Drop Down Menus

నవగ్రహాలు ఎక్కువగా శివాలయంలోనే ఎందుకు ఉంటాయి?? Why Navagraha Idols Present in Sivalayam

నవగ్రహాలు ఎక్కువగా శివాలయంలోనే ఎందుకు ఉంటాయి??

జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలు చాలా ప్రధానమైనవి. అనంతవిశ్వంలో కంటికి కనిపించే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, కొన్ని గ్రహాల పరిశీలన - ప్రాణులపై వాటి ప్రభావంతో వాతావరణంలో క్రమబద్ధమైన మార్పులు, వాటికీ మానవ జీవితంతో ఉన్న సంబంధము మొదలైనవి జ్యోతిష్యశాస్త్ర ఆవిర్భావానికి కారణం అయ్యాయి.

నవగ్రహాల స్థితి కారణంగానే వ్యక్తుల జాతకాలు చెబుతారు జ్యోతిష్యులు. ఈ క్రమంలో ఏవైనా గ్రహదోషాలు ఉంటే కొందరు పూజలు కూడా చేస్తారు. అయితే ఈ నవగ్రహాలు అనేవి ప్రధానంగా శివాలయాల్లోనే మనకు ఎక్కువగా కనిపిస్తాయి.

కొన్ని క్షేత్రాల్లో నవగ్రహాలు ఒకే మందిరంలో దర్శనమిస్తూ వుంటే, మరికొన్ని క్షేత్రాల్లో ఒక్కో గ్రహానికి ఒక్కో ప్రత్యేకమైన మందిరం కనిపిస్తూ వుంటుంది.

నవగ్రహాలు ఎలా కొలువైవున్నా అసలు ఇవి ఎక్కువగా శివాలయాల్లోనే ఎందుకు ఉంటాయనే సందేహం కొంతమందికి కలుగుతుంటుంది. నవగ్రహాలకు శివుడితో గల సంబంధమేమిటో తెలుసుకోవాలి. ఇందుకు శాస్త్రంలో చాలా స్పష్టమైన సమాధానం కనిపిస్తోంది.

నవగ్రహాలలో ఒక్కో గ్రహానికి, ఒక్కో అధిష్టాన దేవతను నియమించినది శివుడే. అంతేకాకుండా గ్రహాలకు మూలమైనటువంటి సూర్యదేవుడుకి అధిదేవత కూడా శివుడే.

ఈ కారణంగానే గ్రహాలన్నీ కూడా శివుడి ఆదేశానుసారమే సంచరిస్తూ వుంటాయి. అందువల్లనే శివాలయాల్లో నవగ్రహ మంటపాలు ఎక్కువగా దర్శనమిస్తూ వుంటాయి. 

ఆదిదేవుడైన పరమశివుడి అనుగ్రహమే వుంటే నవగ్రహదోషాలు ఎలాంటి ప్రభావం చూపలేవని పురాణాలు చెప్పడం వెనుక గల కారణం కూడా ఇదే.

అంతెందుకు త్రయోదశి శనివారం నాడు వస్తే ఆ రోజును శనిత్రయోదశిగా వ్యవహరిస్తారు. శనివారం శ్రీమహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన రోజు. అలాగే త్రయోదశి పరమేశ్వరునికి ఇష్టమైన దినం.

అందుకనే త్రయోదశి శనివారంనాడు వస్తే శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైనది. శని జన్మించిన తిధి కూడా త్రయోదశి, అందుకనే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది. ఈ రోజున శనికి ప్రత్యేకమైన పూజలు చేస్తే శనిదోషాలైన—ఏలినాటిశని, అష్టమశని, అర్ధాష్టమశని, కంటకశని, తదితర దోషాల నుంచి విముక్తి లభిస్తుంది..

Tags: నవగ్రహాలు, Navagraha Idols, Sivalayam, Navagraha, Siva Pradakshina, Devotional Story's

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.