Drop Down Menus

టీటీడీ గుడ్ న్యూస్..వారికి మాత్రమే ఉచితంగా కారు సౌకర్యంతో స్వామివారి దర్శనం - Free Darshan For Senior Citizens Tirumala

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్​న్యూస్​ చెప్పింది. కారు సౌకర్యంతో ఉచితంగా స్వామి వారిని దర్శించుకునేందుకు వీలుగా నిర్ణయం తీసుకుంది.

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేల మంది భక్తులు తిరుమల కొండకు తరలి వెళ్తుంటారు. వయసుతో సంబంధం లేకుండా ఆ ఏడుకొండలవాడిని కనులారా చూసి మొక్కులు చెల్లిస్తారు. ఇదిలా ఉంటే స్వామి వారి దర్శనానికి వచ్చే దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్‌‌‌కు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్​న్యూస్​ చెప్పింది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

తిరుమల శ్రీనివాసుడి దర్శనం కోసం వచ్చే దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్‌ విషయంలో‌‌ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎటువంటి టెన్షన్​ లేకుండా నేరుగా వేంకటేశ్వరస్వామి ఉచిత దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. కేవలం వారి కోసమే రోజులో ఒకసారి ప్రత్యేక స్లాట్​ ఏర్పాటు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి స్వామి వారిని దర్శించుకునేందుకు అనుమతించనుంది.

ఆలయం బయట గేట్ వద్ద ఉన్న కార్ పార్కింగ్ ప్రాంతం నుంచి కౌంటర్ వరకు ప్రత్యేక ఎలక్ట్రిక్ కారు అందుబాటులో ఉంటుందని టీటీడీ తెలిపింది. వృద్ధులు, దివ్యాంగుల స్లాట్ సమయంలో మిగతా ఇతర క్యూలు నిలిపివేస్తారని.. ఎలాంటి ఇబ్బంది లేకుండా కేవలం 30 నిమిషాల్లోనే స్వామి వారిని దర్శించుకుని బయటకు రావొచ్చని తెలిపారు. అలాగే దర్శనం చేసుకునే వృద్ధులు, దివ్యాంగులు రూ.20 చెల్లించి రెండు లడ్డూలను పొందొచ్చని.. అదనపు లడ్డూల కోసం ఒక్కో దానికి రూ.25 చెల్లించాల్సి ఉంటుందని టీటీడీ తెలిపింది.

ఎవరు అర్హులు:

  • వృద్ధులకు వయసు 65 సంవత్సరాలు నిండి ఉండాలి.
  • దివ్యాంగులు, ఓపెన్ హార్ట్​ సర్జరీ, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్, పక్షవాతం, ఆస్తమా లక్షణాలున్న ఉన్న వ్యక్తులు కూడా తిరుమల ఉచిత దర్శనం చేసుకోవచ్చని అధికారులు వివరించారు.
  • ఒకవేళ వృద్ధులు వాళ్లకై వాళ్లే నిలుచోలేని పక్షంలో ఒక వ్యక్తికి అనుమతి ఉంటుందని.. అటెండర్‌గా జీవిత భాగస్వామికి మాత్రమే అనుమతి ఉంటుంది.

దర్శన సమయంలో కావాల్సిన పత్రాలు:

  • ఐడీ ప్రూఫ్‌గా ఆధార్ కార్డు తప్పనిసరి.
  • దివ్యాంగులు తప్పనిసరిగా వారి ఐడీ కార్డుతో పాటు.. ఫిజికల్ ఛాలెంజ్డ్ సర్టిఫికెట్, ఆధార్ కార్డుతో రావాలి.
  • వృద్ధులు, దివ్యాంగులు కాకుండా పైన తెలిపిన ఆరోగ్య సమస్యలు ఉన్న వారు సంబంధిత సర్జన్ / స్పెషలిస్ట్ జారీ చేసిన మెడికల్ సర్టిఫికేట్, ఆధార్ కార్డుతో రావాలి.

స్లాట్ ఇలా బుక్ చేసుకోవాలి:

వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శనం స్లాట్ కోసం టికెట్‌ను ఆన్​లైన్​లో తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్​సైట్​ ద్వారా బుక్​ చేసుకోవాలి. అందుకోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఉచితంగానే టికెట్ బుక్ చేసుకోవచ్చు.

  • ముందుగా టీటీడీ వెబ్​సైట్​ Tirumala Tirupati Devasthanam(Official Booking Portal)ఓపెన్​ చేయాలి.
  • హోమ్​పేజీలో Online Services​ ఆప్షన్​పై క్లిక్​ చేసి Differently Abled/Sr.Citizen Darshan ఆప్షన్​పై క్లిక్​ చేసుకోవాలి.
  • తర్వాత మొబైల్​ నెంబర్​, ఓటీపీ సాయంతో లాగిన్​ అవ్వాలి.
  • ఇప్పుడు Category ఆప్షన్​లో Senior Citizen/Medical Cases/Differently Abled ఈ మూడింటిలో ఒక ఆప్షన్​ను సెలక్ట్​ చేసుకోవాలి.
  • తర్వాత మీరు ఏ రోజు స్వామి వారిని దర్శించుకోవాలనుకుంటున్నారో ఆ తేదీని సెలక్ట్​ చేసుకోవాలి.
  • తర్వాత మిగిలిన వివరాలు నమోదు చేసి టికెట్​ బుక్​ చేసుకోవాలి.

TAGGED: TTD LATEST NEWS, TTD FREE DARSHAN, FREE DARSHAN FOR SENIOR CITIZENS, FREE DARSHAN FOR AGED PERSONS, FREE DARSHAN FOR SENIOR CITIZENS

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

Post a Comment

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.