Drop Down Menus

తిరుమల సుప్రభాత సేవ టికెట్స్ | Tirumala Suprabhata Seva Tickets Booking Information

తిరుమల లో స్వామి వారికి జరిగే మొదటి సేవ సుప్రభాతం. సుప్రభాత సేవ ఎలా జరుగుతుంది ? టికెట్స్ ఎలా తీసుకోవాలి ? టికెట్స్ ధర ఎంత ? తదితర విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమలలో ప్రతి రోజు సుప్రభాత సేవ జరుగుతుంది ధనుర్మాసం లో మాత్రం సుప్రభాతం  కు బదులుగా తిరుప్పావై చదువుతారు. తిరుప్పావై సేవ ఏకాంతంగా జరుగుతుంది ప్రత్యేక టికెట్స్ ఏమి విడుదల చెయ్యరు.
tirumala suprabhata seva


సుప్రభాత సేవ ఎలా జరుగుతుంది :

సుప్రభాత సేవ అంటే స్వామిని మేలుకొలుపు సేవ . రోజువారీ స్వామి కి నిర్వహించే పూజ కార్యక్రమాలు ఈ సేవతోనే ప్రారంభమవుతాయి . మొదట బంగారు వాకిలి తలుపులు తెరుస్తారు. "సుప్రభాతము " అనగా మంచిఉదయం అని అర్ధం . హిందుపూజావిధానాలలోను , ప్రత్యేకించి శ్రీవైష్ణవాచారపరంపర లోను భగవంతునికి అనేకమైన సేవలు ( షోడశోపచారాలు ) నిర్వచించే సంప్రదాయం ఉంది. ఇలాంటి లోనేదే సుప్రభాత సేవ . ఆ ప్రభాత సేవ సమయంలో చేసే "కీర్తననే సుప్రభాతం" అని అంటారు. 

ప్రతీ రోజు బ్రాహ్మీముహూర్తంలో 2:30 నుంచి 3 గంటల మధ్యలో ఈ సేవ జరుగుతుంది.

సుప్రభాత సేవ జరిగేముందు సన్నిథిగొల్ల దివిటీ పట్టుకుని ఉత్తర మాడవీధిలో ఉంటున్న వైఖానస అర్చక స్వామి ఇంటికి , బేడీ ఆంజనేయస్వామి గుడివద్దనున్న పెద్ద జియ్యంగార్ మఠానికివెళ్ళి వారిని మర్యాద పూర్వకంగా ఆలయానికి తీసుకునివస్తారు. అర్చకులు శ్రీవారి బంగారు వాకిలి తేరాడు ఉపయోగపడే కుంచెకోల అనే సదనం , తాళంచెవులను ధ్వజస్తంభం దగ్గరున్న క్షేత్రపాలకశిలకు తాకిస్తారు. వారు క్షేత్రపాలకులకునికి ధ్వజస్థంభానికి నమస్కరించి ప్రదక్షిణం చేసి వెండివాకిలి దాటి బంగారువాకిలిముందు శ్రీవారిని స్మరిస్తూ నిలుచుంటారు. ఆ సమయానికి ఆలయాధికారులు, పేష్కారు, శ్రీవారి సుప్రభాతాన్ని పాటించే వేదం పండితులు, తాళ్ళపాక అన్నమయ్యవంశస్తుడు ఒకరు తంబూరతో స్వామివారికి వేలుకొలుపు సంకీర్తన పాడటానికి సిద్ధంగా ఉంటారు. తాళాలు తీసిన తర్వాత సన్నధిగొల్ల బంగారు వాకిలి తెరచి దివిటీతో లోనికి ప్రవేశిస్తారు. ఆ తర్వాతే అర్చకులు మధురస్వరంతో కౌసల్యా సుప్రజా రామా .. అంటూ సుప్రభాతం అందుకొంటూ లోనికి ప్రవేశిస్తారు. 

నైవేద్యం : మహంతు మఠం వారు తెచ్చిన పాలు , చక్కెర , వెన్న , తాంబూలమును నైవేద్యంగా స్వామికి పెడతారు. 

