పంజాబ్ భారతదేశంలో వాయువ్యభాగాన ఉన్న ఒక రాష్ట్రం. 'పంజ్' - అంటే ఐదు, 'ఆబ్' - అంటే నీరు. ఈ రెండు పదాలనుండి 'పంజాబు' పదం వచ్చింది. జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ - అనే 5 నదులు పంజాబులో ప్రవహిస్తూ దానిని సశ్యశ్యామలం చేస్తున్నాయి. సారవంతమైన నేల, పుష్కలమైన నీరు, కష్టించే జనులు - వీరంతా కలిసి పంజాబును దేశపు వ్యవసాయంలో అగ్రభాగాన నిలుపుతున్నారు. పారిశ్రామికంగా కూడా పంజాబు మంచి ప్రగతి సాధిస్తున్నది. భారత ఉపఖండంలో వికసించినట్లు కనుగొన్న ప్రథమ నాగరికత సింధునదీ నాగరికత ఈ ప్రాంతంలోనే ఉంది. పంజాబు సంస్కృతి ఎంతో సుసంపన్నమైనది. పంజాబీయులు తమ సాంఘిక బాధ్యతలకు మంచి విలువలనిస్తారు. భారతదేశంలో హిందువులు మెజారిటీగా లేనటువంటి ఆరు రాష్ట్రాలలో పంజాబు ఒకటి. పంజాబులో యాత్రికులను ఆకర్షించే అనేక స్థలాలున్నాయి. - చారిత్రిక స్థలాళు, ప్రకృతి అందాలు, మందిరాలు, నాగరికతానిలయాలు, గ్రామీణ సౌందర్యం, జానపద కళారూపాలు - వీటివలన పర్యాటక రంగం మంచి అభివృద్ధిని సాధిస్తున్నది.
పంజాబ్ ప్రసిద్ధ దేవాలయాలు
అమృత్ సర్ - స్వర్ణ దేవాలయం అమృత్ సర్ - దుర్గియానా ఆలయం హోశియార్ పూర్ - దసూహ భటిండా - తల్వండిసాంబో బరూలా - అచలేశ్వర ఆలయము పంజాబ్ - రామతీర్థం జలంధర్ - శివమందిరం జ్వాలాముఖి - విద్యేశ్వరీదేవి ఆనంద్ పూర్ సాహెబ్ తారన్ తరన్ చాపార్ - గోగా ఆలయం పఠాన్ కోట్ - ధమ్ తార్ ఆలయం
Comments
Post a Comment