Drop Down Menus

పితృదేవతలకు భోజనం ఎలా అందుతుంది? How do Pitru devathalu receive food?

పితృదేవతలకు భోజనం ఎలా అందుతుంది?

శ్రాద్ధపక్షంలో పితరుల శాంతికోసం బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. దీనివల్ల పితృదేవతలు తృప్తి చెందుతారు. ఈ విషయమై కొన్ని సందేహాలు సహజంగా కలుగుతాయి.

మొదటిది- బ్రాహ్మణునికి ఇచ్చిన భోజనంతో పితృదేవతలు ఎలా తృప్తి చెందుతారు? రెండు- పితృదేవతలు మానవయోనిలోనే ఉండాలనే నియమం లేదు కదా! విభిన్నప్రాణి సంతతికి, విభిన్న ఆహారం ఉంటుంది. ఆయా ప్రాణుల్లో జన్మించిన పితృదేవతలు అన్నం స్వీకరిస్తారా?

ఈ రెండు ప్రశ్నలకూ శాస్త్రాలు స్పష్టమైన వివరణ ఇచ్చాయి. నుృతుని వంశీయులు భక్తిశ్రద్ధలతో బ్రాహ్మణులకు భోజనం సమర్పిస్తే- పితరులు ఏ లోకంలో, ఏ రూపంలో ఉన్నాశ్రాద్ధకర్త ఆహ్వానించి సత్కరించే బ్రాహ్మణుల్లో సూక్ష్మరూపంలో ప్రవేశించి, ఆహారంలోని సూక్ష్మకణాలను గ్రహిస్తారు.

 దీనికి కారణం పితృదేవతలది సూక్ష్మరూపం కావడం. పితరులు దేవయోనిలోకి వెళ్లి ఉంటే, ఆ భోజనం అమృతరూపంలో అందుతుంది. మనుష్య యోనిలోని పితరులకు అన్నంగా, పశుయోనిలోని పితరులకు సంగా, నాగయోనిలోని పితరులకు వాయురూపంలో, యక్షయోని లోని పితరులకు జలంగా అందుతాయి.

పేరు, గోత్రం ఉచ్చరించి భక్తిశ్రద్ధలతో ఆర్పించిన పదార్థం, మంత్రోచ్చారణ ద్వారా పితరులకు ఏ రూపంలో ఉన్నా, అందుతుందని వాయుపురాణం స్పష్టంగా చెప్పింది. జీవుడు వందలాది యోనుల్లో నుండి వెళ్లి ఉండవచ్చు. కాని, వారు శ్రాద్ధకర్మకు ఆహ్వానితులైన బ్రాహ్మణుల్లో గుప్తరూపంలో ఉంటారు. ప్రాణవాయువులా ఆ బ్రాహ్మణులు నడిస్తే వారు నడుస్తారు. కూర్చొంటే కూర్చొంటారు. వారు శ్రాద్ధకాలంలో బ్రాహ్మణులతోటే ఆహారం స్వీకరిస్తారు.

మృతి చెందాక పితృదేవతలు సూక్ష్మశరీరం ధరిస్తారు. అందుచేత ఎవరికీ కనపడరు. అంతేగాక ఒక స్థలంనుంచి మరొకచోటికి, ఒక లోకం నుండి వేరొక లోకానికి వెళ్లడానికి పితృ దేవతలకు ఆటంకం ఉండదు.

Famous Posts:

Tags : పితృదేవతలు, మహాలయ అమావాస్య, భోజనం, pitru devathalu, pitru devata stotram, pitru devatas, pitru devathalu means in telugu

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON