Drop Down Menus

సర్వ రోగాలకు విరుగుడు ఈ మూడు నామాలు నిత్యం చదివేవారికి కలి ప్రేరితమైన రోగాలు రావు.| These three names are antidote to all diseases

సర్వ రోగాలకు విరుగుడు నామత్రేయాస్త్రం..

నామ త్రయం అంటే మూడు నామాలు. అవి "శ్రీ అచ్యుతాయ నమః, శ్రీ అనంతాయ నమః, శ్రీ గోవిందాయ నమః" ఈ మూడు నామాలు నిత్యం చదివేవారికి కలి ప్రేరితమైన రోగాలు రావు. జబ్బులు ఏమైనా ఉంటే అనతి కాలంలోనే తగ్గిపోతాయి.

ఈ నామాలు ఒక దివ్యౌషధం లా పనిచేస్తుంది. భగవన్నామాలలో ఎన్నో అద్భుత శక్తులు ఉన్నాయి. అద్భుత మహిమ ఉంది. అందునా కొన్ని నామాలు మరీ విశిష్టమైనవి. అట్టి విశిష్ట నామాల్లో మరీ విశిష్ట నామాలు అచ్యుత, అనంత, గోవింద అన్నవి.

పద్మ పురాణంలో ఈ నామ మహిమ "అచ్యుతానంత గోవింద నామెాచ్ఛారణ భేషజాత్ నశ్యంతి సకలారోగాః సత్యం సత్యం వదామ్యహ" అని మిక్కలి గొప్పగా వర్ణించబడింది.

అంటే "ఈ నామాలను పలకటం అనే మందు చేత సర్వరోగాలు నశించి తీరుతాయి. ఇది సత్యం, నేను సత్యం చెబుతున్నాను" అని దీనర్ధం.

ఇలా రెండు మార్లు సత్యం అని చెప్పటం ద్వారా శ్రీ ధన్వంతరి ప్రమాణం చేసి చెప్పారన్న మాట. క్షీరార్ణవ మథన సమయంలో అవతరించిన మహా మహిమాన్విత పురుషుడు శ్రీ ధన్వంతరి. ఆయుర్వేద వైద్య విద్యలో ఆయనదే ప్రధమ స్థానం. 

పార్వతీదేవి అడుగగా శంకరుల వారు శ్రీమన్నారయణుని లీలల గురించి, కుార్మావతార సందర్భంలో క్షీరసాగరమథన గాథ వినిపిస్తుా ఇలా అన్నారు. పార్వతీ! పాల కడలిలో లక్ష్మీ దేవి అవతరించింది. దేవతలు, మునులు లక్ష్మీనారాయణుని స్తుతిస్తున్నారు. ఆ సందర్భంలోనే భయంకరమైన హాలాహలం పాలకడలి నుంచి ఉద్భవించింది.

ఆ హాలాహలం చుాసి దేవతలుా, దానవులుా భయపడి తలో దిక్కుకి పారిపోయారు. పారిపోతున్న దేవతలను, దానవులను ఆపి, భయపడవద్దని చెప్పి, ఆ కాలకుాటాన్ని నేను మ్రింగుతానని ధైర్యం చెప్పాను. అందరుా నా పాదాలపై బడి నన్ను పుాజించి స్తుతించ సాగారు. 

అపుడు నేను ఏకాగ్ర చిత్తంతో సర్వ దుఃఖ హరుడైన శ్రీమన్నారాయణుని ధ్యానం చేసుకుని ఆయన నామాల్లో ప్రధానమైన ముాడు నామాల్ని

అచ్యుత, అనంత, గోవింద" అన్న ముాడు మహా మంత్రాల్ని స్మరించుకుంటూ ఆ మహా భయంకరమైన కాలకుాట విషాన్ని త్రాగివేశాను. సర్వ వ్యాపి అయిన విష్ణు భగవానుని యెుక్క ఆ నామ త్రయం యెుక్క మహిమ వల్ల సర్వ లోక సంహారకమైన ఆ విషాన్ని సునాయాసంగా త్రాగేశాను. ఆ విషం నన్నేమి చెయ్యలేక పోయింది అని సాక్షాత్తూ సదా శివుడు తెలిపాడు.

కనుక మీరు కూడా "శ్రీ అచ్యుతాయ నమః, శ్రీ అనంతాయ నమః, శ్రీ గోవిందాయ నమః" అన్న "నామ త్రేయాస్త్ర మంత్రాన్ని" పలికేటప్పుడు ఈ మహిమనంతా జ్ఞాపకముంచుకుని, విశ్వాసం పెంచుకుని, మంత్ర మననం చేయడం ద్వారా అనారోగ్య బాధలు తొలగించుకుని, ఆయురారోగ్యాలను పొందవచ్చు.

ప్రతి రోజు ఒక గ్లాసు గోరు వెచ్చటి నీటితో మీ దినచర్యను ప్రారంబించండి. నీటి గ్లాసును చేత పట్టుకుని " నామ త్రేయాస్త్ర మంత్రాన్ని" కొద్దిసేపు పలికి, ఆ నీటిని మంత్ర బలంతో శక్తివంతం చేసి, తరువాత ఆ నీటిని స్వీకరించండి. ప్రతి రోజు ఇలా చేయడం వలన రోగాల బారిన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.

Famous Posts:

సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు

ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు


ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే


అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం


> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి


100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం


> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం


అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

sri maha vishnuvu, krishna, govinda, vishnu namalu in telugu, vishnu namalu telugu pdf, vishnu ashtothram telugu, 108 names of lord vishnu pdf, vishnu 

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.