Drop Down Menus

ఇంటికి వచ్చిన సుమంగళికి పసుపు,కుంకుమ ఎందుకు ఇవ్వాలి? Pasupu Kunkuma Importance | Dharma Sandesalu

పసుపుకుంకుమ:

మన సనాతన సంప్రదాయంలో ఎన్నో ఆచారాలు ఉన్నాయి. చాలామంది వాటిని చాదస్తం అని కొట్టిపారేస్తుంటారు. కాని వాటి వెనుక సైన్స్‌ దాగి వ్ఞందని శాస్త్రీయంగా నిరూపించబడింది. ఆచారాలలో మనం ఎప్పటికి మరువలేనివి నిత్యం ఉపయోగించేవి పసుపు, కుంకుమ. ముందుగా కుంకుమ స్త్రీలు నుదుట కంకుమని దిద్దుకుంటారు.

ఇంట్లో పూజ చేసినప్పుడు గుడికి వెళ్లి దేవ్ఞడ్ని దర్శించినప్పుడు తప్పనిసరిగా చేసే నియమం. ఈ కుంకాన్ని ఐదారు వందల సంవత్సరాల క్రితం వరకు హిందూమతస్తులందరూ తప్పనిసరిగా కుంకుమను నొసట దిద్దుకొనే ఆచారం ఉండేది. ముఖ్యంగా శైవవైష్టవ మతస్తులు అందరూ నొసట కుంకుమ పెట్టుకోవడం గొప్పగా భావిస్తారు. కుంకమనే కాకుండా మంచి గంధాన్ని, విభూదిని కూడా దిద్దుకునేవారు.

Also Read నక్షత్ర దోషాలంటే ఏమిటి..?ఏ ఏ నక్షత్రవాళ్లకు దోషాలుంటాయి.?

రెండు కనుబొమ్మల మధ్య కుంకుమ దిద్దటం వల్ల మనిషికి దృష్టిదోషం తగలదని ఒక నమ్మకం.

ఎర్రని కుంకమ, మనిషి నిగ్రహశక్తిని, కాక త్యాగనిరతిని, పరోపకార గుణాన్ని కల్గిస్తాయని మరో నమ్మకం. కుంకుమ స్త్రీల ఐదవ తనానికీ, సౌభాగ్యానికి, స్థిరబుద్ధికి సంకేతం అని చెప్పవచ్చు. పూర్వ భర్తను కోల్పోయిన స్త్రీలు పరులెవ్వరికి అందంగా కనిపించకూడదు అన్న భావనతో కుంకుమను పెట్టుకొనేవారు కాదు. కుంకుమ సంస్కృతికి చెరగని ముద్ర. ఇది హైందవ సంప్రదాయం. మనవేదాలు, శాస్త్రాలు, పురాణాలు కూడా కుంకమ దాని విశిష్టత గురించి చెబుతున్నాయి. ఇక పసుపు, కుంకుమ జతకలపి చేసే కార్యక్రమాలు ఎన్నో. ఇంటి గడపకు, పసుపురాని, కుంకమబొట్టు పెడతారు. సంక్రాంతి ముగ్గుల్లో మరి గొబ్బెమ్మలకు ఎక్కువగా పసుపు, కుంకుమనే వాడతారు. శుభకార్యాలకు పిలిచేటప్పుడు కుంకుమను ఆ ఇంట్లో వ్ఞన్న స్త్రీల నుదుట పెట్టి, పెరంటానికి, శుభకార్యాలకు పిలుస్తారు.

పెళ్లికి ముందు నిశ్చయతాంబులాలో ఎక్కువగా, పసుపు, కుంకుమనే ఉపయోగిస్తారు. గృహప్రవేశాలకు, జన్మదిన, పెళ్లిశుభలేఖలకు పసుపు రాసి కుంకుమ బొట్టుపెట్టి పిలుస్తారు. గృహప్రవేశ సమయంలో గుమ్మడి కాయలను గడపముందు కొట్టి వాటిమీద ఎర్రటి కుంకమ చల్లుతారు. దసరా పండుగ సందర్భంగా ఆలయాలలో అమ్మవారికి కుంకుమార్చనలను నిర్వహిస్తారు. పిమ్మట ఆ కుంకుమను ముతైదువులకు పంచుతారు. ఇక దేవతలకే కాక దేవ్ఞడికి కూడా కుంకమ ఇష్టమని చెప్పవచ్చు.

ఆ దేవుడు ఎవరో కాదు సీతమ్మ, రామయ్యకు ఇష్టమైనవాడు హనుమంతుడు. హనుమాన్‌ దేవాలయాల్లో హనుమాన్‌ విగ్రహాలన్నీ నారింజ రంగులో ఉంటాయి. దానికి కారణం ఒకరోజు సీతాదేవి నుదుట సింధూరం దిద్దుకోవడం చూసిన హనుమాన్‌ అది ఎందుకు తల్లి అని అడిగాడు. అప్పుడు సీతాదేవి రాముని ఆయుష్యు కోసం అంది.

వెంటనే రామభక్తుడైన హనుమాన్‌ ఒళ్లంతా సింధురాన్ని దిద్దుకున్నాడంటా. ఇంతటి విశిష్టత కల్గిన కుంకమను ఇటీవల కాలంలో స్త్రీలు, ఫ్యాషన్‌ పేరుతో దూరం చేస్తున్నారనే చెప్పాలి.

అలాకాకుండా మన సంస్కృతిలో భాగమైన పసుపు, కుంకుమలను నిత్యం ఉపయోగిస్తూ ముందు తరాల వారికి ఆదర్శంగా నిలుద్దాం.

Famous Posts:

అన్నం తినే ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాలి.. 


నవగ్రహాలను పూజిస్తే బాధలు తీరుతాయా ? 


భార్య, భర్తల మధ్య మనస్పర్థలు వచ్చినప్పుడు ఈ స్తోత్రం పఠించండి. 


ఆదివారం అత్యంత శక్తివంతమైన రోజు.


అన్నం తినే ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాలి.


నవగ్రహాలను పూజిస్తే బాధలు తీరుతాయా ? 


భర్త భార్యను ఇలా పిలవడం మానేయండి. 


తుల‌సి_చెట్టు మారే స్థితిని బ‌ట్టి ఆ ఇంట్లో ఏం జ‌రుగుతుందో ముందే చెప్ప‌వ‌చ్చ‌ట‌


చండీ హోమం ఎందుకు చేస్తారు? చండీ హోమము విశిష్టత ఏమిటి?

పసుపు, కుంకుమ, Pasupu, Kumkuma, Kumkuma Importance, kumkum powder benefits, significance of sindoor, sanathana dharma, dharma sandeshalu telugu.

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.