Drop Down Menus

మహిమాన్విత మాసం - కార్తీక మాసం కార్తిక పురాణ శ్రవణం వల్ల కలిగే ఫలితం ఏమిటి ? Importance Of Karthika Purana Sravanam

కార్తిక పురాణ శ్రవణ ఫలం

కార్తిక పురాణ శ్రవణం వల్ల కలిగే ఫలితం ఏమిటి ?

ఫలితము :- ఆత్మస్థయిర్యం , కుటుంబ క్షేమం

కొన్ని మంచి మాటలు వింటేనే జీవితం సన్మార్గంలో నడుస్తుంటుంది. అప్పుడప్పుడన్నా అలాంటి మంచి మాటలను యధాలాపంగానైనా వినటం అవసరం. ఈ సత్యాన్ని తెలియచేస్తున్నట్లు ఉంటుంది.

కార్తిక పురాణ శ్రవణ ఫలం:

శ్రవణమంటే వినటం అని అర్థం. పూర్వం తండ్రి చెప్పిన మాట వినకుండా ఆ తండ్రి కోపానికి గురై ఎలుకగా జన్మించిన ఓ కుర్రాడి కథ ఇక్కడ ప్రస్తావితమవుతోంది. స్కంద పురాణం అంతర్గతంగా ఉన్న కార్తిక పురాణం అయిదో అధ్యాయంలో ఇదంతా కనిపిస్తుంది.

జనక మహారాజుకు వశిష్ఠుడు సర్వపాప క్షయకరమైన కార్తిక మాస విశేషాలను వివరించసాగాడు. కార్తిక మాసంలో "శ్రీమహా విష్ణువు సన్నిధిలో భగవద్గీత పారాయణ "చేయడం ఎంతో శుభప్రదం.

భగవద్గీతలో ఉన్న విభూతి , విశ్వరూప , సందర్శనాధ్యాయాలను పారాయణ చేయాలి. అలా చేయటం వల్ల వైకుంఠ వాసార్హత లభిస్తుంది.

శ్రీమహా విష్ణువును తులసీ దళాలతోనూ , తెల్లనివి , నల్లనివి అయిన అవిశ పూలతోనూ , గన్నేరు పూలతోనూ పూజించటం ఎంతో మేలు.

ఈ మాసంలో హరి సన్నిధిలో కార్తిక పురాణంలోని ఒక శోక్లాన్ని విన్నా లేదా ఒక శ్లోక పదాన్ని చెప్పినా , విన్నా కర్మ బంధ విముక్తి లభిస్తుంది. అలాగే కార్తిక శుక్ల పక్షంలో వన భోజనం కూడా పాపనాశకరమే. ఈ మాసంలో చేసే జపాలు , హోమాలు అన్నీ రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయి. సర్వపాపాలనూ నశింపచేస్తాయి.

వన భోజనం విషయంలో ముందుగా వనంలో ఉన్న ఉసిరి చెట్టు దగ్గర సాలగ్రామాన్ని ఉంచి గంధ పుష్పాదులతో పూజించి భక్తితో ముందుగా వేద పండితులకు భోజనం పెట్టాలి. ఆ తర్వాత మిగిలిన వారు భోజనం చేయాలి.

శ్రవణ ఫలం:

పూర్వం కావేరీ తీరంలో దేవశర్మ అనే వేద వేదాంగ పండితుడు ఉండేవాడు. అయితే ఆయనకు జన్మించిన కుమారుడు మాత్రం తండ్రి మాట వినకుండా తిరుగుతూ ఉండేవాడు. ఓ సంవత్సరం కార్తికం ప్రవేశించగానే ఆ మాస పవిత్రతను చెప్పి వ్రతాన్ని ఆచరించమన్నాడు దేవశర్మ.  కానీ , కుమారుడు తండ్రి మాటను తిరస్కరించటమే కాక నాస్తిక ధోరణిలో తండ్రిని ఎదిరించాడు. దాంతో తండ్రికి కోపం మితిమీరి ఎలుకగా పుట్టమని శపించాడు. అప్పటికి ఆ కుమారుడికి జ్ఞానోదయమైంది. తప్పు క్షమించమని తండ్రి కాళ్ళ మీద పడ్డాడు.

తండ్రి కరుణించి ఎప్పుడు కార్తిక మహాత్మ్యాన్ని (కార్తిక పురాణాన్ని) వింటావో అప్పుడు పాప విమోచనం కలుగుతుందని చెప్పాడు. ఆ తర్వాత కొద్ది సమయానికే దేవశర్మ కుమారుడు ఎలుకగా మారి సమీప అరణ్యంలో ఉన్న ఓ చెట్టు తొర్రలో నివసించసాగాడు.

ఇంతలో ఓ రోజున విశ్వామిత్రుడు తన శిష్యులతో కలిసి ఆ పరిసరంలో ఉన్న కావేరీ నదిలో స్నానమాడటానికి వచ్చాడు. ఆ తర్వాత ఎలుక ఉన్న చెట్టు దగ్గరకొచ్చి తన శిష్యులతో కార్తిక మహాత్మ్యాన్ని చెప్పటానికి , హరి పూజకు సంసిద్ధుడయ్యాడు.

ఇంతలో ఓ దారి దోపిడీ వేటగాడు అక్కడున్నది సామాన్య మునులనుకొని వారిని బాధించి , వారి దగ్గరున్న వస్తువులను తీసుకెళ్ళటానికి వచ్చాడు.

కానీ , ఆ సజ్జన దర్శనంతో అతడిలోని పాపపు ఆలోచనలన్నీ పోయి సాత్వికుడిగా మారి విశ్వామిత్రుడి కాళ్ళ మీద పడ్డాడు. తనలో ఏదో తెలియని మార్పు వచ్చిందని , అది తనకే ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని కనుక తనకు ఇంకా ఏదైనా మంచి విషయాన్ని బోధించి ముక్తి లభించేలా చేయమని ప్రార్థించాడు. విశ్వామిత్రుడు వెంటనే కార్తిక వ్రత మహాత్మ్యాన్ని గురించి చెప్పి కార్తిక పురాణాన్ని వినిపించాడు. జరుగుతున్నదంతా చెట్టు తొర్రలో నుంచి చూస్తున్న ఎలుకకు శాప విముక్తి కలిగి అసలు రూపం లభించింది.

అప్పుడు ఆ దేవశర్మ కుమారుడు విశ్వామిత్రుడి కాళ్ళమీద పడి విషయమంతా చెప్పి ఆయన ఆశీర్వాదం పొంది ఇంటికి తిరిగి వెళ్ళాడు. బోయ కూడా ఆనాటి నుంచి పూర్తిగా హింసకు దూరమై అత్యంత కాలంలో ముక్తిని పొందాడు. ఇదంతా పూజ , వ్రతం , పురాణ కథ అని కొట్టి పారేయనక్కరలేదు. తల్లితండ్రులను ఎదిరించిన వాడు కష్టాల పాలవుతాడని సజ్జన దర్శనం , సాంగత్యం మనిషిలో మంచి మార్పును తెస్తాయని చెప్పే సందేశాన్ని గమనించి ఆచరించవచ్చు.

Tags: కార్తీక పురాణ శ్రవణం, కార్తీక మాసం, Purana Sravanam, Karthikapuranam, Karthika purana sravanam, Lord shiva

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.