Drop Down Menus

Manasa Sarovara Yatra Special Information | Kailash manasarovar


మానస సరోవరం:
2500 సంవత్సరాలు గా ఈ ప్రాంతం యాత్రా స్థలంగా ఉందని పురాణాలు సైతం చెబుతున్నాయి. మహా భారతం లోని అరణ్య పర్వంలో, రామాయణం లోని సుందరా కాండలో కైలాస మానస సరోవరం ప్రస్తావన వుంది. ఈ ప్రాంతం చైనాలోని టిబెట్ ప్రాంతంలో వుంది. 1962 వరకు ఎలాంటి వీసాలు లేకుండా ఈ ప్రాంతానికి వెళ్ళే వాళ్ళు. 1981 వరకు కైలాస మానస సరోవరం ప్రాంతానికి అనుమతి లేదు. ఆ తర్వాత చైనా వీసా తో పర్యటన కు అనుమతించారు. ఆల్మోరా మార్గం, బదరినాథ్ మార్గం లోని జోషి మఠం మార్గం లోనూ, కాశ్మీర్ లోయలో నుండి అనేక మార్గాలు ఉన్నా, నేపాలమీదుగా కైలాస మానస సరోవరం వెళ్లడం ఇటీవల ఎక్కువ సులభంగా ఉంది. ఇటీవల నాథులా పాస్ మీదుగా మరింత సులభంగా ఈ యాత్రకు వెళ్లే అవకాశం ప్రభుత్వం కలిగించింది. ప్రభుత్వం ద్వారా వెళ్లాలనుకుంటే ప్రభుత్వం పత్రికలలో ఇచ్చే ప్రకటన ను గమనించి అప్ప్లై చేసుకోవాలి. నేపాల్ మీద ప్రయాణానికి అనేక ప్రయివేటు ట్రావెల్ సంస్థలు ఉన్నాయి.

కొన్ని వేల ఏళ్ల నుంచి హిందువుల నమ్మకాలు ఇవి. అందుకే జీవితంలో ఒకసారైనా- మానస సరోవరంలో స్నానం చేయాలని.. కైలాస పర్వతాన్ని దగ్గరగా చూసి ప్రదక్షిణం చేయాలని కోట్లాది మంది భావిస్తూ ఉంటారు. కాని సముద్రమట్టానికి దాదాపు 15 వేల అడుగుల ఎత్తున ఉన్న మానస సరోవరాన్ని.. దానికి సమీపంలో ఉన్న కైలాస పర్వతాన్ని అధిరోహించటం అంత సులభం కాదు. అందుకే చాలా మందికి కైలాస యాత్ర ఒక కల. తీరని కోరిక.

బ్రహ్మపుత్ర, కర్ణాలి (గంగ), సింధు, సట్లజ్ నదులు మానస సరోవరం నుంచి పుట్టాయని భక్తుల భావన. అయితే దీనికి కచ్చితమైన ఆధారాలేమీ లేవు.
సాధారణంగా ఈ ప్రాంతంలోకి యాత్రికులను బౌద్ధ పూర్ణిమ నుంచి దీపావళి వరకు అనుమతిస్తారు. కొన్నిసార్లు వాతావరణాన్ని బట్టి ఇది మారుతుంది కూడా. ఆ కాలంలో కూడా ఉష్ణోగ్రత కొన్నిసార్లు మైనస్‌కి వెళ్లిపోతుంది.

భారత ప్రభుత్వం ఏడాదికి 750 మందిని మాత్రమే ఈ యాత్రకు పంపిస్తుంది. కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా ఈ యాత్రను నిర్వహిస్తున్నాయి. వారు నేరుగా చైనా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటారు.

మానస సరోవర ప్రాంతంలో తెల్లవారు జాము రెండున్నర నుంచి నాలుగున్నర వరకూ ఆకాశంలో విచిత్రమైన కాంతి కనిపిస్తుంది. ఈ సమయంలో దేవతలు స్నానం చేయటానికి ఆ సరోవరానికి వస్తారనేది భక్తుల నమ్మకం. ఈ కాంతిని చూడటానికి భక్తులు ఆసక్తి చూపిస్తుంటారు.

