అందుకే కొండపై వెలసిన స్వామికి త్రికూటేశ్వరుడు అని పేరు వచ్చింది.గుంటూరు జిల్లా కోటప్పకొండలోని త్రికోటేశ్వరస్వామి వారి దేవాలయానికి చేరుకునే పురాతన మెట్ల మార్గం బయటపడింది.ఆలయచరిత్రకు సంబంధించిన జానపద ఒకటి ప్రచారంలో ఉంది.
పూర్వం యెల్లమండ గ్రామానికి చెందిన సాలంకయ్య అనే శివభక్తుడు జీవనభృతి కోసం కట్టెలు కొట్టి జీవిస్తూ ఉండేవాడు. ఇతడు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ జీవితం కొనసాగిస్తాడు. కానీ.. శివభక్తి ఫలితంగా సాలంకయ్యా ధనవంతుడు అవుతాడు. ధనవంతుడు అయినప్పటికీ విలాస జీవితాన్ని కాకుండా సాధారణంగా జీవితం కొనసాగిస్తూ. శివుడిని పూజిస్తూ వుండేవాడు.
ఒకరోజు సాలంకయ్య పూజచేస్తున్న తరుణంలో ఒక జంగమదేవరను చూసాడు. సాలంకయ్య భక్తికి మెచ్చి జంగమదేవర ప్రతిరోజు అతడి ఇంటికి వచ్చి పాలను త్రాగివెళ్ళేవాడు.
కొన్ని రోజుల తరువాత జంగమదేవర కనిపించలేదు. సాలంకయ్య అతడి కోసం ఎంతగా గాలించినప్పటికీ జంగమదేవరను చూడలేక పోయాడు. దీంతో తీవ్ర నిరాశ చెందిన సాలంకయ్య అన్నపానాదులు,నిద్రహారాలు మానేశాడు. సాలంకయ్యా నివసిస్తున్న ప్రదేశానికి కొంత దూరంలో సుందుడు, అతడి భార్య కుంద్రి నివసిస్తూ ఉండేవారు. వారికి ఆనందవల్లి (గొల్లభామ)అనే కూతురు పుట్టిన తరువాత వారు ధనవంతులు అయ్యారు.
గాఢమైన దైవభక్తి సంపన్నురాలైన ఆనందవల్లికి సాధారణ ప్రపంచ జీవితం మీద విరక్తి కలిగింది. ఆమె సదా శివుని భక్తిగితాలు ఆలపిస్తూ చివరకు కొంచంకొంచంగా ఏకాంతవాసానికి అలవడి తపోజీవనం ఆరంభించింది.
ఆమె భక్తికి మెచ్చి త్రికోటేశ్వరుడు జంగమదేవర రూపంలో ఆమె ముందు ప్రత్యక్షమైనట్టు స్థల పురాణం చెబుతోంది.
తరువాత ఆనందవల్లి రోజూ రుద్రాచలానికి వచ్చి శివునికి ఆభిషేకాదులు నిర్వహించి పాలు కానుకగా సమర్పించేది. ఈ విషయాన్ని సాలంకయ్యా తెలుసుకుంటాడు. అతడె ఆనందవల్లిని కలుసుకుని జంగమదేవర దర్శనం, ఆశీర్వాదం ఇప్పించనని కోరాడు. ఆమె అతని కోరికను మన్నించక తపసును కొనసాగించింది. కొన్నిరోజుల తరువాత వేసవి కాలంలో కూడా ఆనందవల్లి శివుని
ఆరాధించడానికి రుద్రాచలానికి వెళ్ళసాగింది. ఒకరోజు ఆమె అభిషేకం కోసం బిందె నిండా నీళ్లు తీసుకుపోతూ మార్గమద్యంలో దానిని ఒక రాతిమీద పెట్టి, మారేడుదళాలతో దానిని మూసి ఉంచింది. అప్పుడు ఓ కాకి నీళ్లు తాగడం కోసం ఆ బిందె మీద వాలింది. కాకి బరువుకు బిందె పక్కకు ఒరిగి బిందెలోని జలం మొత్తం
కిందికి పడిపోతుంది. దీంతో ఆగ్రహించిన ఆనందవల్లి ఈ ప్రాంతానికి కాకులు రాకూడదని శపించింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ప్రాంతంలోకాకులు కనిపించడం లేదని ప్రాంతీయ వాసుకు విశ్వసిస్తున్నారు. తరువాత ఆనందవల్లి తపసుకు మెచ్చి జంగదేవర ప్రత్యక్షమై ఆమెకు జ్ఞానం ప్రసాదించాడు. తరువాత ఆనందవల్లి ఏకాగ్రతతో శివుని గురించి తపసు కొనసాగించింది.
వచ్చింది.ఆమెను పరీక్షించడానికి ఎన్ని విధాలుగా కష్టపెటినా పూజించడం మానలేదు. ఆమె భక్తికి మెచ్చిన శివుడు, జంగమదేవర తిరిగి ఆనందవల్లికి ప్రత్యక్షమై ఇక ఆమె శ్రమపడి రుద్రాచలం రావలసిన అవసరం లేదని తాను ఆమెను వెన్నంటి వచ్చి ఆమె పూజలు స్వీకరిస్తానని చెప్పి ఆమెను తిరిగి చూడకుండా నివాసానికి వెళ్ళమని ఆదేశిస్తాడు. ఒకవేళ తిరిగి చూస్తే తాను అక్కడే నిలిచిపోతానని చెప్పాడు. ఆనందవల్లి
రుద్రాచలం నుండి కిందకు దిగుతూ కుతూహలం బ్రహ్మాచలం వద్ద తిరిగి చూసింది. దాంతో పరమశివుడు వెంటనే అక్కడే పక్కన ఉన్న గుహలో లింగరూపం ధరించాడు. ఆ పవిత్ర ప్రదేశమే ప్రస్థుతం కొత్తకోటేశ్వరాలయంగా పిలువబడుతూ ఉంది.ఆనందవల్లికి కుమారుడు జన్మించాడు. ఆనందవల్లి తాను చేసిన అపచారానికి చింతించస్తూ మరణించడానికి సిద్ధం అయింది. వెంటనే ఆమెకు శివుడు ప్రత్యక్షం
కావడమేకాక బాలుడు అక్కడి నుండి మాయం అయ్యాడు. ఆనందవల్లికి జరుగింది అంతా శివమాయ అని అర్ధం అయింది. చివరకు ఆమె శివునిలో ఐక్యం అయింది.ఈ ఆలయానికి దిగువ భాగాన శిలగా మారిన ఆనందవల్లికి గుడికట్టారు. ఆ విధంగా ఆనాటి నుండి ఈ దేవాలయ అర్చనాది కైంకర్యములు కొండకవూరి
వంశస్థులు ప్రమదప్ప, గురవప్ప వారి సంతతి సుమారు పన్నెండు తరాల నుంచి అర్చకులుగా ఉండటం ఈ క్షేత్రం యొక్క విశేషం.
1.Kotappakonda 2
2.AndhraPreadesh Temple
3.Lord Shiva Famous Temple
4.Guntur Famous Temples
Significance of kotappakonda,History of Kotappakonda,history and significance of telugu,History of Sri Trikoteswara Swamy Temple Kotappakonda,Kotappakonda Temple,Sri Trikoteswara Swamy Temple, Kotappakonda,Guntur,AP,Kotappakonda Sri Trikoteswara Swamy Temple,kotappakonda temple address,kotappakonda temple photos,kotappakonda matter in telugu,kotappakonda temple website,kotappakonda temple darshan timings,kotappakonda live,kotappakonda temple accommodation,kotappakonda videos
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment