Drop Down Menus

నిలబడి అస్సలు నీరు తాగకండి ..తాగితే ఎంత డేంజ‌రో తెలుసా..? Why you should NEVER drink water standing up


మన దైనందిన జీవితంలో నీరు ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మనిషికి జీవన ఆధారం నీరు. ప్రతిఒకరు ఆరోగ్యంగా జీవించడానికి రోజు నీరు త్రాగడం చాలా ముఖ్యం అన్న సంగతి తెలిసిందే. ఇక సరైయన మోతాదులో నీరు తాగడం వల్ల దాదాపు 80 శాతం రోగాలను దూరం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా నిద్రించేందుకు ముందు గ్లాసుడు నీళ్లు తాగడం ద్వారా గుండెపోటును దూరం చేసుకోవచ్చు. అలాగే స్నానానికి ముందు గ్లాసుడు నీళ్లు తాగితే రక్తపోటు తగ్గుతుంది.

అందుకే ప్రాణాధారం నీరే అంటారు.ఆరోగ్యంగా, అందంగా జీవించాలంటే శ‌రీరానికి స‌రిప‌డా నీరు తాగ‌డం చాలా ముఖ్యం.

శరీరంలో నీటి శాతం ఎప్పుడైతే త‌గ్గుతుందో రకరకాల జబ్బులు మ‌న‌ల్ని చుట్టుముట్టేస్తాయి.ఇక మనిషి హైడ్రేటెడ్ గా ఉండాలన్నా, అదనపు క్యాలరీలు బర్న్ కావాల‌న్నా, అనేక జ‌బ్బుల‌కు చెక్ పెట్టాల‌న్నా. ప్ర‌తి రోజు క‌నీసం రోజుకు రెండు నుంచి మూడు లీట‌ర్ల‌ నీరు తాగ‌ల‌ని వైద్యులు సైతం ఎప్ప‌టిక‌ప్పుడు చెబుతూనే ఉంటాయి.

పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మేలు అనే సామెత వినే ఉంటారు.కానీ, నిల‌బ‌డి నీళ్లు తాగడం చాలా డేంజ‌ర్ అంటున్నారు నిపుణులు.

సాధారణంగా చాలా మంది నిలబడి నీళ్లు తాగుతుంటారు. మరికొందరు హడావుడిగా నీళ్లు తాగేస్తుంటారు. కానీ, ఇలా చేయడం ఆరోగ్యానికి చాలా డేంజర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

1. ఆర్థ్రరైటిస్ వచ్చే అవకాశం:
నిలబడి నీరు తాగితే ఆ నీరు చాలా స్పీడ్ గా కిందకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి జాయింట్స్ లో చేరుతుంది. దీని వల్ల పెద్ద వయసులో ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంది.

2. జీర్ణ సమస్యలు:
నిలబడి నీరు తాగితే ఆ నీరు పొట్ట లోపల జల్లులా పడుతుంది. దీనివల్ల జీర్ణకోశం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. దీని వల్ల జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. కూర్చుని నీరు తాగినప్పుడు శరీరం రిలాక్స్డ్ గా ఉంటుంది కాబట్టి ఆ నీటిని చక్కగా అబ్జార్వ్ చేసుకుంటుంది. అందువల్ల అరుగుదల బావుంటుంది.

3. దాహం తీరదు:
సరైన పొజిషన్‌లో నీళ్ళు తాగాకపోతే గ్లాసు నిండా నీళ్ళు తాగినా సరే దాహం తీరినట్టుండదు. కూర్చుని కాసిన్ని నీరు తాగినా దాహం తీరుతుంది.

4. కిడ్నీ పని తీరుని ప్రభావితం చేస్తుంది:
నిలబడి నీరు తాగుతున్నప్పుడు ఆ నీటిని సరిగ్గా ఫిల్టర్ చేసేందుకు కిడ్నీలకి ఛాన్స్ ఉండదు. తద్వారా కిడ్నీల్లోనూ, బ్లాడర్ లోనూ మలినాలు పేరుకుపోతాయి. దీనివల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్స్ రావడమే కాక ఒక్కోసారి కిడ్నీలు పర్మినెంట్ గా డామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. మూత్రపిండాలు కూడా కూర్చుని తాగినపుడు సమర్థవంతంగా పనిచేస్తాయట.

5. గుండెలో మంట:
నిలబడి నీళ్ళు తాగడం ఈసోఫేగస్ మీద ప్రెజర్ ని పెంచుతుంది. అందువల్ల పొట్టలోని ఆసిడ్స్ వెనక్కి వెళ్తాయి. దానివల్లే మనకి ఒక్కోసారి నీళ్ళు తాగగానే గుండెలో మంట గా అనిపిస్తుంది.

6. పోషకాలు అందవు:
కూర్చుని నీరు తాగినప్పుడు నీటిలోని న్యూట్రియెంట్స్ ని శరీరం అబ్జార్వ్ చేసుకుంటుంది. నిలబడి నీళ్ళు తాగితే అది జరగదు.

7. ఎముకలు బలహీనపడతాయి:
రాంగ్ పొజిషన్ లో నీళ్ళు తాగడం వల్ల శరీరం నీరసపడుతుంది. ఎముకలు కూడా బహహీనపడతాయి.

8. నరాల సమస్యలు:
నిలబడి ఉన్నప్పుడు శరీరం లో టెన్షన్ ఉంటుంది. ఆ పొజిషన్ లో నీళ్ళు తాగినప్పుడు నరాల సమస్యలకి దారి తీస్తుంది.

10. ఆసిడ్స్ ని డైల్యూట్ చెయ్యదు:
కూర్చుని కొంచెం కొంచెం గా నీరు తాగినప్పుడు శరీరంలోని ఆసిడ్ లెవెల్స్ సరిగ్గా ఉంటాయి. దీని వల్ల శరీర అన్ని క్రియలు సరిగ్గా జరుగుతుాయి. చల్లని నీరు కాకుండా కాస్త వేడిగా ఉన్న నీరు లేదా గోరు వెచ్చగా ఉండే నీరు తాగడం వల్ల రక్తనాళాల శుద్ధి, కొవ్వు పదార్థాలు తొలగిపోతాయి.

కూర్చుని కొంచెం కొంచెం గా నీరు తాగడం చాలా మంచిది. దీనివల్ల నీటిలోని న్యూట్రియెంట్స్ ని శరీరం సరిగ్గా అందుకోగలుగుతుంది. అంతే కాక నిలబడి నీరు తాగితే పెద్ద వయసులో మోకాళ్ళ నెప్పులూ, ఆర్థ్రైటిస్ వంటివి వచ్చే ఛాన్స్ పెరుగుతుంది.

మన పెద్దలు చెప్పిన మాట గుర్తుతెచ్చుకుని కూర్చుని నీరు తాగితే దాహం తీరుతుంది. అలా చేయడం వచ్చే వల్ల లాభాలే కాక మన పరుగుల జీవితంలో మనకి రెండు నిమిషాల విశ్రాంతి కూడా దొరుకుతుంది.
Famous Posts:
పంచముఖ ఆంజనేయ స్వామి వారి అవతార కథ

హనుమ నామస్మరణం సర్వపాప నివారణం

స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?

సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము

శనేశ్వరుడు శనివారాల నోము

శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత

శివదేవుని సోమవారపు నోము కథ

water, drinking, don't drink water standing, why should we drink milk while standing, standing and drinking water science, drinking water while standing research, drinking water while standing science, drinking water while standing webmd, drinking water while standing during pregnancy, what happens if we drink water while sitting
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

Post a Comment

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.