Drop Down Menus

11_నెలలు_నీటిలో_ఉండే_శివలింగం | Natta Rameswaram Temple - History

 
11_నెలలు_నీటిలో_ఉండే_శివలింగం

శ్రీరాముడు రావణుడిని చంపి బ్రాహ్మణహత్య చేసాననే దిగులుతో పాపపరిహారనిమిత్తం ఎన్నోచోట్ల శివలింగాలకి ప్రాణ ప్రతిష్ట చేసాడు..

అలాగే పరశురాముడు కార్తవీర్యార్జునుడితో సైతం ఎంతోమంది క్షత్రియులని హత్యచేసిన బాధతో ఆయనకూడా క్రౌంచ పర్వతం మీద తపస్సు చేసి అక్కడ పూజ చేసిన శివలింగాన్నీ ఎక్కడ ప్రతిష్టించాలా అని అనుకుంటూ ఉండగా…

Also Readమీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి.

శ్రీరాముడు సీతామహాదేవితో కలిసి గోస్తనీ నదితీరం దగ్గరికి చేరుకోగానే అక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాలని అనుకున్నదే తడవుగా అక్కడున్న ఇసుక,నత్తలతో సీతాదేవి సహాయం తో ఒక శివలింగాన్ని తయారుచేసి ప్రతిష్ట చేసాడు.. ఆశివలింగాన్ని నత్తారామలింగేశ్వరస్వామి అని పిలుస్తారు..శ్రీరాముడు ,సీతామాహాదేవి కలిసి లింగాన్ని తయారు చేసాకా మిగిలిన ఇసుకముద్దని ని కుడా అక్కడే ఉంచేసారు.. అలా నత్తలు,ఇసుకతో శివలింగాన్ని తయారుచేసి ప్రతిష్టచేసారని పురాణ కధనం అలాగే పరశురాముడు కూడా తను పూజ చేసిన శివలింగాన్నీ తీసుకొచ్చి అదే గోస్తనీ నది తీరం లో ఈ రాముడు ప్రతిష్టించిన శివలింగం పక్కనే ప్రతిష్ట చేసాడు..

అయితే పరశురాముడు మహాకోపిష్టి కదా అందుకని అగ్నిలింగం లా కనపడేసరికి అయ్యో నా అహంకారం ఇంకా తగ్గలేదా అని బాధపడి శివలింగం చుట్టూ ఒక చెరువులా తవ్వి దానిని గోస్తనీ నది నీటితో నింపేసాడు.. స్వామి చల్లబడ్డాకా.. అయ్యోస్వామీ నీకు పూజలెలా అని బాధపడుతుంటే..

అప్పుడు స్వామి బాధపడకు పరశురామా.. నేను 11 నెలలు నీళ్ళతో ఉంటాను ఒక్క ఫాల్గుణమాసం లో అందరికీ కనిపిస్తూ ఉంటాను అని అభయమిచ్చాడు..అలా పరశురాముడు కూడా గోస్తనీ నది తీరంలో శివలింగాన్ని ప్రతిష్టించాడు. ఈ శివలింగాన్ని పరశురామలింగేశ్వరస్వామీ అని అంటారని పురాణ కధనం

Also Readపూజ గదిలో చనిపోయిన వారి ఫోటోలు ఉండవచ్చా?

ఇలా రెండు శివలింగాలు ఒకే ప్రాంగణం లో ఉన్న క్షేత్రం పశ్చిమగోదావరిజిల్లా పెనుమంట్ర మండలం లో ని “నత్తారామేశ్వరం ” లో ఉంది..

తాడేపల్లిగూడేం నుండి 20 కిలోమీటర్ల దూరం..

ఒక శివలింగం నీటిలోనూ,ఒక శివలింగం గర్భగుడిలోనూ కనిపిస్తూ ఉంటాయి.. తప్పకచూడవలసిన క్షేత్రం..నత్తారామలింగేశ్వరం..

     

Famous Posts:

నత్తారామేశ్వరం, Natta Rameswaram Temple, Natta Rameswaram Village, Natta Rameswaram, Natta Rameswaram Temple Hisoty in Telugu, Natta Rameswaram Temple Timings, 

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.