Drop Down Menus

జనవరి 22న - ప్రాణ ప్రతిష్ఠ రోజున అయోధ్య అక్షింతలు ఏం చేయాలి, ఏం చేయకూడదు? Ayodhya Ram Mandir Akshintalu Distribution

ఇంటింటికీ అక్షింతలను చేరవేసే ప్రక్రియ!

జన జాగరణ చేసే సమయంలో ఇంటింటికీ వెళ్ళినప్పుడు

తాము అయోధ్య రామమందిరము (తీర్థ క్షేత్ర ట్రస్ట్) తరపున వచ్చాము అని పరిచయం చేసుకోవాలి.

ప్రతి ఇంటికి

1. రామ మందిర చిత్ర పటము

2. తీర్థ క్షేత్ర కరపత్రము

3. మృగముద్రలో అక్షింతలు ఇవ్వాలి

ప్రతి ఇంటికి 5 గ్రాములు చొప్పున అక్షింతలు ఇవ్వాలి.

మృగముద్రలో అనగా - బొటన వ్రేలు, మధ్య వ్రేలు మరియు  ఉంగరపు వేలు కలిపి ఉంచితే వాటి మధ్యలో పట్టినన్ని ఇవ్వాలి.

అక్షింతలను ఏం చేయాలి..??

అక్షతలు ఇంటికి ఇచ్చిన తర్వాత వాటిని వృద్ది చేసుకొని దేవుని పూజా మందిరంలో పెట్టుకోవచ్చు.

(వృద్ధి చేసుకోవడం అంటే మన ఇంట్లో తయారు చేసుకొన్న అక్షతలకు అయోధ్య నుండి వచ్చిన వాటిని కలపడమే.)

వృద్ధి చేసుకున్న అక్షతల వినియోగము ఎలా చేసుకోవచ్చు ?

22 జనవరి 2024 రోజున అయోధ్య లో శ్రీ బాల రాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగతున్న సమయంలో ఇంటిల్లిపాదీ, ఇళ్లు కడుక్కోవడం, స్నానాలు ముగించుకొని,..

గ్రామంలోని దేవాలయానికి ఇంటిల్లిపాది చేరుకుని.. పూజలు ముగించుకొని

1.వ్యక్తిగతంగా నెత్తిన ధరించడం

2. పిల్లలను, చిన్నవారిని దీవించడం,

3. భర్త ఆశీస్సులు దీవెనలు తీసుకోవడం

4. బీరువాలో పెట్టుకోవడం (లక్ష్మీ స్థానం) 

5. పిల్లల పుట్టిన రోజున, పెళ్ళి ఇతర శుభకార్యాలలో ఈ అక్షింతలతో దీవించడం

6. ఎవరైనా ఆశీర్వాదం కోసం వచ్చినప్పుడు వినియోగించడం (పుట్టినరోజు, పెళ్లిరోజు, శుభకార్యాలు, ఉద్యోగ ప్రమోషన్లు..)

జనవరి 22న -  ప్రాణ ప్రతిష్ఠ రోజున చేయాల్సిన పనులు వివరించాలి.

జనవరి 22 ప్రాణ ప్రతిష్ట రోజున దగ్గరలోని దేవాలయంలో ఉదయం 11 గంటలకు పూజా కార్యక్రమం మరియు అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడడానికి ఏర్పాటు, హారతి మరియు ప్రసాద వితరణ ఉంటుంది అని చెప్పాలి.

అందులో కుటుంబ సభ్యులు అందరూ పాల్గొనాలి.

తమ ఇంటి చుట్టుపక్కల ఉన్న భక్తులను దేవాలయానికి రమ్మని ఆహ్వానించాలి.

ఆ రోజు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత (రాత్రి) తమ ఇంటి ముందు కనీసం 5 దీపాలు వెలిగించాలి అని చెప్పాలి.

వీలయితే ఇంటిని విద్యుత్ దీపాలతో అలంకరించాలి అని చెప్పాలి.

Tags: అయోధ్య, Ayodhya, Ayodhya Akshintalu, Ayodhya Rama, Ayodhya Akshintalu, Ayodhya Rama Mandiram, Ayodhya History Telugu

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.