Drop Down Menus

ఈశ్వరానుగ్రహంతో అపమృత్యువు దూరం | How do you get a Shiva blessing? Lord Shiva

ఈశ్వరానుగ్రహంతో అపమృత్యువు దూరం..

పూర్వకాలంలో ఉజ్జయిని పట్టణంలో వేదప్రియుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి.. దేవప్రియుడు, ప్రియమేథుడు, సుకృతుడు, సువ్రతుడు అని నలుగురు కుమారులు. నలుగురూ సుగుణోపేతులే. తండ్రి ఎంత ధర్మానుష్ఠానపరుడో కొడుకులు కూడా అంతటి ధర్మానుష్ఠానపరులు.

ఆఊరి పక్కనే ఉన్న పర్వత శిఖరాల్లో ఒక రాక్షసుడున్నాడు. అతడి పేరు దూషణుడు. లోకంలో అందరినీ బాధపెడుతూ ఎక్కడా ఎవ్వరూ ఈశ్వరార్చన చేయలేని స్థితిని కల్పించాడు. ఉజ్జయినిలో ఈ నలుగురూ శివార్చన చేస్తున్న విషయం తెలుసుకున్న దూషణుడు వారి వద్దకు వచ్చి.. ‘మీరు పార్థివ లింగానికి అర్చన చేయడానికి వీలు లేదు. మీరు నన్ను మాత్రమే అర్చించాలి. నాకు మాత్రమే పూజలు చేయాలి. పశుపతి ఎంతటివాడు? అటువంటివాళ్లను నేను ఎందరినో గెలిచాను. మీరు శివపూజను విడిచిపెడతారా లేక లింగమును ధ్వంసం చెయ్యనా?’ అని అడిగాడు.

దూషణుడి మాటలకు వాళ్లు కొంచెం కూడా బెదరలేదు. ‘తుచ్ఛుడు.. వీడి ప్రలాపాలు వింటూ కూర్చుంటే సమయం వృథా అయిపోతుంది. హాయిగా మనం శంకరుడిని నమ్ముకుని ఉందాము.

శంకరుని రక్షణయందు ఉండగా మనకు భయం ఏమిటి!’ అని శివపూజపై మనసు లగ్నం చేశారు. దూషణుడు ఆ నలుగురి మీదకు కత్తి ఎత్తాడు. అయినా వాళ్లు కదల్లేదు. కనీసం కత్తికి బెదిరి చెయ్యి కూడా అడ్డుపెట్టకుండా.. ‘హరఓం హర హర’ అంటూ అలాగే కూర్చున్నారు.

ఏరూపంలో వస్తున్న మృత్యువునయినా ఈశ్వరుడు తప్పించగలడు. ఈశ్వరానుగ్రహం ఉన్నవాడు తప్పనిసరిగా రక్షింపబడతాడు. ఆ నలుగురు బ్రాహ్మణకుమారులూ దీన్నే నమ్మి మట్టితో చేసిన చిన్న పార్థివ లింగానికిఆరాధన చేస్తున్నారు. దూషణుడు వారిపైకి కత్తి ఎత్తగానే.. ఆ పార్థివలింగం నుంచి పరమేశ్వరుడు మహాకాళ స్వరూపంతో బయటకు వచ్చి కోపంతో ఒక్కసారి హుంకరించాడు. ఆ హుంకారానికి దూషణుడు, అతని సైనికులు బూడిదరాశులై పడిపోయారు. కానీ.. ఆ వేడి అక్కడే కూర్చున్న నలుగురు బ్రాహ్మణ కుమారులను మాత్రం ఏమీ చేయలేదు. వేడి ధర్మం కాల్చడమే. అగ్నిహోత్రం ఒకరిని కాల్చి వేరొకరిని వదలదు. కానీ, ఆ వచ్చిన వేడి పరమాత్మ స్వరూపం. అందుకే దూషణుని, అతని సైన్యాన్ని మాత్రమే కాల్చి స్వామి భక్తులైన ఆ నలుగురిని మాత్రం కాపాడింది.

అప్పుడు బ్రాహ్మణ కుమారులు ఆ స్వామిని.. చనిపోయేవారిని చంపకుండా మిగిల్చిన రూపంగా భావించి స్తోత్రం చేశారు. అంతమందిని చంపి.. అక్కడే ఉన్న తన భక్తులైన నలుగురిని వదిలిన రూపం. కాబట్టి అది మహాకాళ స్వరూపం. ఆ రూపాన్ని చూసి దేవతలు పొంగిపోయి స్వామిని స్తోత్రం చేశారు.

Also Readఅన్నం తినే ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాలి.. 

ఈశ్వరా మీరు ఇక్కడ లింగరూపంలో ఉద్భవించండి. ఇటువంటి సజ్జనులు, మీమీద పూనిక ఉన్నవాళ్లు, మీరు ఉన్నారని నమ్మినవాళ్లు ఎవరు ఇక్కడికి వస్తారో వారు అకాలంగా పడిపోకుండా అనుగ్రహించడానికి స్వయంభూలింగంగా ఉండాలి’ అని దేవతలు ఈశ్వరుడిని ప్రార్థించారు.

పరమేశ్వరుడు వారి కోరిక మేరకు అక్కడ మహాకాళ లింగంగా ఆవిర్భవించాడు. మనకు భయం వేసినప్పుడు ‘హరహర మహాదేవ శంభోశంకర’ అని పరమేశ్వరుని ధ్యానిస్తే తక్షణం మన భయం తొలగిపోతుంది. ఈశ్వరుడు అంతటా ఎప్పుడూ మనతోనే ఉంటాడు. వాయులింగమై వాయురూపంలో.. ఆకాశరూపంలో ఆకాశలింగమై ఆ స్వామి ఎప్పుడూ మనతోనే ఉంటాడు. ఈశ్వరానుగ్రహం ఉన్నవారికి అపమృత్యువు లేదు.

Famous Posts:

చాలామందికి  తెలియని గాయత్రీ మంత్రం రహస్యం


ప్రకారం ఇలాంటి వారు ఎప్పటికీ ధనవంతులు కాలేరు


ఇంటి ముందు ముగ్గులు ఎందుకు వెయ్యాలి ?


మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి


నక్షత్ర దోషాలంటే ఏమిటి..?ఏ ఏ నక్షత్రవాళ్లకు దోషాలుంటాయి..? 


అనుకున్న పనులన్నీ నెరవేరడం కోసం.. చక్కని పరిష్కారం..!!


భార్యాభర్తల అనుబంధం గురించి కొన్ని అమృత వాక్యాలు మీకోసం 


హిందూ సాంప్రదాయం ప్రకారం శుభ_అశుభశకునాలు –వాటి ఫలితాలు

lord shiva, Shiva, Mahadev, lord shiva history, Shiva Puja, lord shiva puja procedure, shiva pooja mantras, shiva mantra, ఈశ్వరానుగ్రహం, 

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.