Drop Down Menus

Famous Temples List In Nizamabad District | Telangana State

నిజామాబాద్ జిల్లాలోని ప్రముఖ దేవాలయాల జాబితా :

1. శ్రీ రామాలయం , డిచ్ పల్లి :

ఈ ఆలయం డిచ్ పల్లి రామాలయం లేదా ఖిలా రామాలయం అని పిలుస్తారు. ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. 14 వ శతాబ్దానికి చెందినది. కాకతీయుల రాజు చే నిర్మించబడినది అక్కడి శాసనాల ఆధారంగా తెలుస్తుంది. ఈ అలయాన్నికి 105 మెట్లు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి 160 కి. మీ మరియు నిజామాబాద్ నుంచి 15 కి. మీ దూరంలో కలదు. శ్రీ రామనవమి ఉత్సవాలు వేడుకలు ఘనంగా జరుగుతాయి. 

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 4.00PM TO 7.30PM.

2. శ్రీ నరసింహ స్వామి ఆలయం , బెల్లం(నింబద్రి) :

ఈ ఆలయం చాలా పురాతన ఆలయం . నిజామాబాద్ జిల్లాలో భీంగల్ అనే గ్రామం కి 5 కి.మీ దూరంలో కలదు. ఈ  ఆలయాన్ని దక్షిణా బదరీనాథ్ గా కూడా పిలుస్తారు. ఈ ఆలయ ప్రత్యేకత స్వామికి బిల్వ పత్రాలతో పూజ చేస్తారు. 100 సం || చరిత్ర ఈ ఆలయానికి కలదు. 

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 3.30PM TO 7.30PM.

3. శ్రీ హనుమాన్ ఆలయం , సారంగాపూర్ :

ఈ ఆలయం సారంగాపూర్ గ్రామం నిజామాబాద్ కి 11 కి. మీ దూరంలో ఉన్నది. స్థానికంగా ఈ ఆలయం చాలా ప్రసిద్ది చెందినది. ఈ ఆలయాన్నికి 450 సం || చరిత్ర కలదు. హనుమాన్ జయంతి మరియు శ్రీ రామనవమి ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి. 
ఆలయ దర్శించే సమయం : 7.00AM TO 12.00PM - 4.00PM TO 8.00PM.

4. శ్రీ రఘునాథ్ స్వామి ఆలయం , కైల్వ :

ఈ ఆలయన్ని శ్రీ ఛత్రపతి శివాజీ గారు నిర్మించారు. క్రీ. శ 12 వ శతాబ్దానికి చెందినది. ఈ ఆలయంలో శ్రీ రామ నవమి ఉత్సవాలు బాగా నిర్వహిస్తారు. నిజామాబాద్ జిల్లా నైరుతి నుంచి 2 కి. మీ దూరంలో కలదు. ఈ ఆలయం లో విగ్రహాలు కూర్మ పీఠం పై ఉండడం ప్రత్యేకత. 

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 4.00PM TO 7.30PM.

5. శ్రీ సిద్దేశ్వర ఆలయం , భీఖుర్ :

ఈ ఆలయంలో స్వామి వారు స్వయంభూ. ఈ ఆలయం కామారెడ్డి నుంచి 15 కి. మీ రాయంపేట నుంచి 10 కి. మీ దూరంలో కలదు. శివరాత్రి రోజు స్వామి వారికి ఇక్కడ కళ్యాణం చేస్తారు. 

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 11.30AM- 4.00PM TO 7.30PM.

6. శ్రీ కాలభైరవ స్వామి ఆలయం , రాయగిరి , కామారెడ్డి :

ఈ ఆలయం కామారెడ్డికి 8 కి. మీ దూరంలో ఇస్సన్న పల్లి లో కలదు. ఈ ఆలయంలో ప్రత్యేకత భూత , ప్రేత , పిశాది వంటి వాటిని వదిలించడానికి ఈ ఆలయానికి చాలా మంది వస్తారు. 

ఆలయ దర్శించే సమయం : 7.30AM TO 12.00PM - 4.00PM TO 7.30PM.

7. నవనాధుల సిద్దేశ్వర ఆలయం, సిద్దంగూడ :

నిజామాబాద్ కి 26 కి. మీ దూరంలో ఆర్మూర్ గ్రామం లో కలదు. ఈ క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామి. నవనాధులచే ప్రతిష్టించిన ఈ ఆలయం ప్రత్యేక మైనది. 1960 సం || లో కేవలం మెట్ల మార్గం మాత్రమే ఉండేది. ఈ ఆలయం ప్రత్యేకత నల్లని పెద్ద గుట్ట క్రింద శివాలయం ఉన్నది. 

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 3.00PM TO 7.00PM.

8. శ్రీ ఎల్లమ్మ  ఆలయం :

ఈ ఆలయం చాలా పురాతన ఆలయం.12 వ శతాబ్దానికి చెందినది. రేణుక ఎల్లమ్మ గా గ్రామ ప్రజలు పిలుస్తారు. ప్రతి సం || అమ్మవారికి కళ్యాణం నిర్వహిస్తారు. దేవి నవరాత్రి వైభవంగా నిర్వహిస్తారు. 

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 4.00PM TO 7.30PM.

9. 100 స్తంభాల ఆలయం , భోదన్ :

నిజామాబాద్ జిల్లాలో భోదన్ గ్రామం లో ఈ ఆలయం కలదు. ఈ ఆలయం 915-927 ఇంద్ర నారాయణ గారు నిర్మించారు. ఈ ఆలయంలో కళా వైభవం ఎక్కువ. ఈ ఆలయం మొత్తం రాతి కట్టడం. ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఇటువంటి ఆలయం దేశం మొత్తం లో ఎక్కడ లేదు. కానీ నేడు ఈ ఆలయం శిధిలావస్తా కి చేరుకుంది. 

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 4.00PM TO 7.30PM.

నిజామాబాద్ జిల్లాలోని కొత్తగా చేర్చిన ఆలయాల వివరాల కొరకు ఇక్కడ చేయండి. 

Telangana Temples District Wise List



KeyWords : Nizamabad Famous Temples List, Nizamabad District Surrounding Temples, Telangana Famous Temples List, Hindu Temples Guide
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.