10 గంటల వరకు అతి కొద్ది మందిని మాత్రమే దర్శనలకు అనుమతిస్తున్నారు.
keywords : Khairthabad Ganapati , Khairthabad Ganapati 2020 , Journey of Khairthabad Ganapati, Khairthabad Ganapati history,
Today Tirumala Darshan Information:
తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు.
Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX
సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు
a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం
b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం
c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు
Comments
Post a Comment