మొదటి దర్శనం : దివిటీతో ముందుగా లోపలికి వెళ్లిన సన్నధి గొల్ల 'కులశేఖరపడి' వద్ద నిలిచి ఆ వెలుగులో శ్రీవారి దివ్య మంగళమూర్తిని తొలి దర్శనం చేసుకుంటారు. ఆ తరువాత అర్చకులు , ఏకాంగి 'కులశేఖరపడి' దాటి లోపలికి ప్రవేశిస్తారు. 

శయన మండపం లో బంగారు పట్టుపరుపుపై పవళించి ఉన్న భోగ శ్రీనివాసమూర్తిని సమీపించి నమస్కరించి చప్పట్లు చరుస్తారు. ఆ విధంగా ఆయన్ని మేల్కొనవలసిందిగా ప్రార్ధిస్తారు. ఆ పైన భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని జీవస్థానం లో మూల మూర్తి సన్నిధిలో వేంచేపు చేస్తారు. ఆనందనిలయం లో కులశేఖర పడివద్ద ఉన్న తెరవేసి అర్చకులు శ్రీవారికి ఆచమనాదిక్రియలను సమర్పిస్తారు. మహంతు మఠం వారు తెచ్చిన నవనీతం , పాలు , చక్కెరలను నివేదనచేసి, స్వామివారికి సుగంధతాంబూలాన్ని సమర్పిస్తారు. బంగారు వాకిలి ముంగిట్లో వేదపండితులు సుప్రభాతం ముగిస్తూ ఉండగా , లోపల అర్చకులు శ్రీవారికి నవనీత హారతి ఇస్తారు. 

నవనీత హారతి :

నవనీత హారతి అంటే నివేదన అనంతరం ఇచ్చే మొదటి కర్పూర హారతిని నవనీతహారతి అని పిలుస్తారు. ఆ సమయం లోనే బంగారు వాకిళ్ళు తెరుస్తారు. అపుడు శ్రీవారి పాదాలపై తులసీదళాలు , పుష్పాలు కూడా ఉండవు. భక్తులకు ఆపాదమస్తకం స్వామి దివ్యమంగళ విగ్రహ దర్శనం లభిస్తుంది. అందుకే ఈ దర్శనాన్ని విశ్వరూప సందర్శనం అని భక్తితో పిలుస్తారు. 

నవనీత హారతి తర్వాత అర్చకులు గత రాత్రి బ్రహ్మాదిదేవతలు శ్రీవారిని అర్చించడంకోసం మూల సన్నిధిలో ఉంచిన బ్రహ్మతీర్ధాన్ని , చందనాన్ని , శఠారిని తాము ముందుగా స్వీకరించి ఆ తరువాత జియ్యంగారికి, ఏకాంగికి ఇస్తారు. సన్నిధిగొల్లకుకూడా తీర్ధం , శఠారితో పాటు నివేదన పళ్ళెంలోని తాంబూలాన్ని అర్చకులు అందజేస్తారు. స్వామి వారి సుప్రభాత సేవ కోసం భక్తులు వరుసగా స్వామివారి సన్నిధికి వెళ్లి ఆ దివ్యమంగళమూర్తిని దర్శిస్తారు. 

సుప్రభాత సేవ టికెట్స్ ఎప్పుడు విడుదల చేస్తారు ?

తిరుమల తిరుపతి  దేవస్థానం మూడు నెలల ముందుగానే విడుదల చేస్తున్నారు , ప్రతి నెల 18 లేదా 19వ తేదీన విడుదల చేస్తున్నారు.  electronic Dip ద్వారా సెలెక్ట్ చేస్తారు .మనం ముందుగా టీటీడీ వెబ్సైట్ లేదా యాప్ లో రిజిస్టర్ చేసుకోవాలి

