Drop Down Menus

అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం | Alampur Navabrahma Temple History in Telugu


త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మకు సృష్టికర్త పేరుంది. ఈ భూ మండలం పై ఉన్న సకల ప్రతి జీవి పుట్టుకకు ఆయనే కారణం. అయితే ఆయనకు భారత దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం మీదా వేళ్లమీద లెక్కపెట్టగలిగిన దేవాలయాలు ఉన్నాయి. రాజస్థాన్ లోని పుష్కర్ లో మాత్రమే భారత దేశంలో బ్రహ్మకు చెప్పొకోదగ్గ దేవాలయం ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో కూడా బ్రహ్మకు దేవాలయం ఉంది. ఇక్కడ బ్రహ్మమనకు తొమ్మిది రూపాల్లో కనిపిస్తారు. ఇటువంటి దేవాలయం మరెక్కడా లేదు. ఈ దేవాలయాన్ని సందర్శిస్తే అంతులేని జ్జానం, సంపద మన సొంతమవుతుందని స్థానికులు విశ్వసిస్తూ ఉంటారు. అంతే కాకుండా దురదృష్టం పోగొట్టి అదృష్టం కలుగజేస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ నేపథ్యంలో ఆ దేవాలయం విశిష్టత, ఆ దేవాలయం ఎక్కడ ఉంది తదితర వివరాలన్నీ మీ కోసం...

తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలోని ఆలంపూర్‌కు దక్షిణ కాశీగా పేరుంది. హైదరాబాద్‌కు 200 కిమీలు, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు నగరానికి సుమారు 25 కిమీల దూరంలో తుంగభద్రా నది తీరంలో ఈ ప్రదేశం ఉంది. భారతదేశంలోని 18 శక్తి పీఠాల్లో ఒకటైన నవబ్రహ్మ ఆలయం ఇక్కడే ఉంది. దీన్ని ఏడో శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.

ఇక్కడ బ్రహ్మ మొత్తం తొమ్మిది రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఇలా బ్రహ్మ తొమ్మది వేర్వేరు రూపంలో ఉండటం ప్రపంచంలో మరెక్కడా మనకు కనిపించదు.ఆ బ్రహ్మ పరమశివుడి గురించి తపస్సు చేసిన ప్రదేశంగా ఈ ప్రాంతాన్ని చెబుతారు. అందువల్లే ఈ పుణ్యక్షేత్రాన్ని పరమ పవిత్రమైన స్థలంగా భావిస్తారు. ఇక్కడ బ్రహ్మ దేవాలయంతో పాటు శివుడికి కూడా గుడి ఉంది.  బాదామి చాళుక్యులు నిర్మించిన ఈ నవబ్రహ్మ ఆలయాలు... తారక బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, పద్మ బ్రహ్మ, బాల బ్రహ్మ, గరుడ బ్రహ్మ, కుమార బ్రహ్మ, అర్క బ్రహ్మ, వీర బ్రహ్మ, విశ్వ బ్రహ్మ పేర్లతో పిలువబడుతున్నాయి.

ఇక్కడి దేవాలయాలు అద్భుతమైన శిల్పకళకు నిలయం. అనేక పురాణ కథలను అద్భుతమైన శిల్పాలుగా మలిచిన తీరు ఎటువంటి వారికైనా ఇట్టే నచ్చుతుంది. ఇక్కడి శిల్ప కళ పై అధ్యయనం చేయడానికి దేశ విదేశాల నుంచి ఎంతో మంది ఇక్కడకు వస్తుంటారు. అదే విధంగా ఇక్కడ శాసననాల పై నిత్యం అధ్యయనం జరుగుతూ ఉంటుంది.

అయితే మరో కథనం ప్రకారం
బ్రహ్మ తపస్సు చేయడంతో పాటు ఇక్కడ తొమ్మిది లింగాలను ప్రతిష్టించి పూజించాడని చెబుతారు. అవే బ్రహ్మ రూపంలో పూజించబడుతున్నాయని కూడా చెబుతారు. ఇక ఈ దేవాలయాన్ని ఒక్క సారి సందర్శిస్తే మన దురదృష్టం వెళ్లి పోయి అదృష్టం కలుగుతుందని భక్తులు నమ్ముతారు.

జోగుళాంబదేవాలయం
ఆలంపూర్ లో నవబ్రహ్మ ఆలయంతో పాటు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన జోగుళాంబదేవాలయం కూడా ఉంది. హిందువులు పార్వతీ దేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాధల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకొన్న కొన్ని ప్రాంతాలను 'శక్తి పీఠాలు' అంటారు. ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయాన్ని ఒక్కొక్కరూ ఒక్కో విధంగా చెబుతారు. కొంత మంది 18 అనీ, 51 అనీ, మరి కొందరైతే 52 అనీ, 108 అనీ ఎవరికి తోచింది వారు చెబుతారు. అయితే ఎవరెన్ని చెప్పిన 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారన్నది సత్యం.

సతీదేవి దంతాలు ఇక్కడ పడ్డాయని ప్రతీతి.
వాటిలో ఒకటి తెలంగాణలో ప్రసిద్ది చెందినది. ఆలంపూర్, ఆంధ్రప్రదేశ్ -కర్నూల్ నుండి 27కిలోమీటర్ల దూరంలో తుంగ, భద్ర నదులు తుంగభద్రా నదిగా కలిసే ప్రదేశంలో ఉంది. జోగులాంబ దేవాలయం చాలా ప్రాచీన ఆలయం. సతీదేవి దంతాలు ఇక్కడ పడ్డాయని ప్రతీతి. ఆలయంలోని గర్భగుడిలో ఆసీన ముద్రలో కొలువై ఉంటుంది జోగులాంబ.

అలంపూర్ ఎలా చేరుకోవాలి ?
విమాన మార్గం అలంపూర్ కు 200 కి. మీ ల దూరంలో హైదరాబాద్ విమానాశ్రయం కలదు. క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి అలంపూర్ చేరుకోవచ్చు.

రైలు మార్గం అలంపూర్ లో జోగులాంబ హాల్ట్ (అలంపూర్ రోడ్డు) పేరుతో రైల్వే స్టేషన్ కలదు. బెంగళూరు - హైదరాబాద్ రైల్వే లైన్ లో ఈ స్టేషన్ కలదు. కర్నూలు, హైదరాబాద్, గద్వాల్ నుండి ప్యాసింజర్ రైళ్లు, కొన్ని ఎక్స్ ప్రెస్ రైళ్లు వస్తుంటాయి.

బస్సు / రోడ్డు మార్గం జాతీయ రహదారి అలంపూర్ గుండా వెళుతుంది. హైదరాబాద్, కర్నూలు, గద్వాల్, మహబూబ్ నగర్, జడ్చర్ల మరియు సమీప పట్టణాల నుండి ప్రభుత్వ బస్సులు నడుస్తుంటాయి.

Famous Books:





నవబ్రహ్మ ఆలయం, nava brahma temple alampur, nava brahma names, jogulamba temple, alampur jogulamba temple timings, papanasi temple alampur, virupaksha temple, durga temple aihole, lad khan temple, pattadakal temple, nava brahma temple history in telugu, nava brahma temple timings.
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.