Drop Down Menus

లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే శుక్రవారం నాడు ఇవి పాటిస్తే చాలు - If you want to please Lakshmi Devi, just follow these on Friday

లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే శుక్రవారం నాడు ఇవి పాటిస్తే చాలు

లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నప్పుడు మాత్రమే సంపద లభిస్తుంది. అంతేకాకుండా లక్ష్మీదేవి ఆరాధనకు శుక్రవారం అత్యంత అంకితమైన రోజుగా ప్రజలు భావిస్తారు.

శుక్రవారం నాడు మహాలక్ష్మీని కొలిస్తే మంచి ఫలాలను ఇస్తుందని నమ్ముతారు. ఆమె కృపతో మనందరికీ సంపద, కీర్తి పెరుగుతుంది. శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఈ చర్యలు పాటించాలి.

Also Readఅప్పులకు స్వస్తి చెప్పే ఐశ్వర్య దీపం.. ఎలా వెలిగించాలి? ఐశ్వర్య దీపం అంటే ఏమిటి ?

శుక్రవారం ఈ పని చేయండి..

లక్ష్మీదేవి అనుగ్రహం లేకుండా డబ్బు సాధించడం సాధ్యం కాదు. శుక్రవారం నాడు లక్ష్మీదేవి ఉపవాసం ఉండి ఆరాధించాలి. సాయంత్రం సమయంలో నువ్వుల నూనె, నెయ్యితో దీపారాధన చేయాలి. పసుపు, కుంకుమతో పూజించి గులాబీ పువ్వును తల్లికి సమర్పించాలి. పాలు, బెల్లంతో తయారు చేసిన మిఠాయిలను లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పిస్తే మంచిది. అంతేకాకుండా తెల్లటి స్వీట్లు ఇవ్వడానికి ప్రయత్నించాలి.

​యంత్రాలను పూజించడం ద్వారా ధన ప్రాప్తి..

లక్ష్మీదేవి ఆరాధనతో యంత్రాలకు ప్రాత్యేక ప్రాముఖ్యత ఉందని చెబుతారు. ఇందుకోసం శ్రీయంత్రం, మహాలక్ష్మీ యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ కుబేర యంత్రాన్ని పూజించడం ద్వారా ప్రత్యేక ఫలాలను పొందవచ్చు. ఈ యంత్రాల ప్రభావంతో మీ సంపద పెరుగుతుంది. అంతేకాకుండా జీవితంలో ఆనందం ఏర్పడుతుందని శాస్త్రాల్లో ప్రస్తావించారు. వీటిని క్రమం తప్పకుండా పూజిస్తే ధనానికి ఎలాంటి లోటు ఉండదు. అవసరమనుకుంటే రాగి లేదా వెండి పత్రాలపై శ్రీయంత్రాన్ని తయారు చేసి ఇంటి ఈశాన్యమూలలో లేదా మీ పూజగదిలో ఉంచి ఆరాధిస్తే మంచిది.

కుబేరుడి ఆరాధన..

లక్ష్మీదేవిని మాత్రమే కాదు.. కుబేరుడిని కూడా సంపద దేవుడిగా పరిగణిస్తారు. పురాణాల నమ్మకాల ప్రకారం భూమిపై ధనం, సంపద కాపాడే పని కుబేరుడిది. ఆయనను సంతోష పెట్టడం ద్వారా సంపద లభించేందుకు ప్రత్యేక అవకాశాలు ఉంటాయి. ఇందుకోసం మీరు కుబేరుడి విగ్రహాన్ని లేదా ఇంటి చిత్రాన్ని పూజగదిలో ఏర్పాటు చేయాలి. వీటిని ఆరాధించడం ద్వారా జీవితంలో ఆర్థిక లాభాలు ఉంటాయి. అందువల్ల కుబేరుడి స్థాపన వల్ల సంపద పొందడానికి మంచి మార్గం ఏర్పడుతుంది.

శ్రీసూక్తాన్ని పఠించాలి..

లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకోవడాని శ్రీసూక్త వచనాన్ని కూడ పఠించడం ప్రభావవంతంగా పరిగణిస్తారు. రుగ్వేదంలో లక్షీ దేవి అనుగ్రహం పొందాలంటే శ్రీ సూక్తంలోని మంగళకరి మంత్రాలను పఠించాలని ప్రస్తావించారు. శుక్రవారం నాడు లక్ష్మీదేవి ఆరాధించేటప్పుడు శీ సూక్తాన్ని పఠించడం చాలా పవిత్రంగా భావిస్తారు. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొంది భక్తులకు ఆశించిన ఫలితాలను ఇస్తుందని విశ్వసిస్తారు.

Also Readఇంట్లో తాబేలు బొమ్మ ఉండచ్చా? ఉంటే ఏం జరుగుతుందో తెలుసా?

దానాలు చేయడం..

మహాలక్ష్మీ ఇంట్లోకి ప్రవేశించాలంటే సంపాదనతో కొంత భాగాన్ని దానాలు చేయాలి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి సంతోషించడమే కాకుండా ఆమె కూడా అనుగ్రహం పొందవచ్చు. సంపాదనలో కొంత భాగాన్ని దానం చేయాలి. అంతేకాకుండా కొంత ఆధ్యాత్మిక పనులకు ఉపయోగించాలి. అంతేకాకుండా ఇతరుల డబ్బు కోసం ఆశపడదు. ఇదే సమయంలో ఇతరుల వస్తువులను ఉంచుకోకూడదు తిరిగి వారికి ఇచ్చేయాలి.

Famous Posts:

> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి

100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?

శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి

lakshmi devi, goddess, lakshmi, lakshmi devi pooja vidhanam in telugu pdf, lakshmi pooja at home on fridays, lakshmi pooja at home in telugu, lakshmi narayana pooja vidhanam in telugu pdf, lakshmi devi nitya pooja vidhanam in telugu pdf, lakshmi adhanga pooja in telugu, Friday

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.