Drop Down Menus

శ్రీ వేంకటేశ్వర వ్రత కల్పము Sri Venkateswara Vratha Kalpam Telugu

శ్రీ వేంకటేశ్వర వ్రత కల్పము

శ్రీ వశిష్ఠ ఉవాచ

ఈ అధ్యాయాన్ని మహా తపోనిష్ఠా గరిష్ఠులైన శ్రీ వశిష్ఠ మునీశ్వరుల వారు శ్రీ మన్నారాయణుల వారి అనుగ్రహంతో మనకు వివరించారు.

“ఓ కలియుగ వాసులారా! శ్రీనివాసుని ప్రియ భక్తులారా! వైకుంఠంలోని శ్రీ మన్నారాయణుడే నేటి తిరుమల శ్రీ వేంకటేశ్వరుడు. కలియుగ వాసులైన మీ అందరి కష్టాలనూ తీర్చడానికి స్వామి మీకు అతి చేరువలో ఈ తిరుమల కొండపై అవతరించారు. ఆ స్వామివారిని ప్రసన్నం చేసుకొనడానికి ఈ వ్రతం మిక్కిలి సులభతరం. ఈ వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు సకల సౌభాగ్యాలనూ అనుభవిస్తారు.

పూర్వకాలంలో అవంతీ దేశంలో భాగ్యనగరమనే పట్టణం ఉండేది. పేరుకు తగినట్లుగానే ఆ పట్టణంలో అనేక మంది భాగ్యవంతులు ఉండేవారు. అయితే వారు తమ తమ సంపదలను చూసుకుని గర్విస్తూ మిగిలిన సామాన్యులను అతి హీనంగా చూసేవారు. ఆ ఐశ్వర్యమంతా తమ గొప్పేనని తలుస్తూ నిత్య పూజలు కాదు గదా, విశేష రోజులలో కూడా ఏ పూజలూ చేసేవారు కాదు.

ఆ సృష్టికర్త శ్రీమన్నారాయణునికి వీరందరికీ జ్ఞానోదయం కలిగించాలని తోచింది.

ఒకరోజున ఆ ధనవంతులందరూ అనేక విందు విలాసాలలో మునిగి తేలుతున్నారు. ఆ పట్టణ తూర్పువీధిలో గల శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో కనీసం దీపం వెలిగించే నాథుడు కూడా కరువయ్యాడు.

ఆ రోజు తొలి ఏకాదశి అత్యంత పర్వదినం. కానీ ఆ పట్టణంలో ఒక్కరు కూడా ఆ ఆలయానికి పూజాదికాలు నిర్వర్తించాలని ఆలోచించట్లేదు.

సాయంత్రం ఉన్నట్టుండి దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి. బ్రహ్మాండమైన కుంభవృష్టి. వ్యాపారులందరి ఇళ్ళూ నీట మునిగి పోసాగాయి. అంతా గాడాంధకారం. తెల్లవారే సరికి ఊరంతా నేలమట్టమయింది. వ్యాపారుల ఇళ్ళన్నీ కూలిపోయాయి. ఐశ్వర్యాలూ పోయి చివరికి కట్టుబట్టలతో మిగిలారు. ఎందుకీ ఉపద్రవం..ఎందుకీ జల ప్రళయం.. ఎవరికీ అంతు బట్టట్లేదు.. అంతలో వారికొక విశేషం కనిపించింది.

ఊరి చివరన ఉండే పూరిపాకలు చెక్కు చెదరకుండా ఉన్నాయి.. వారికి ఆశ్చర్యం కలిగింది.. ఇంత కుంభవృష్టిలోనూ ఈ పూరిపాకలు ఎలా ఉన్నాయి?.... అని వారిలో వారు అనుకుంటుండగా ఇంతలో ఒక పెద్ద మెరుపు మెరిసింది.. ఆకాశవాణి ఇలా పలికింది.

'ఓ మూర్ఖులారా ! మీ సంపదలన్నీ మీ గొప్ప తనమని తలచుకొనటం వలననే ఇలా జరిగింది.. ఆ పూరి గుడిసెలో నివసించే దేవయ్య నాకు ప్రియభక్తుడు. ఆతి సామాన్యుడైన దేవయ్య ప్రతిరోజూ మీ ఊరిలోని శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో దీపం వెలిగిస్తున్నాడు.. అంతే కాక ప్రతీ ఏకాదశినాడు తనకు వీలున్నంతలో శ్రీ వేంకటేశ్వర వ్రత కల్పాన్నీ నిర్వర్తిస్తున్నాడు. ఆ వ్రత ఫలితంగానే తనతో పాటే ఆ గుడిసెలలోని వారందరూ రక్షింపబడ్డారు. మీరందరూ కూడా ఆ వ్రతం ఆచరించిన ఎడల మీ మీ ఐశ్వర్యాలను తిరిగి పొందగలరు.' అని వినిపించింది.

వెంటనే వారందరూ ఆ ఆలయానికి వెళ్ళి తక్షణమే అందరూ తలొక పనికీ పూనుకుని శ్రీ వేంకటేశ్వర వ్రత కల్పాన్ని ఆచరించారు. ఆ వ్రత ఫలితంగా అందరి గృహాలూ పూర్వరూపంలో కనిపించాయి.

అది మొదలుగా ఆ వర్తకులందరూ శ్రీవారి భక్తులై ప్రతీ ఏకాదశి నాడూ శ్రీ వేంకటేశ్వర వ్రత కల్పాన్ని ఆచరిస్తూ బ్రతికినంత కాలం సుఖ సౌభాగ్యాలతో ఉండి చివరికి ముక్తిని పొందారు. ” అని శ్రీ వశిష్ఠులవారు వివరించారు.

Tags: శ్రీ వేంకటేశ్వర వ్రత కల్పం, Sri Venkateswara Vratha Kalpam, Sri Venkateswara, Sri Venkateswara Vrata Kalpam Telugu, Vrata Kalpam, Govinda, Venkateswara Stotram

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.