Drop Down Menus

తిథిని అనుసరించి తినకూడని ఆహార పదార్థాలు - Foods that should not be eaten following the date

తిథిని అనుసరించి ఆహార విహారాదులు.

• పాడ్యమి నాడు కూష్మాండము ( గుమ్మడి, బూడిద గుమ్మడి ) తినరాదు. ఎందుకంటే ఇది నష్టాన్ని కలిగిస్తుంది.

• విదియనాడు వంకాయ తినడం విషం.

• తదియనాడు అడవి దొండకాయ తినడం వలన శత్రువులు పెరుగుతారు .

• చవితినాడు ముల్లంగి తింటే ధన నష్టం కలుగుతుంది .

• పంచమినాడు మారేడును ( బిల్వ ) తింటే అపనింద కలుగుతుంది.

• షష్టినాడు వేప ఆకు, వేప పండ్లు, వేప పుల్ల నోటిలో వేసుకోవడం వలన నీచ జన్మ కలుగుతుంది.

• సప్తమినాడు తాటి పండ్లను తింటే వ్యాధి ఎక్కువవుతుంది. అంతేగాక శరీరం నాశనం అవుతుంది.

• అష్టమి నాడు కొబ్బరి తిన్నవారి బుద్ధి నశిస్తుంది.

• నవమినాడు సొరకాయ ( ఆనపకాయ ) తినడాన్ని గోమాంస భక్షణవలె త్యజించాలి.

• ఏకాదశినాడు చిక్కుడు కాయ, ద్వాదశినాడు బచ్చలి, త్రయోదశి నాడు వంకాయ తిన్నచో పుత్రుని నాశనము జరుగుతుంది.

• అమావాస్య, పౌర్ణమి, సంక్రాంతి, చతుర్దశి, అష్టమి తిథులు, ఆదివారము, శ్రాద్ధ దినములలో, వ్రతమాచరించే రోజులలో స్త్రీతో సహవాసము, నువ్వులను తినడం మరియు శరీరానికి నూనెను పట్టించడం నిషిద్ధము. 

( బ్రహ్మవైవర్త పురాణం , బ్రహ్మఖండం : 27.37-38 )

• ఆదివారం నాడు అలచంద పప్పు, అల్లం, వేరుశనగ, ఎరుపు రంగులో ఉండే ఆకుకూరలు తినకూడదు.

( బ్రహ్మవైవర్త పురాణం , శ్రీకృష్ణ ఖండము : 75-90 )

• సూర్యాస్తమయం తర్వాత నువ్వులు వాడబడిన ఏ ఆహార పదార్థాన్ని కూడా తినరాదు.

( మనుస్మృతి : 4.75 )

• లక్ష్మీప్రాప్తి కోరిక ఉన్నవారు రాత్రికి పెరుగు మరియు పేలపిండి తినకూడదు. ఇది నరకాన్ని కలిగిస్తుంది ( ప్రాప్తింపజేస్తుంది ) .

( మహాభారతం, అనుశాసన పర్వం : 104.93 )

• పాలతో పాటు ఉప్పు , పెరుగు , వెల్లుల్లి , ముల్లంగి , బెల్లం , నువ్వులు , నిమ్మకాయ , అరటి , బొప్పాయి మొదలైన అన్ని రకాల పండ్లు , తులసి , అల్లం ఎన్నడూ సేవించరాదు. ఇవి విరుద్ధ ఆహారానికి సంబంధించినవి .

• పాలు త్రాగడానికి 2 గంటల ముందు గానీ లేదా 2 గంటల తరువాత గానీ భోజనం చెయ్యాలి. జ్వరం వచ్చినప్పుడు పాలు త్రాగడం అనేది పాము విషంతో సమానం .

• ముక్కలుగా కోసి చాలాసేపు ఉంచబడిన పండ్లు , పచ్చివి ( మామిడి , జామ , బొప్పాయి మొదలైనవి ) తినకూడదు. పండ్లు భోజనానికంటే ముందే తినండి. రాత్రికి పండ్లు తినకూడదు.

• ఒకసారి వండినటువంటి ఆహారాన్ని మరలా వేడిచేసి తినడం వలన శరీరంలో గడ్డలు తయారవుతాయి. ఈ గడ్డలు ట్యూమర్ వ్యాధికి దారితీయవచ్చు.

• తినకూడని పదార్థాలను తినడం ( అభక్ష్య - భక్షణము ) వలన కలిగే పాపం నశించడానికి ఐదురోజుల పాటు గోమూత్రం, గోమయం ( ఆవుపేడ ), పాలు , పెరుగు మాత్రమే ఆహారంగా తీసుకొనవలెను .( వసిష్ఠ స్మృతి : 370 )

Famous Posts:

సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము


శనేశ్వరుడు శనివారాల నోము


శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత


శివదేవుని సోమవారపు నోము కథ


తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?

Foods that should not be eaten following the date, dharma sandehalu telugu pdf, dharma sandehalu questions, dharma sandehalu online, bhakthi tv dharma sandehalu

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.