Drop Down Menus

పెళ్లిలో తాళి కట్టేటప్పుడు మూడు ముళ్ళు విశిష్టత - Three thorns are special when tying thali in marriage

పెళ్ళిలో మూడు ముళ్ళు విశిష్టత..

హిందూ వివాహ సంప్రదాయం లో మాంగల్య ధారణ అనేది చాలా ప్రధానమైన ఘట్టం. మాంగల్యం అంటే మంచిది అని, ధారణ అంటే ధరించటం అని అర్ధం. పెళ్లికూతురి మెడలో పెళ్ళికొడుకు ఒకటి పెళ్లికూతురి తరుపు, రెండొవది పెళ్ళికొడుకు తరుపున, ఇలా రెండు మంగల్యాలను కడతాడు. అంటే మాంగల్యానికి రెండు బిళ్ళలు వ్రేలడతాయి.

ఈ మాంగల్యం రక్షణ, నమ్మకం, మనస్సాక్షికి ప్రతిరూపంగా, జీవితాంతం తోడు నీడగా ఉంటానని పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి అందరి ముందు ప్రమాణం చేస్తున్నాడనటానికి ప్రతీక. ఇంతకీ మూడు ముళ్ళకున్న దైవాంశిక పరమార్థం ఏంటో ఒకసారి తెలుసుకుందాం...

ప్రాచీనుల కాలం నుండి ప్రాచీనులు ‘మూడు' అనే అంకెకు ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారు.

దేవుళ్ళకు సంబంధించి:

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు.

సృష్టి పరంగా :

సృష్టి, స్థితి, లయలు మూడు అని మనకు తెలిసిందే.

ఆధ్యాత్మిక పరంగా :

ఆధి దైవిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మిక శాంతులు మూడు.

యాగంలో ప్రత్యేకంగా :

యాగానికి కావలసిన అగ్నులు మూడు.

తాంబూలంలో  :

ఆకు, వక్క, సున్నం ఈ మూడూ తాంబూలంకు ముఖ్యం.

యజ్ఞోపవీతం :

యజ్ఞోపవీతంలోని పోగులు మూడు. ఒక్కో పోగులోని లోపలి పోగులు మూడు. బ్రహ్మ సూత్రంలోని బ్రహ్మ సూత్రంలోని ముడులు మూడు.

మోక్ష్యం కోసం:

ధర్మ, అర్థ, కామ అనే మూడింటితో మోక్షాన్ని పొందటానికి.

మంగలసూత్రపు పేటలు మూడు, ముడులు కూడా మూడు. ఇవి కాక మరొక ముఖ్య విశేష విషయం ఏమిటంటే:

ప్రతీ వ్యక్తికీ మూడు శరీరాలుంటాయి :

స్థూల - సూక్ష్మ - కారణ శరీరాలు. ఇవి కాక మరొక ముఖ్య విశేష విషయం ఏమిటంటే: మాంసం, రక్తం, ఎముకలు - వీటన్నింటినీ కప్పే ఈ కనిపించే శరీరం స్థూల శరీరం. వ్యక్తిని ఆకర్షించేది ఈ శరీరమే(ఒడ్డు, పొడుగు, రంగు మొదలైన వాని ద్వారా) శరీరానికి ఆధారభూతుడైన జీవుడు నివసించే శరీరం సూక్ష్మ శరీరం జీవుడు అనుభవించవలసిన సుఖ దుఖా:లని అనుభవిస్తున్నాడా, లేదా అని సాక్షిభూతంగా పరమాత్మ చూసే శరీరం కూడా ఇదే. పూర్వ జన్మలో చేసిన ఏ పుణ్య పాపాల బాకీని తీర్చుకోవడానికి ఈ శరీరం పుట్టిందో అది కారణ శరీరం. రోగాలూ, నొప్పులూ, బాధలూ, మానసిక శాంతీ, ఆధ్యాత్మిక చింతనా ఏది వచ్చినా అది పూర్వ జన్మ సంస్కార ఫలితమే. అది ఈ శరీరానికి కలుగుతుంది.

విజ్ఞాన శాస్త్రం ప్రకారం ఆరోగ్యవంతునికి ఆరోగ్యవంతుడే పుట్టవలసి ఉన్నా, కారణ శరీరం ద్వారా అనారోగ్యవంతుడు పుట్టవచ్చు. చాలా మంది పుత్రులు తల్లిదండ్రులలాగ ఉండకపోవడానికి ప్రత్యక్షసాక్ష్యం కారణ శరీరం. ఇలా మూడు శరీరాలకు మూడు ముడులు వేస్తాడు వరుడు.

Famous Posts:

ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే


అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం


> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి


100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం


> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం


అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం


ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే


గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?

పెళ్ళి, మూడు ముళ్ళు, మంగళసూత్రం, talibottu, marriage, pelli, tali kattadam, mangala sutram

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.