తిరుమల వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం 2023 - టిక్కెట్ల ధర, కోటా మరియు బుకింగ్ వివరాలు | Tirumala Vaikuntha Ekadashi Dwara Darshan 2023 Booking Details
తిరుమల బ్రేకింగ్ న్యూస్ ...
డిసెంబర్ నెల వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్స్ విడుదల తేదీ మరియు టిక్కెట్ల ధర, బుకింగ్ వివరాలు.
వైకుంట ఏకాదశి SED & శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్లు నవంబర్ 10 న ఆన్లైన్ ద్వారా విడుదల చేయబడతాయి.
2023 డిసెంబర్ 23 నుండి జనవరి 1వ తేదీ వరకు పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల ఆన్ లైన్ కోటాను నవంబర్ 10వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు టిటిడి విడుదల చేయనుంది.
భక్తులు ఈ విషయాన్ని గమనించి దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని కోరడమైనది.
తిరుమల వైకుంట ద్వారం డిసెంబర్లో 23న తెరవబడుతుంది. వైకుంట ద్వారం డిసెంబర్ 23వ తేదీ, ఉదయం 3:00 గంటల నుండి జనవరి 1వ తేదీ వరకు, 11:59pm వరకు తెరవబడుతుంది.
శీఘ్ర దర్శనం కోసం ఒక్కొక్కటి రూ. 300 ధరతో 22,500 టిక్కెట్లను టిటిడి జారీ చేస్తుంది, అయితే 10 రోజులకు 2,25,000 టిక్కెట్లు విడుదల చేయబడతాయి.
ప్రతిరోజూ 2,000 శ్రీవాణి టిక్కెట్లు విడుదల చేయబడతాయి. మరియు 10 రోజులకు 20,000 టిక్కెట్లు విడుదల చేయబడతాయి.
తిరుమల వసతి డిసెంబర్ 25 నుండి జనవరి 1 వరకు అందుబాటులో ఉంటుంది. నవంబర్ 13న విడుదల అవుతుంది.
మరియు డిసెంబర్ 22,23,24 తేదీలలో గదులు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉండవు. తిరుమల నేరుగా వచ్చి వసతి తీసుకోవాలి. ఆన్లైన్ లో విడుదల చేయబడవు.
Tags: ttd, tirumala, vaikunta ekadasi, ekadasi, mukkoti ekadasi, ttd tickets, vaikunta ekadasi tickets
Comments
Post a Comment