Drop Down Menus

మేఘనాథస్వామి లలితాంబిక ఆలయం  | Thirumachu Lalithambika Meghanatha Swamy Temple | Tamilnadu


 ఒక్కసారి ఈ చిత్రం గమనించండి..

తిరుమెయిచూర్ లో శ్రీ లలితాదేవి అమ్మవారి అన్నవడై సేవ ముందు ఉన్నది నెయ్యి, అందులో అమ్మవారి ప్రతిబింబము కనపడుతుంది గమనించారా ? అలా కనిపిస్తోంది అంటే అమ్మవారి అనుగ్రహము కలిగినట్లే, మనం స్వయంగా ఆ ఆలయానికి వెళ్లి ఈ సేవ గమనించినా ఇంత స్పష్టంగా దర్శించుకోగలమా ? మనసు ఆనందంతో పరవశిస్తోంది.అంతా అమ్మ దయ కాకుంటే మరేమిటి....

Also Readఇంట్లో పూజ ఎవరు చేయాలి? 

అంతేకాదు ఆ నేతిలో అమ్మవారిని దర్శించుకుంటే జీవితాంతము భార్య భర్తల మధ్య మనస్పర్థలు రాకుండా ఉంటాయి అని అమ్మవారి వాక్కుగా చెబుతారు.మరిన్ని విశేషాలు కలిగిన ఈ అద్భుతమైన ఆలయం గురించి పూర్తిగా చదవండి.

అమ్మవారిని శాంతపరచిన మహాదేవుని ఆలయం, లలిత సహస్రనామ స్తోత్ర పారాయణమునకు అత్యంత శ్రేష్ఠమైన ప్రదేశం కూడా ఇదే, జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయంలో లలితా పారాయణము చేయాలని ఎంతోమంది భక్తులు తపించిపోతుంటారు, ఇప్పుడు మనకు కూడా అదే కోరిక కలుగుతోంది కదూ .....

Also Readఅన్నం తినే ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాలి.. 

మేఘనాథస్వామి లలితాంబిక ఆలయము

పరమేశ్వరుడు మేఘనాథస్వామిగా జగన్మాత పార్వతీదేవి  లలితాంబికగా ఆవిర్భవించిన దివ్యక్షేత్రం తిరుమెయిచూర్‌ ఆలయం. ఇది తమిళనాడులోని తిరువరూర్‌ జిల్లాలో ఉంది.

ఉగ్రరూపిణి నుంచి శాంత మూర్తిగా

పాండాసురుడనే రాక్షసుడు ఋషులను, దేవతలను హింసించేవాడు. అతని బాధలు పడలేక వారు జగన్మాత పరాశక్తికి మొరపెట్టుకున్నారు. దీనితో వారి బాధలు తీర్చేందుకు మాత యజ్ఞగుండం నుంచి శ్రీచక్రరథంపై ఆశీనురాలై లలితాంబిక నామధేయముతో ఆవిర్భవించినది, పాండాసురునితో భీకరంగా పోరుచేసి అతన్ని సంహరించినది. తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆమెను భూలోకానికి వెళ్లి మనోన్మణి పేరుతో తపస్సు చేయమని పరమేశ్వరుడు ఆదేశించాడు. లయకారకుని ఆదేశంతో ఆమె ఈ క్షేత్రానికి వచ్చి తపస్సుచేసి ప్రశాంతంగా అత్యంత దయామయురాలిగా మారినది,అనంతరం వాక్‌దేవతలను సృష్టించి తనకు సహస్రనామాలతో పూజచేయమని కోరినది, ఈ సహస్రనామాలనే నేడు లలితాస్తోత్రముగా పిలుస్తున్నాము..

Also Readభర్త భార్యను ఇలా పిలవడం మానేయండి. 

అభయహస్తములో అమ్మవారు

పరమేశ్వరుడు స్వయంభువుగా వెలిశారు, జగన్మాత శ్రీచక్ర రాజ సింహసనంపై అభయహస్తముతో భక్తులకు ఆశీర్వచనాలు అందిస్తోంది, తమిళ మాసమైన చితిరాయ్‌( ఏప్రిల్‌ -మే)లో సూర్యకిరణాలు నేరుగా ఆలయంలోకి ప్రసరించి స్వామి చరణాలు తాకుతాయి, ఆలయ ప్రాశస్త్యం గురించి నయనార్‌.. తిరుజ్ఞాన సంబందనార్‌ తన పద్యాల్లో రాశారు. ఆయుష్షు పెంపు కోసం ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 60, 80వ జన్మదినాలను స్వామి సన్నిధిలో చసుకోవడం ఎంతో పుణ్యమని భక్తులు విశ్వసిస్తారు.

అన్న ప్రసాదం

ఈ ప్రాంతంలోనే గరుత్మంతుడు, అతని సోదరుడు అరుణ.. వానర రాజులు వాలి, సుగ్రీవ, యమధర్మరాజు, శనీశ్వరులు పూజలు నిర్వహించారు, ఆయుష్షు కోసం యమధర్మరాజుకు ఇక్కడ హోమాలు నిర్వహిస్తారు. భగవంతుడికి నైవేద్యంగా పెట్టే అన్నాన్ని భగవంతుని చరణాల ముందు పెట్టి అనంతరం ప్రసాదంగా స్వీకరిస్తారు,ఈ ప్రసాదం అనేక రోగాల నుంచి విముక్తులను చేస్తుందని భక్తుల నమ్మకము, సూర్యభగవానుడిని పరమేశ్వరుడు శాపం నుంచి ఇక్కడే విముక్తుడిని చేశాడు.....

Also Readపూజ గదిలో చనిపోయిన వారి ఫోటోలు ఉండవచ్చా?

శుఖ బ్రహ్మదేవిగా

జగన్మాత లలితాంబికను సౌందర్యనాయకిగా కొలుస్తారు, ఇక్కడ వెలసిన దుర్గమ్మవారికి ఎనిమిది చేతులుండటంతో సుఖబ్రహ్మ దుర్గాదేవిగా ఆరాధిస్తారు, ఆమె చేతిలోని రామచిలుక శాంతిని ప్రబోధిస్తుంది, ఆలయ ప్రాంగణంలో మరిన్ని ఉపాలయాలను చూడవచ్చు.....

లలితా సహస్రనామావళి 

లలితాంబికకు హయగ్రీవుడు భక్తుడు, లలితా సహస్రనామాల గురించి అగస్త్యునికి వివరిస్తాడు,యావత్‌ విశ్వంలో ఈ నామాలను స్తుతించేందుకు అనువైన క్షేత్రం ఏది అని అడగగా తిరుమెయిచూర్‌ అని హయగ్రీవుడు వెల్లడిస్తాడు. దీంతో అగస్త్య మహాముని తన సతీమణి లోపాముద్రతో కలిసి ఈ క్షేత్రానికి చేరుకొని లలితాంబిక సన్నిధిలో సహస్రనామాలు జపిస్తాడు. దీనితో సంతోషించిన అమ్మవారు వారి ముందు నవరత్నాలు పొదిగిన హారము ధరించి ప్రత్యక్షమైనట్టు స్థలపురాణం చెబుతోంది, అమ్మవారి సన్నిధిలో లలితా సహస్రనామాలను పఠిస్తే అన్ని శుభాలు కలుగుతాయి....హర నమఃపార్వతీపతయే హర హర మహాదేవ శంభోశంకర ఓం నమఃశివాయ.

Also Readఇంటి ముందు ముగ్గులు ఎందుకు వెయ్యాలి ?

ఇలా చేరుకోవచ్చు

తమిళనాడులోని జిల్లా కేంద్రమైన తిరువరూర్‌కు 25 కి.మీ.దూరంలో ఉంది. సమీప రైల్వేస్టేషన్‌ పేరళంలో దిగి వాహనాల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయం తిరుచ్చిరా పల్లి. చెన్నై ఎగ్మూర్ నుంచి కరైకాల్‌ వరకు వెళ్లే రైళ్లు పేరళం స్టేషన్లో ఆగుతాయి.

Famous Posts:

సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు

ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు

ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే

అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం

> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి

100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?

శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి

meghanatha swamy temple, tamil nadu, tamil nadu temples, lalithambigai story, Thirumachu Lalithambika Meghanatha Swamy Temple, Sree Lalithambigai Temple, Thirumeeyachur, Lalithambigai temple, 

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.