Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

విజయవాడ కనకదుర్గ అమ్మవారు ప్రత్యక్షంగా చూపిన మహిమలు | SRI DURGA MALLESWARA SWAMY VARLA DEVASTHANAM VIJAYAWADA

విజయవాడ కనకదుర్గ అమ్మవారు యొక్క కొద్దిపాటి మహిమలు ఈ కథనంలో తెలుసుకుందాం..

అమ్మవారు ప్రత్యక్షంగా చూపిన మహిమలు.

1. శ్రీ విజయదుర్గా అమ్మవారి ఆలయ నిర్మాణ సమయంలో పనిచేయటానికి వచ్చిన పేదకార్మీకుడొకడు అమ్మవారి గోపురంపై పనిచేస్తూ పొరపాటున కాలుజారి పైనుండి హఠాత్తుగా క్రిందపడ్డాడు . ఆ దృశ్యం చూసిన వారంతా అతను ప్రాణాలతో భైట పడతాడని ఊహించలేదు . కానీ అమ్మ మహత్యం వాల్ల అతనికి చిన్న దెబ్బ కూడా తగల్లేదు , సరి కదా అలాగే చక్కగా లేచి తేరుకొని తిరిగి తన పనికి  తాను  ఉపక్రమించాడు . ఈ దృశ్యం అందరిని ఆశ్చర్యంలో ముంచేసింది . ఇటువంటి మహత్తు లెన్నింటినో అమ్మ ప్రత్యక్షంగా చూపించింది.

2. అమ్మవారి ఆలయంలో వంటశాలలో మహాప్రసాదాలు తయారు చేసే బ్రాహ్మణుడు ఆలయం ముందున్న రహదారి దాటుకోడానికి  వెళుతున్నాడు . అంతలో వేగంగా వస్తున్న ఒక ఇసుక లోడు ట్రాక్టర్ ఆయన్ని డీకోన్నది . ఆ దగ్గరలో ఉన్న వారంతా గట్టిగా కేకలు వేస్తూ గుంపులుగా చేరారు . కానీ పెద్దగా గాయలేమి తగల్లేదు . కొద్దిపాటి వైద్యంతో పనిలోనికి వెళ్ళిపోయాడు . ఇది అమ్మ మహిమ కాక మరేమిటి.

3. కడప పట్టణంలో ఉన్న పెద్ద దర్గా ప్రక్కన కాపురముండే సాహెబ్గారికి ఈ విజయదుర్గమ్మ ఒకనాటి రాత్రి కలలో కనిపించి నాలుగు చేతులతో ఇరు చేతుల్లో శంఖ చక్రాలు మరొకచేతిలో శూలాన్ని పట్టుకొని నాల్గోవ చేతిలో పసుపు, కుంకుమ, గాజులు, బంగారు నాణేలతో ఆ సాహెబ్ నిదిరిస్తున్న సమీపంలోని బీరువా దగ్గర నిలబడి ఇదిగోరా ! తీసుకో అని అన్నది . ఆ సాహెబ్ భయంతో ఎవరు నీవు? అని ప్రశ్నించగా నేనురా ! విజయదుర్గను , అని ప్రశాంతమైన చూపుతో కొంచెం గంభీరంగా పలికింది . అతను వెంటనే మేలుకొన్నాడు , తెల్లారిన తరువాత అతనే స్వయంగా ఆలయానికి వచ్చి పసుపు , కుంకుమ , గాజులు అమ్మవారికి సమర్పించి పూజలు చేసి కలలో జరిగిన ఈ దృశ్యాన్ని వివరించినట్లు ఆలయ సిబ్బంది , అర్చకులు చెబుతున్నారు.

4. ఒక ప్రభుత్వోద్యోగి కడప నుంచి కర్నూలుకు ఉద్యోగరీత్య బదలీయై కుటుంబసమేతంగా వెళుతూ దారిలో ఉన్న ఈ విజయదుర్గమ్మను దర్శించుకొని పూజించి వెళ్లేముందు హడావుడిలో ఒకచేతి సంచిని ఆలయ సింహద్వారం దగ్గర మరచి వెళ్ళాడు . ఆ సంచి సరిగ్గా ఆలయ సిబ్బంది కంట పడింది . వారు దాన్ని తెరచి చూడగా అందులో డబ్బు , నగలు ఉన్నాయి . దాన్ని భద్రంగా దాచి పెట్టారు . తిరిగి గుర్తు తెచ్చుకొని ఆ వ్యక్తి వచ్చి అడిగిన్నపుడు ఆ సంచిని అందజేశారు .

వేరెవ్వరికైన దొరికి ఉంటే ఇదినాచేతికి అందేదికాదు . ఇదంతా ఇక్కడున్న ఆలయ సిబ్బంది నిజాయితి , ఈ అమ్మవారి మహత్తుకూ నిదర్శనమని సంతోషపడి ఆ భక్తుడు వెళ్ళిపోయాడు.

5. కడపలో నివాసిస్తున్న శ్రీ సి . ర . ఐ సుబ్బారెడ్డి గారు తన భక్తికి నిదర్శనంగా తన కారులో శ్రీ చక్రాన్ని అమర్చుచుకొని నిత్యం పూజిస్తుంటారు . వీరు కుటుంబ సమేతంగా కారులో బయలు దేరి నందవరం శ్రీ చౌడేశ్వరి దేవిని దర్శించుకొని తిరుగు ప్రయాణమై వస్తున్నపుడు హఠాత్తుగా గోర ప్రమాదం జరిగింది . కారంతా నుజ్జునుజ్జై పోయింది . కానీ ఏ ఒక్కరికి ప్రాణహాని జరుగలేదు . కారులో అమర్చిన శ్రీ చక్రంకూడా ఎలా అమర్చారో అలాగే ఉంది. సుబ్బారెడ్డి కుమారునికి , మేనల్లునికి  తీవ్రగాయాలైనవి . గాయపడిన వారిని హైదరాబాద్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు . గాయబడిన ఈ ఇద్దరబ్బాయిలు మరణించినట్లు టి . వి . లో న్యూస్ కూడా వెలువడింది . కానీ అమ్మవారి లీలలు ఎంత చిత్రమైనవో కదా ! ఆ మరుక్షణమే ఇద్దరబ్బాయిలకు సులభంగా చికిత్స జరగడం గాయబడిన కన్ను , కాలు సైతం నయం కావడం చక్కగా ప్రాణాలతో బయటపడడం . నమ్ముకున్నవారికి సొమ్ముగా నిలుస్తున్నది ఈ విజయదుర్గమ్మ అనటానికి ఇంత కంటే నిదర్శన మేముంది . ఆ దృశ్యాన్ని తలచుకుంటే మేమిప్పటికి నమ్మలేనంత ఆశ్చర్యానికి లోనవుతున్నాం అంటూ సుబ్బారెడ్డి గారు ఎంతో ఆసక్తిగా వివరించారు.

Famous Posts:

> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి

100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?

శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి

విజయవాడ కనకదుర్గమ్మ, విజయవాడ, కనకదుర్గ, Sri Durga Malleswara Swamy Varla Devasthanam, Kanaka Durga Temple, vijayawada kanaka durgamma story, vijayawada kanaka durgamma temple timings

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు