Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

పితృదేవతలకు భోజనం ఎలా అందుతుంది? How do Pitru devathalu receive food?

పితృదేవతలకు భోజనం ఎలా అందుతుంది?

శ్రాద్ధపక్షంలో పితరుల శాంతికోసం బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. దీనివల్ల పితృదేవతలు తృప్తి చెందుతారు. ఈ విషయమై కొన్ని సందేహాలు సహజంగా కలుగుతాయి.

మొదటిది- బ్రాహ్మణునికి ఇచ్చిన భోజనంతో పితృదేవతలు ఎలా తృప్తి చెందుతారు? రెండు- పితృదేవతలు మానవయోనిలోనే ఉండాలనే నియమం లేదు కదా! విభిన్నప్రాణి సంతతికి, విభిన్న ఆహారం ఉంటుంది. ఆయా ప్రాణుల్లో జన్మించిన పితృదేవతలు అన్నం స్వీకరిస్తారా?

ఈ రెండు ప్రశ్నలకూ శాస్త్రాలు స్పష్టమైన వివరణ ఇచ్చాయి. నుృతుని వంశీయులు భక్తిశ్రద్ధలతో బ్రాహ్మణులకు భోజనం సమర్పిస్తే- పితరులు ఏ లోకంలో, ఏ రూపంలో ఉన్నాశ్రాద్ధకర్త ఆహ్వానించి సత్కరించే బ్రాహ్మణుల్లో సూక్ష్మరూపంలో ప్రవేశించి, ఆహారంలోని సూక్ష్మకణాలను గ్రహిస్తారు.

 దీనికి కారణం పితృదేవతలది సూక్ష్మరూపం కావడం. పితరులు దేవయోనిలోకి వెళ్లి ఉంటే, ఆ భోజనం అమృతరూపంలో అందుతుంది. మనుష్య యోనిలోని పితరులకు అన్నంగా, పశుయోనిలోని పితరులకు సంగా, నాగయోనిలోని పితరులకు వాయురూపంలో, యక్షయోని లోని పితరులకు జలంగా అందుతాయి.

పేరు, గోత్రం ఉచ్చరించి భక్తిశ్రద్ధలతో ఆర్పించిన పదార్థం, మంత్రోచ్చారణ ద్వారా పితరులకు ఏ రూపంలో ఉన్నా, అందుతుందని వాయుపురాణం స్పష్టంగా చెప్పింది. జీవుడు వందలాది యోనుల్లో నుండి వెళ్లి ఉండవచ్చు. కాని, వారు శ్రాద్ధకర్మకు ఆహ్వానితులైన బ్రాహ్మణుల్లో గుప్తరూపంలో ఉంటారు. ప్రాణవాయువులా ఆ బ్రాహ్మణులు నడిస్తే వారు నడుస్తారు. కూర్చొంటే కూర్చొంటారు. వారు శ్రాద్ధకాలంలో బ్రాహ్మణులతోటే ఆహారం స్వీకరిస్తారు.

మృతి చెందాక పితృదేవతలు సూక్ష్మశరీరం ధరిస్తారు. అందుచేత ఎవరికీ కనపడరు. అంతేగాక ఒక స్థలంనుంచి మరొకచోటికి, ఒక లోకం నుండి వేరొక లోకానికి వెళ్లడానికి పితృ దేవతలకు ఆటంకం ఉండదు.

Famous Posts:

Tags : పితృదేవతలు, మహాలయ అమావాస్య, భోజనం, pitru devathalu, pitru devata stotram, pitru devatas, pitru devathalu means in telugu

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు