Drop Down Menus

Famous Temples In Visakhapatnam





హిరణ్యకశిపుని భటులు ప్రహ్లాదుని చంపడం కోసం అతడిని సముద్రంలో పడవేసి , అతడు లేచి బయటకు రాకుండా పైన ఒక పర్వతాన్ని పడవేశారు . అప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చి , ఆ పర్వతాన్ని ఎత్తి ఒడ్డునకు విసిరి ప్రహ్లాదుని రక్షించాడు . అదియే సింహాచలం కొండ . నిజరూపంలో కనిపించే స్వామి విగ్రహానికి వరాహముఖం , నరుని శరీరం , సింహం తోక యుండుట విచిత్రం .  ఇక్కడ స్వామి పదాలు భూమిలో కప్పబడి ఉంటాయి . సుమారు 12 మణుగుల శ్రీ చందనంతో నిండి ఉన్న రూపమే మనకు దర్శనమవుతుంది . ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే అనగా వైశాఖశుద్ధ తదియనాడు (మే నెలలో ) చందనపు పొరలు తొలగించుకొని తన నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఆషాడ పౌర్ణమినాడు జరిగే గిరిప్రదక్షిణ ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది . 32 కి .మీ . వైశాల్యంగల సింహగిరి చుట్టూ కాలినడక ప్రదక్షిణం చేసి , స్వామిని దర్శించుకుంటారు . విశాఖజిల్లా , విశాఖపట్టణమునకు 11 కి . మీ దూరంలో తూర్పు కనుమలలో సింహగిరి పర్వతం పైన వెలిసిన దైవం శ్రీ వరాహ లక్ష్మి నరసింహస్వామి .
ఈ ఆలయంలో ఉన్న విచిత్రమేమిటంటే పూజారి మనకు కనిపించడు. పూజారితో పనిలేకుండా భక్తులే అమ్మవారిని స్వహస్తాలతో పూజించుకొనవచ్చును. 24 గంటలూ ఈ ఆలయం భక్తులకు తెరిచే ఉంటుంది . ఒకసారి తపస్సంపన్నుడైన ఒక పండితుడు కాశీయాత్ర చేసి శివసాయుజ్యం పొందాలనుకున్నాడు . వెళ్తూ వెళ్తూ ప్రస్తుతం ఆలయం ప్రాంతములో ఉన్న బావి వద్దకు చేరుకొని స్నానం ముగించి సంధ్యావందనాన్ని జరుపుకుని తిరిగి బయలుదేరబోగా బావిలోనుంచి "జగన్మాతా | నిను కనకమహాలక్ష్మి దేవిని . బావిలో ఉన్నాను . నన్ను వెలుపలకు తీసి పూజా కార్యక్రమాలను జరిపించు " అని బావిలో నుంచి మాటలు వినిపించాయి . బావిలో ఉన్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని వెలుపలకు తీసి ప్రతిష్టిoచి పూజలు నిర్వహించారు . అప్పటి నుండి అమ్మవారు ఆరాధనలందుకుంటూ ఉన్నది . ఈ అమ్మవారికి గురువారం రోజున కానుకలు సమర్పించి , తమ మనసులోని కోర్కెలు తెలియజేస్తే అవి తప్పక నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం . ప్రతి సంవత్సరం మార్గశిరమాసమంతా శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి ఉత్సవాలు అతివైభవంగా జరుగును . విశాఖపట్నం నడిబొడ్డున వన్ టౌన్ లోని బురుజుపేటయందు వెలసిన ఒక గ్రామ దేవత శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు . ఈ అమ్మవారిని దర్శించుటకు విశాఖపట్నం అన్ని ప్రాంతాల నుండి బస్సు , రైల్వే సౌకర్యాలు ఉన్నాయి . 
3) Bheemili Narasimha Swamy Temple Pavurallakonda hill
కృతయుగంలో ప్రహ్లదుని రక్షణార్ధము విష్ణువు ఉగ్రనరసింహునిగా అవతరించగా, ఆ ఉగ్రరూపాన్ని చూసి దేవతలు , మునులు భయభ్రాంతులై నరసింహస్వామిని సకలదేవతలతో కూడిన ప్రహ్లాదుడు ప్రార్ధించగా , స్వామివారు వారి ప్రార్థనకు శాంతించి తన ఉగ్రనరసింహావతారం చాలించి శంఖు , చక్ర , గద అభయ వాస్తములతో వారిని కరుణిస్తాడు . ఈ ఆలయము 12,13 వ శతాబ్దాలలో నిర్మిచినట్లు తెలియచున్నది . ఇది చాలా ప్రాచీన ఆలయం . ఇచట స్వామి స్వయంభువుగా వెలిసాడని ప్రసిద్ధి .  తరువాత ఇది శ్రీకృష్ణదేవరాయలవారి అభిమానము చూరగొని, మరింత వన్నెకెక్కింది . శ్రీ నరసింహజయంతి , వైకుంఠ ఏకాదశి , మకర సంక్రాతి మొదలగు పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు . మాఘమాసం ఆదివారం , అమావాస్య , శ్రావణ నక్షత్రంలో కూడిన రోజును అర్ధోదయం, మహోదయ విశిష్టత . ప్రతి 40 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అర్ధోదయం , మహోదయం మరియు 60 ఏళ్లకు ఒకసారి వచ్చే గోవింద ద్వాదశి పర్వదినాలు హిందువులకు అత్యంత పుణ్యదినాలు . విశాఖ జిల్లా , విశాఖపట్నంనకు సుమారు 27 కి.మీ దూరంలో విశాఖ - భీమిలి బీచ్ రోడ్డుపై చివరన భూమినిపట్నం లేక భీమిలి గ్రామము కలదు.  
4) Bojjana Konda Anakapalli

5) Nookambica Temple Anakapalli

విశాఖపట్నం జిల్లా అనకాపల్లి అనే పట్టణంలో శ్రీ నూకాంబికా దేవి అనే గ్రామదేవత ఆలయం కలదు . ఇది పూరితమైన ఆలయం . ఈ ఆలయం నిర్మించి ఇప్పటికి 550 సంవత్సవరాలు అయినట్టుగా చరిత్ర తెలియజేస్తుంది . అనకాపల్లి పట్టణంలో వేంచేసియున్న లక్షలాది మందికి ఆరాధ్యదైవం అయిన శ్రీ నూకాంబిక అమ్మవారు పూర్వం నవశక్తులలో ఒకశక్తి అయిన "శ్రీ అనఘాదేవి "గా ప్రతిష్ఠితమై పూజలందుకొనుచున్నది . ఉగాది పర్వదినానికి ముందురోజు అమావాస్యనాటి నుండి అనగా ఫాల్గుణ బహుళ అమావాస్య నుండి చైత్ర బహుళ అమావాస్య వరకు ఈ నూకాంబిక సమక్షంలో "కొత్త అమావాస్య జాతర " జరుగుతుంది . ఉత్తరాంధ్రలో బాగా పేరుపొందిన ఈ జాతరకు రాష్టహ్యప్తంగా లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు . 

చిత్తూరుజిల్లాలోని కాణిపాకం తర్వాత అంతటి పేరున్న సర్వసిద్ది వినాయకుడు ఈ చోడవరంలో స్వయంభువుగా వెలిశాడు . స్వయంవ్యతకమైన ఈ వినాయకుని విగ్రహానికి 15వ శతాబ్దంలో మత్స్యవంశపురాజులు ప్రతిష్ట చేసినట్టు స్థలపురాణం ప్రకారం తెలియచున్నది . ఈ స్వయంభు వినాయకుడిని దర్శించుకుంటే అన్ని విఘ్నాలు తొలగిపోతాయని , కోరిన కోర్కెలు నెరవేరుతాయన్నది భక్తుల విశ్వాసం . గణపతి నవరాత్రలు గొప్పగా నిర్వహిస్తారు .
7) Sri Venugopala Swamy Temple Upamaka at visakhapatnam

పురాతన విష్ణుక్షేత్రంగా పిలువబడే శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం ఎంతో  ప్రసిద్ధి చిందినది .  క్రీ. శ, 6వ శతాబ్దంలో తూర్పు గోదావరి జిల్లా కాండ్రేగుల సంస్థానాధిపతి శ్రీకృష్టభూపాలుడు స్వామివారికి ఆలయాన్ని నిర్మించాడని తెలుస్తుంది . ఉపమాకలో వేంకటేశ్వరస్వామి వెలిశాడనడానికి రెండురకాల స్థలపురాణాలు చెబుతారు . బ్రహ్మ , కశ్యపుడు తరితరులు కలిసి ఇక్కడ చేసిన తపస్సు ఫలితంగా ఆలయం ఎదురుగా ఉన్న తటాకం వెలిసిందనీ వీరి కారణంగానే ఇది బంధుర సరస్సుగా పేరొందిందని పురాణాలు వెల్లడిస్తున్నాయి . విశాఖజిల్లా , విశాఖపట్నంకు 85 కి మీ దూరంలో , తుని రైల్వే స్టేషన్ నుండి ,20 కిమీ దూరంలో, నర్సీపట్నం రైల్వే స్టేషన్ నుండి 10కిమీ దూరంలో నక్కపల్లి మండలం , నక్కపల్లి గ్రామమునకు సుమారు 2కిమీ దూరంలో ఉపమాక గ్రామం కలదు . 
8) Sri Sampath Vinayaka Temple
విశాఖపట్టణం సాగరతీరమందు ఆశీలుమెట్ట అనే ప్రాంతమునందు శ్రీ సంపత్ వినాయగర్ ఆలయ కలదు . తమిళనాడుకు చెందిన ముగ్గురు భక్తులు విశాఖపట్నం లో స్థిరపడి స్వామి వారికీ ఒక ఆలయం నిర్మించాలని వారు వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించారు . కొంతకాలం తర్వాత కంచి పీఠాదిపతి శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామివారి దివ్యహస్తాలతో శ్రీ గణపతి యంత్రము ను ఇచ్చట ప్రతిష్టాపన చేశారు . నాటినుండి గణపతి దివ్య ఘనతేజస్సులతో దేదీప్యమానంగా విరాజిల్లుతున్నారు . తమిళనాడుకు చెందిన అర్చకస్వాములే పూజలు నిర్వహిస్తారు . విశాఖతీరంలో జాలరులు, భక్తులు ప్రతిరోజు తమ వృత్తివ్యాపారాలు ప్రారంభించేముందు ఈ సంపత్ వినయాగర్ స్వామిని దర్శించడం అనవాయితీ . స్వామివారిని స్మరించినంతనే సకల ఆపదలు తొలగి శుభం జరుగుతుందని వీరి నమ్మకం . 




13)శ్రీ నూకాంబిక మహత్యం







Related Postings in Hindu Temples Guide Articles :




Famous Temples In Visakhapatnam District, Vizag Famous Temple list, Best Temples in Visakhapatnam, Temple Information in Hindu Temple Guide.com, Temple Timings, AP District Temple History, Hindu temples Guide.

               
ఇవి కూడా చూడండి
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

Post a Comment

FOLLOW US ON