Drop Down Menus

Famous Temples List In Mahabubnagar District | Telangana State

మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రముఖ దేవాలయాలజాబితా :

1. శ్రీ జోగుళాంబ అమ్మవారి ఆలయం , అల్లం పూర్ :

అష్టాదశ శక్తి పీఠలలో ఈ ఆలయం ఒకటి. ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఆలయం పూర్తిగా ఎర్ర రాయి తో నిర్మించారు. అమ్మవారు ఉగ్ర స్వరూపిణి గా ఉండడం గమనించవచ్చు. వసతి సౌకర్యాలు తక్కువ. అమ్మవారి ఆలయం పక్కనే నది ప్రవహిస్తూ ఉంటుంది. 

ఆలయ దర్శించే సమయం : 5.00AM TO 12.00PM - 4.00PM TO 7.30PM.

2 శ్రీ ఉమా మహేశ్వర స్వామి ఆలయం , ఉమా మహేశ్వరం :

హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే దారిలో ఈ ఆలయం కలదు. నల్లమల్ల అటవీ ప్రాంతంలో 100 కి.మీ దూరంలో ఈ ఆలయం కలదు. ఈ ఆలయం ప్రకృతి రమణీయల మధ్య చాలా బాగా ఉంటుంది. ఈ ఆలయం రంగాపురం అనే గ్రామనికి 4 కి. మీ దూరంలో కలదు. ఈ ఆలయంలో స్వామి అమ్మవారు ఉమామహేశ్వర స్వామి గా కొలువై ఉన్నారు. శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. 

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 4.00PM TO 7.30PM.

3. శ్రీ శివాలయం , సలేశ్వరం :

ఈ ఆలయం నల్లమల్ల అటవీ ప్రాంతంలో కలదు. మున్నర్ ప్రాంతానికి 35 కి. మీ దూరంలో కలదు. శ్రీశైలం నుంచి వచ్చే దారిలో 65 కి. మీ దూరంలో కలదు. ఈ ఆలయం కేవలం 5 రోజులు మాత్రమే తెరిచి ఉంటుంది. కేవలం శివరాత్రి నుంచి 4 రోజుల ముందు నుంచి మాత్రమే. ఈ ఆలయానికి చేరుకోవాలి అంటే ఎంతో మనోధైర్యం కూడా ఉండాలి. 

ఆలయ దర్శించే సమయం : 6.00AM - 5.30PM.

4 శ్రీ మైసమ్మ ఆలయం , మైసిగండి :

ఈ ఆలయంలో అమ్మవారు మైసమ్మగా పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయంలో విశేషం అమ్మవారు 20 అడుగుల ఎత్తులో పుర్రెల మాల ధరించి ఉంటుంది. ప్రతి ఆదివారం మరియు మంగళ వారం లలో బోనాల ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. నూతన వాహనాల పూజలు కూడా నిర్వహిస్తారు. 

ఆలయ దర్శించే సమయం : 7.00AM TO 12.30PM - 1.00PM TO 7.00PM.

5. శ్రీ చెన్నకేశవా ఆలయం , గద్వాల్ :

ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం గంగాపూర్ , జడ్చర్ల (మ) లో కలదు. శివ స్వామి యే చెన్నకేశవా గా పూజలు అందుకుంటున్నారు. శివరాత్రి ఉత్సవాలు బాగా జరుగుతాయి. 

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 4.00PM TO 7.30PM.

6. శ్రీ అగస్త్య స్వామి ఆలయం , జీఠళ్ళూరు :

కొల్హాపూర్ నుంచి ఈ ఆలయానికి 11 కి. మీ దూరంలో కలదు. ఈ ఆలయం 16 వ శతాబ్దం కి చెందినది. శివరాత్రి , కార్తీక మాస శివరాత్రి , తొలి ఏకాదశి వాటి పండుగలలో రద్దీ అధికంగా ఉంటుంది. 

ఆలయ దర్శించే సమయం : 6.30AM TO 1.00PM - 3.00PM TO 8.30PM.

7. శ్రీ మహాలక్ష్మి , వేంకటేశ్వర స్వామి ఆలయం , కొండగల్ :

ఈ ఆలయం కొండగల్ అనే గ్రామం లో కలదు. ఈ ఆలయాన్ని 1970 నిర్మించారు. ఈ అలయని రెండవ తిరుపతి గా కూడ పిలుస్తారు. ఉగాదికి 4 రోజుల ముందే ఇక్కడ స్వామి అమ్మవార్లకి బ్రమోస్తావాలు ప్రారంభం అవుతాయి. ప్రతి శుక్ర , శనివారం లలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. 

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 4.00PM TO 7.30PM.

8. శ్రీ రంగనాయక స్వామి ఆలయం , శ్రీ రంగాపూర్ :

ఈ ఆలయం శ్రీ రంగాపూర్ అనే గ్రామం , పిబరర్ (మ) లో కలదు. ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. 18 వ శతాబ్దానికి చెందినది. విజయనగర శిల్పశైలి లో ఈ ఆలయం ఉంటుంది. శ్రీ రామనవమి ఉత్సవాలు వైభవంగా చేస్తారు.

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 4.00PM TO 7.30PM.

మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తగా చేర్చిన ఆలయాల వివరాల కొరకు ఇక్కడ చేయండి. 

Telangana Temples District Wise List



KeyWords : Mahabubnagar Famous Temples List, Mahabubnagar District Surrounding Temples, Telangana Famous Temples List, Hindu Temples Guide
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.