Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

నవరాత్రుల్లో కుమారి పూజ ఎప్పుడు చేయాలి? ఏవిధంగా చేయాలి ? Kumari Pooja Vidhanam in Telugu

నవరాత్రులలో సువాసిని , కుమారి పూజ విధానం:

పసుపుకొమ్మలను సేకరించి , నిమ్మరసంలో మూడు రోజులు నానబెట్టి , ఎండలో ఆరబెట్టి , కుంకుమరాళ్లను కలిపి , దంచి , జల్లించి , సేకరించినది ఉత్తమమైనది. ఇటువంటి కుంకుమతో అమ్మను ఆరాధించిన అన్నికోర్మెలునెరవేరతాయి.

కుంకుమను స్త్రీలు ప్రత్యక్షంగా ధరించవచ్చు. పురుషులు ముందుగా చందనమును ధరించి , ఆపైన కుంకుమను ధరించాలి. ఈవిధంగా ధరించనియెడల పురుషత్వము నశిస్తుంది.

అదేవిధంగా పసుపును పురుషులు శరీరానికి పూసుకొనరాదు. పూసుకొనిన యెడల పురుషత్వము నశిస్తుంది.

సువాసినీ పూజ ఏవిధంగా చేయాలి ?

సలక్షణాలతో ఏవిధమైన అవయవ లోపంలేని సౌమ్యమైన , ముతైదువను ఎంచుకొని., అమ్మవారిగా భావించి., షోడశ ఉపచారములతో శ్రీసూక్త విధానంగా సహస్ర , త్రిశతీ , అష్ణోత్తర , ఖడ్గమాల నామములతో అర్చించి , మంగళహారతి ఇచ్చి , ఆభరణ , పుప్ప , హరిద్ర , కుంకుమ చందనాదులతో సత్కరించి , ఆ సువాసినితో ఆశీర్వచనము తీసుకొనిన సువాసినీపూజ పూర్తియగును.

ఈ సువాసినీపూజ శ్రీచక్రనవావర ణార్చన అనంతరం దేవీనవరాత్రులలో నిర్వహించాలి. వైవియస్ఆర్ శక్తి అనుసారం ఒక ముతైదువకుగానీ , ముగురికిగానీ , ఐదుగురికిగానీ , ఏడుగురి కిగానీ ,తొమ్మిదిమందికిగానీ , పద్దెనిమిదిమందికి గానీ , ఇరవై ఏడుమందికి గానీ , యాభై నాలుగు మందికి గానీ , నూట ఎనిమిది మందికిగానీ , ఐదువందల యాభై ఎనిమిదిమందికి గానీ , వెయ్యిన్నూట పదహారు మందికిగానీ సువాసినీపూజ చేయవచ్చును.

బ్రాహ్మణ ముతైదువలకు సువాసినీపూజ చేసిన భక్తి , జ్ఞాన , వైరాగ్యములు , విద్యాభివృద్ధి కలుగును.

క్షత్రియ ముతైదువలకు సువాసినీపూజ చేసిన ధైర్య సాహసములు వృద్దియగును. ముతైదువలకు సువాసినీపూజ చేసిన అప్టెశ్వర్య భోగభాగ్యములు వృద్దియగును.

శూద్ర ముతైదువలకు సువాసినీ పూజ చేసిన సత్సంతానప్రాప్తి కలుగును. మన యొక్క కామ్యమునుబట్టి సువాసినులను ఎంచుకొని , ఆహ్వానించి , ఆరాధించి , ఆశీస్సులు పొందవలయును.

కుమారీపూజ ఏవిధంగా చేయాలి ?

అమ్మవారికి ప్రియమైన అర్చనలలో కుమారీ అర్చన విశేషమైనది. శ్రీదేవీ నవరాత్రులలో 

మొదటిరోజు ఒక సంవత్సరం కలిగిన కన్యను బాలగా ,

రెండవ రోజు రెండు సంవత్సరాలు కలిగిన కన్యను కుమారిగా

మూడవరోజు మూడు సంవత్సరాలు కలిగిన కన్యను త్రిమూర్తిగా ,

నాల్గవరోజు నాలుగు సంవత్సరాలు కలిగిన కన్యను కళ్యాణిగా,

ఐదవరోజు ఐదు సంవత్సరాలు కలిగిన కన్యను రోహిణిగా ,

ఆరవరోజు ఆరు సంవత్సరాలు కలిగిన కన్యను కాళికగా ,

ఏడవరోజు ఏడు సంవత్సరాలు కలిగిన కన్యకను చండికగా ,

ఎనిమిదవరోజు ఎనిమిది సంవత్సరాలు కలిగిన కన్యకను శాంభవిగా ,

తొమ్మిదవరోజు తొమ్మిది సంవత్సరాలు కలిగిన కన్యకను దుర్గగా ,

పదవరోజు పది సంవత్సరాలు కలిగిన కన్యకను సుభద్రగాభావించి షోడశఉపచారాలతో శ్రీసూక్త విధానంగా సహస్ర , త్రిశతీనామ , అష్ణోత్తర శతనామ , దేవీఖడ్గమాలా నామాదులతో , హరిద్ర ,

కుంకుమ పుష్పాదులతో అర్చించి , మంగళహారతులిచ్చి , ఆభరణ , పుష్ప , చందనాదులతో సత్కరించి వారియొక్క ఆశీర్వచనము తీసుకొనిన సకలశుభములు కలుగును..

Tags: Kumari Pooja, కుమారి పూజ, Kumari Puja, kumari puja benefits, kumari puja age limit, Kumari puja Vidhanam

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు