తిరుమలేశుని ఆలయంలో నిత్యకళ్యాణం-పచ్చతోరణమే. బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. స్వామివారికి తొలిసారిగా ఈ బ్రహ్మోత్సవాన్ని సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే జరిపించినట్లు భవిష్యోత్తర పురాణంలో చెప్పబడి ఉంది. ఈ సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల తేదీ తెలిపినారు.
ఈ సంవత్సరం 24 సెప్టెంబర్ 2025 నుంచి 02 అక్టోబర్ 2025 వరకు నిర్వహిస్తారు.
ముఖ్యమైన తేదీలు :
- 16-09-2025 : కోలి అల్వాల్ తిరుమంజరం.
- 23-09-2025 : అంకురార్పణం.
- 24-09-2025 : ధ్వజారోహణం.
- 28-09-2025 : గరుడ సేవ.
- 01-10-2025 : రథోత్సవం.
- 02-10-2025 : చక్రస్నానం.
భక్తులకు సమాచారం :
- విఐపి బ్రేక్ దర్శనం లేదు (ప్రోటోకల్ ఉన్నతాధికారులు తప్ప).
- బ్రహ్మోత్సవాల సమయంలో సీనియర్ సిటిజన్లు, ఎన్ఆర్ఐలు, వికలాంగులు, దాతలు లేదా శిశువులు ఉన్న తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు ఉండవు.