Drop Down Menus

ఇడాన మాత దేవాలయం, ఉదయపుర్, రాజస్థాన్

తీర్ధయాత్ర - రాజస్తాన్ 

ఇడాన మాత దేవాలయం, ఉదయపుర్, రాజస్థాన్

ఆలయ దర్శనం సమయం: ఈ ఆలయం ప్రతిరోజు 24 గంటలు తెరిచి ఉంటుంది

రాజస్థాన్ లో ఉదయపుర్ లో అగ్ని స్నానమాచరించే ఇడాన మాత ఆలయం ఉంది. అక్కడ అగ్ని దానంతటా అదే వస్తుంది. ఈ ఆలయానికి ఎక్కువగా పక్షవాతం రోగులు ఇక్కడకు వస్తుంటారు. ఈ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు.

 అక్కడున్న దేవత అగ్నిస్నానమాచరిస్తుంది. అంటే మంట దానంతట అదే ఉద్భవిస్తుంది. 

అగ్నిని నీరుగా తీసుకునే విచిత్రమైన అమ్మవారి దేవాలయం రాజస్థాన్ లో ఉంది. అక్కడ ఇడాన మాతాలయంగా ప్రసిద్ధి. ఈ మందిరానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆరావళి పర్వతాల్లో నెలకొని ఉన్న ఈ దేవాలయం రాజస్థాన్ లోని ఉదయపుర్ కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. పైన రూఫ్ లేకుండా నిర్మించిన ఈ ఆలయం చతురాస్రాకరంలో ఉంది. 

ఇడాన ఉదయపుర్ మేవాల్ మహారాణి పేరు మీదున్న ఈ ఆలయం చుట్టుపక్కల ఎంతో ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ ఉన్న ఇడాన మాత అగ్నిని స్నానంగా తీసుకుంటుంది. నెలకు రెండు మూడు సార్లు అమ్మవారు ఇలాంటి స్థితిలో ఉంటుందని అక్కడ స్థానిక ప్రజలు చెబుతున్నారు. మంట దానంతట అదే మండుతుంది. దేవాలయంలోని అమ్మవారి విగ్రహం తప్ప అక్కడున్న ప్రతి వస్తువు అగ్నికి ఆహుతి అవుతుంది. ఈ పరమ పవిత్రమైన దృశ్యాన్ని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా విచ్చేస్తుంటారు. 

ఇలా మంట ఎలా వస్తుందో తెలుసుకునేందుకో ఎంతో మంది ఎన్ని రకాలు పరిశోధనలు చేసిన ఫలితం లేకపోయింది. ఇంతవరకు ఈ మిస్టరీని కనిపెట్టలేకపోయారు. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేక గుర్తింపు వల్ల ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. ముఖ్యంగా పక్షవాతం, మానసిక ఆందోళకు గురవుతున్న ప్రజలు రోగ విముక్తి కోసం ఇక్కడకు వచ్చి అమ్మవారి ఆశీర్వదాలు పొందుతారు. ఆలయంలో అగ్ని వచ్చినంత కాలం ఇక్కడకు భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతుంటారు. 

ముఖ్యంగా దగ్గరలో ఉన్న గ్రామస్థులు భారీ సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడున్న అమ్మవారే స్వయంగా జ్వాలాదేవి రూపాన్ని ఆవహించిందని ఇడాన దేవాలయంలో పుజారులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ ఆలయంలో వచ్చే మంట దాదాపు 10 నుంచి 20 అడుగులు వరకు వస్తుందట. ఇక్కడకు వచ్చే భక్తులు అమ్మవారి అగ్నిని చూడటమే కాకుండా అక్కడున్న త్రిశూలాన్ని పూజిస్తారు. 

ముఖ్యంగా సంతానం లేని వారు త్రిశూలానికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఫలితంగా వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. పక్షవాతం రోగులకు అయితే ఆరోగ్యం కుదటపడి సాధారణ స్థాయికి చేరుకుంటారు. అంతేకాకుండా కోరుకున్న కోరికల తీరతాయని నమ్మకం.

ఎలా చేరుకోవాలి 

రోడ్డు మార్గం: సురజ్‌పోల్ నుండి ఉదయం సబర్బన్ బస్సు సర్వీస్ అందుబాటులో ఉంది. ఇది కాకుండా, కురాబాద్-బాంబోరా రోడ్డులో వెళ్లే వాహనాల ద్వారా బంబోరా చేరుకోవడం ద్వారా శక్తిపీఠాన్ని జీపు ద్వారా చేరుకోవచ్చు.

సమీప రైల్వే స్టేషన్: ఉదయపూర్ సిటీ రైల్వే స్టేషన్, ఇది ఇడాన మాత ఆలయం నుండి 63.4 కి.మీ దూరంలో ఉంది.

సమీప విమానాశ్రయం: మహారాణా ప్రతాప్ విమానాశ్రయం ఉదయపూర్, ఇది ఇదానా మాత ఆలయం నుండి 49 కిమీ దూరంలో ఉంది.

సర్వేజనా సుఖినోభవంతు

రామకృష్ణంరాజు గాదిరాజు

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.