Drop Down Menus

బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్పినవి జరిగినవి - భవిష్యత్ లో జరగబోయేవి | Brahmam Gari Kalagnanam

బ్రహ్మం గారు చెప్పినవి జరిగినవి:

1)చల్లకంటే కల్లునే గొప్పదిగా భావిస్తారు

2)వావివరుసలు మార్చిపోతారు.

3)వర్ణవ్యవస్థ నాశనమవుతుంది

4)భర్తలను భార్యలు ఏలుతారు

5)రాజరికాలు నశిస్తాయి ,ప్రజలే ప్రభువులవుతారు

6)తిరుపతి పెద్ద పట్టణమవుతుంది

7)ఉత్తర దేశాన మహాత్ముడు జన్మించి సత్య అహింసలను బోధిస్తాడు

8)చీమకుర్తి,బెజవాడ లు మహా పట్టణాలవుతాయి

9)ఉత్తములైన వారు అల్పులకు దాసీతనము చేస్తారు

10)కాముకత్వము పెరుగుతుంది

11)భారతదేశాన్ని విదేశీయులు పాలిస్తారు

12)మాచర్ల రాజులు మాధవతి కారణంగా సమస్తము సమసిపోదురు

13)కోటి విధ్యలున్న కూడులేక మాడిపోతారు

14)సర్వవస్తువులూ కల్తీ అవుతాయి

15)భర్తలను భార్యలూ,భార్యలను భర్తలూ ధనం కోసం వేపుకు తింటారు

16)ముండమోపులు ముత్తైదువులవుతారు

17)నీటిని కొనుగోలుచేస్తారు

18)ఎడ్లూ,దున్నపోతులూ లేకుండా బండ్లు నడుస్తాయి.

19)మానవులు పక్షుల్లా ఎగురుతారు.

ఇక జరగాల్సినవి:

1)తిరుపతికి వెళ్లే అన్ని దారులూ మూసుకుపోతాయి

2)వెంకటేశ్వర స్వామి సంపదను ఆరుగురు దొంగలు దోచుకుపోతారు

3)క్రిష్ణా నది మధ్యలో బంగారు రధం బయటపడుతుంది.అది చూసి ప్రజలు కన్నులు పోగొట్టుకుంటారు

4)శ్రీశైల మల్లిఖార్జునుడు భక్తులతో మాట్లాడతాడు

5)యాగంటి బసవన్న రంకె వేస్తాడు

6)మధుర మీనాక్షి జనులతో మాట్లాడుతుంది

7)జనగానపల్లె లో పాతరమీది చింతచెట్టుకు జాజులు పూస్తాయి

8)రాయదుర్గం లో రామచిలుక వీరధర్మాలను చెబుతుంది

9)శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ .జరుగుతుంది

10)మల్లిఖార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వింధ్య పర్వతాలకు వెళ్ళిపోతాడు

11)పెనుగొండలో పెద్ద పులులు తిరుగుతాయి.

12)నెల్లూరు సీమ నీటిలో మునిగిపోతుంది.

13)శ్రీకుమారస్వామి ఆలయం వారం రోజులు మూసివేస్తారు

14)అర్ధరాత్రి సూర్యోదయమవుతుంది.

15)బెంగుళూరులోని వైశ్య వర్ణంలో మహాలక్ష్మి జన్మిస్తుంది

16)కంచి కామాక్షి కనులేర్ర చేస్తుంది.ఆ దాటికి దక్షిణాన జనులు మరణిస్తారు.

Tags: బ్రహ్మంగారి కాలజ్ఞానం, Brahmam Gari Kalagnanam, brahmam gari kalagnanam pdf

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.