ఎలక్ట్రానిక్ డిప్ లో పాల్గొనడానికి ఎన్ని రోజులు సమయం ఇస్తారు ?
రెండు రోజులు సమయం ఇస్తున్నారు 
ఒకేసారి ఎంత మందికి టికెట్ బుక్ చేసుకోవచ్చు ?
ఇద్దరికీ ఒకేసారి బుక్ చేయవచ్చు 
దంపతులు మాత్రమే బుక్ చెయ్యాలా ?
ఆలా అని రూల్ ఏమి లేదు దంపతులు చేసుకోవచ్చు లేదా ఏ ఇద్దరైనా చేసుకోవచ్చు , సింగల్ గాను చేసుకోవచ్చు . 
మనం సెలెక్ట్ అయినట్టు ఎలా తెలుస్తుంది ?
సెలెక్ట్ అయిన వారికి టీటీడీ వారు మెసేజ్ చేస్తున్నారు ,మనం యాప్ లో కూడా చెక్ చేసుకోవచ్చు . 
తల్లిదండ్రులు సెలెక్ట్ అవితే పిల్లలను తీసుకుని వెళ్లవచ్చా ?
12 సంవత్సరాల లోపు వారిని తీసుకుని వెళ్ళవచ్చు . 
మాకు 12 వయస్సు దాటినా పిల్లలు ఉన్నారు ఏమి చెయ్యాలి ?
వారికి మీరు విడిగా రిజిస్టర్ చెయ్యాలి 
రిజిస్టర్ చేసే సమయం లో అమౌంట్ కట్టాలా ? 
అవసరం లేదు , సెలెక్ట్ అయ్యాక మాత్రమే కట్టాలి 
సుప్రభాత సేవ తో పాటు మిగిలిన సేవలను సెలెక్ట్ చేసుకోవచ్చా ?
సెలెక్ట్ చేసుకోవచ్చు 
అమౌంట్ కట్టడానికి సమయం ఎంత ఇస్తారు ?
సుమారు 40 గంటల సమయం ఇస్తున్నారు. 
సుప్రభాత సేవ టికెట్ ఎంత ఉంటుంది ?
సుప్రభాత సేవ టికెట్ ధర 120/- రూపాయలు . 
మనం డబ్బులు కట్టిన తర్వాత సేవ క్యాన్సిల్ చేయడానికి అవకాశం ఉంటుందా ?
అలా ఉండదు. డబ్బులు తిరిగి రావు . 
సేవ బుక్ అయినతరువాత ఇద్దరిలో ఒకరు రాకపోతే మరొకరు వెళ్లవచ్చా ?
వెళ్ళవచ్చు 
రాని వారి స్థానం లో మరొకరిని తీసుకుని వెళ్లవచ్చా ?
ఆలా తీసుకుని వెళ్ళడానికి అవకాశం లేదు. 
సుప్రభాత సేవ ఏఏ రోజులల్లో ఉంటుంది ?
సుప్రభాతం ప్రతి రోజు ఉంటుంది , కాకపోతే ధనుర్మాసం లో ఉండదు. 
సుప్రభాత సేవ ఏ సమయానికి జరుగుతుంది ?
సుప్రభాతం తెల్లవారు జామున  2-3 మధ్యలో జరుగుతుంది. 
టికెట్ ఉన్నవారు ఏ సమయానికి వెళ్ళాలి ?
టికెట్ పైనే టీటీడీ వారు రిపోర్టింగ్ టైం అని రాస్తారు ఆ సమయానికి మనం అక్కడ ఉండాలి , సాధారణం గా భక్తులందరూ 12:30 కె లైన్ లో ఉంటారు .
సుప్రభాత సేవ వచ్చినవారికి రూమ్ ప్రత్యేకంగా ఇస్తారా ?
సుప్రభాత సేవ కు రూమ్ కు సంబంధం లేదు , రూమ్ మనం విడిగా బుక్ చేసుకోవాలి. ఆన్ లైన్ లో రూమ్ రాకపోతే మనం CRO ఆఫీస్ దగ్గర తీసుకోవాలి. 
సుప్రభాత సేవ తో పాటు మనం 300/- టికెట్ తీసుకోవచ్చా ?
సుప్రభాత సేవ కు 300/- దర్శనానికి సంబంధం లేదు కాబట్టి మీరు తీసుకోవచ్చు. 
ఈ నెలలో మాకు సుప్రభాత సేవ వస్తే , ఆ తరువాత నెలలో వేరే సేవ కు డ్రా వేయవచ్చా ?
సుప్రభాత సేవ , తోమాల , అర్చన , అష్టదళ పాదపద్మారాధన సేవ లు అన్ని ఒక గ్రూప్ వీటిలో ఏది వచ్చిన మీరు 180 రోజుల వరకు ఇతర సేవ లు బుక్ చేయడానికి అవకాశం లేదు. 
సుప్రభాత సేవ వస్తే కళ్యాణం టికెట్ బుక్ చేయవచా ?
కళ్యాణం టికెట్ మీరు బుక్ చేసుకోవచ్చు 
సుప్రభాత సేవ వచ్చిన వారికి పెద్ద లడ్డులు ఎన్ని ఇస్తారు ?
సుప్రభాత సేవ కు ప్రత్యేకంగా పెద్ద లడ్డులు ఏమి ఇవ్వరు , చిన్న లడ్డు ఒకటి ఇస్తారు . 
సుప్రభాత సేవ కు వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకుని వెళ్ళాలి ?
సుప్రభాత సేవ టికెట్ ప్రింట్ అవుట్ మరియు ఆధార్ కార్డు లు తీసుకుని వెళ్ళాలి . సాంప్రదాయ దుస్తులు వేసుకుని వెళ్ళాలి. 
కొండపైన CRO ఆఫీస్ దగ్గర సుప్రభాతం సేవ లక్కీ డ్రా లో పాల్గొనడం ఎలా  ?
ప్రతి రోజు CRO ఆఫీస్ దగ్గర దగ్గర లక్కీ డ్రా ఉంటుంది , ఏఏ సేవలకు టికెట్స్ ఉన్నాయో ఒక బోర్డు పై రాసి ఉంచుతారు , మనం ఆధార్ కార్డు తీసుకుని వెళ్లి రిజిస్టర్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్ కు చెప్పాలి 
CRO ఆఫీస్ దగ్గర అన్ని సేవలకు రిజిస్టర్ చేసుకోవచ్చా ?
ఏదైనా ఒక్క సేవకు మాత్రమే అవకాశం ఉంటుంది 
CRO ఆఫీస్ దగ్గర టైమింగ్స్ ఏమిటి ?
ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు . 
బుక్ చేసిన ఫలితాలు ఎప్పుడు వస్తాయి ?
సాయంత్రం 6:30 కు వస్తాయి , మీరు సెలెక్ట్ అవితే మీకు మెసేజ్ చేస్తారు . మీరు పేమెంట్ చేస్తే టికెట్ బుక్ అవుతుంది. 
టీటీడీ వెబ్సైటు ఏది ?