కైలాస మానస సరోవరం యాత్రలో తీసు కోవాల్సిన జాగ్రత్తలు:
1. మీరు ఏ ట్రావెల్స్ ద్వారా వెళుతున్నారో వారు గతంలో నిర్వహించిన యాత్రలలో వెళ్లిన వారి ద్వారా వారి నిర్వహణ తెలుసుకొండి.

2. నేపాల్ చేరిన తర్వాత అక్కడి ట్రావెల్స్ కు, చైనా లో అక్కడి ట్రావెల్స్ కు బృందాలను అప్పగిస్తారు. కనుక చైనా చేరిన తర్వాత అద్భుత మైన సౌకర్యాలు, భోజన వసతుల గురించి ఎదురు చూడకండి. సర్దుకు పోవాలి.

3. అక్కడ ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. కర్పూరం ముద్ద ఒక పలుచని గుడ్డ లో కట్టుకుని వాసన పీల్చుకోండి. ఆక్సిజన్ సిలెండర్ ఉంచుకుని అత్యవసర పరిస్థితుల్లో వాడండి.

4. మంచులో , పర్వత ప్రాంతాల్లో నడవడానికి అనువైన బూట్లు వాడండి. నీరు, మంచు బూట్ల లోపలికి వెళితే చాలా ప్రమాదం. వేగంగా నడవ కండి.

5. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నపుడు స్నానం చేయకండి. మైనస్ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు చల్ల నీటి స్నానం చాలా ప్రమాదం.

6.జీడిపప్పు, బాదంపప్పు, ఎండుద్రాక్ష,పిస్తాపప్పు,అత్తి పళ్ళు,అంజిర్, బిస్కట్లు మీవద్ద ఉంచుకొండి.

7.పర్వతారోహణ సమయంలో గొంతు తడారిపోతుంది. గ్లూకోజ్, ఎలాక్ట్రోల్ కలిపిన నీరు, నిమ్మ తొనలు ఉంచుకొండి.

8. ఆకలి కాకపోయినా పొద్దున్నే ఏదో ఒక ఆహారం తీసుకొండి.

9. చైనా పోలీసులు, మిలిటరీ వారిని ఫోటోలు, వీడియోలు తీయకండి.

10.ఇన్నర్లు, స్వెట్టర్లు, జాకెట్టు తప్పనిసరి.

కైలాస మానస సరోవరం నుండి ఏమి తెచ్చు కోవాలి?
1.మానస సరోవరం గడ్డ కట్టినపుడు చేపలు చనిపోయి, ఒడ్డుకు కొట్టుకు వస్తాయి. వాటిని అక్కడ దొరికే చెట్ల వేర్లను అమ్ముతారు. అవి తెచ్చుకొండి.

2. మానస సరోవరం జలాలు, గౌరీ కుండ్ జలాలు తెచ్చుకొండి.

3. మానస సరోవరం దగ్గర దొరికే లింగాకార రాళ్లు, ఓంరాళ్లు తెచ్చుకొండి.

4.సరోవరం తూర్పు వైపు యూదారంగు ఇసుకను తెచ్చుకొండి.

5.తీర్ధ పురి దగ్గర  వేడినీటి బుగ్గల సమీపంలో తెల్లని బూడిద లాంటి భస్మాన్ని తెచ్చుకొండి.

6.తీర్ధ పురి దగ్గరలోని సింధూర పర్వతం నుండి పసుపు రంగు లోని జిగురు మట్టి తెచ్చుకొండి

manasa sarovara yatra, bangalore to manasa sarovara, manasa sarovara yatra cost, manasasarovaram in guntur, manasasarovaram tourism, manasa sarovara yatra 2019, mansarovar yatra details in telugu, manasasarovaram images
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.