ఓం నమో వేంకటేశాయ .. హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ఈ కార్యక్రమం గురించి రాయడానికి ప్రధాన కారణం మొన్న మా గ్రామం (విరవ , పిఠాపురం మండలం , కాకినాడ జిల్లా ) లో నడివీధి రామాలయాన్ని రోజుకొరకు చొప్పున రామాలయాన్ని శుభ్రం చేసి దీపారాధన చేయడానికి పిల్లలు ముందుకు వచ్చారు , ఆ విషయాన్ని పేస్ బుక్ లో షేర్ చేశాను , చాలామంది పిల్లలను అభినందిస్తూ కామెంట్ లు పెట్టారు కొందరు నాకు ఫోన్ చేసి మీ గ్రామం లో మీరు చాలానే కార్యక్రమాలు చేసారు కదా వాటి గురించి కూడా తెలియచేయండి వేరే గ్రామం లో కూడా ఎవరో ఒకరు మీలా మొదలు పెట్టవచ్చు కదా అన్నారు దానితో ఇలా షేర్ చేస్తున్నాను .
ఈ కార్యక్రమానికి అథితులుగా విచేసినటువంటి
RSS నుంచి శ్రీ రామచంద్రరావు గారు , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర EO ల ప్రెసిడెంట్ శ్రీ దారబాబు గారు , EO కాట్నం మోహన్ గారు , తొలి తిరుపతి దేవస్థానం అర్చకులు శ్రీ రవి గారు , భగవద్గీత హైందవి శ్రీ అశోక్ గారు , మా పిల్లలకు విష్ణు సహస్రం నేర్పించిన శ్రీ దర్భకా వేంకటేశ్వర శర్మగారు , మా గ్రామ ఉపాధ్యాయులు శ్రీ ఆచార్య మాస్టారు మరియు శ్రీను మాస్టారికి ధన్యవాదాలు
కార్యక్రమ నిర్వహణకు స్పాన్సర్ చేసినవారు శ్రీ వెంకట్ గారు , శ్రీ కుక్కులూరు నూకరాజు గారు , శ్రీ కురుమళ్ల రాంబాబు గారు , శ్రీ జెమినీ రమేష్ గార్లకు ప్రత్యేక నమస్కారాలు .