 తిరుమల సుప్రభాతం సేవ ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి . సుప్రభాతం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి 

హిందూ టెంపుల్స్ గైడ్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు టికెట్స్ విడుదల ఇతర సేవ విషయాలు మీకు తెలియచేస్తాముమీరు ఇవి కూడా తెలుసుకోండి క్రింద ఇచ్చిన వివరాలపై క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి . 

ఇవి చదివారా ?
తిరుమల టికెట్ లేకుండా వెళ్తున్నారా
తిరుమల లో రూమ్ కావాలా ?
300/- టికెట్స్ రూల్స్
500/- టికెట్స్ రూల్స్
శ్రీవాణి టికెట్స్ వివరాలు
లక్ష ఆపైన డొనేషన్ వివరాలు
సుప్రభాతం టికెట్స్
తోమాల సేవ టికెట్స్
అర్చన టికెట్స్
అష్టదళ టికెట్స్
కళ్యాణం టికెట్స్
తిరుప్పావడ టికెట్స్
మెల్చట్ వస్త్రం
చంటి పిల్లల దర్శనం
శ్రీవారి సేవ
నవనీత సేవ
పరకామణి సేవ
తిరుమల చుట్టుపక్కల ఆలయాలు
ఇతర ఆర్జిత సేవలు
అంగ ప్రదక్షిణ
అన్నదాన సమయాలు
శ్రీవారి కళ్యాణ తలంబ్రాలు
తులాభారం
తిరుమల తీర్ధాలు వాటి విశేషాలు
సీనియర్ సిటిజెన్ దర్శనం
అరుణాచలం యాత్ర
కాశీయాత్ర

#tirumala #tirumalasuprabhataseva tirumala latest information. tirumala information in telugu. 

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.