Drop Down Menus

The Story of Sri Adi Varaha Swamy | Tirumala


ఇప్పటి వరకు మీరు తిరుమల ఎన్నిసార్లు వెళ్లారు, వెళ్లిన ప్రతి సారి  మీరు వెంకటేశ్వర స్వామిని మాత్రమే దర్శించుకుంటున్నారా , తిరుమల వెళ్లిన ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామి ని మాత్రమే దర్శించుకుంటే చాలదు మీకు యాత్ర ఫలం కలగాలన్న మీరు తిరుమల వెళ్లిన ప్రతిసారి ముందుగా ఆదివారాహస్వామి ని దర్శించాలి. తిరుమల వైకుంఠ కాంప్లెక్స్ లో ఒక లక్ష మంది భక్తులు ఉంటే. అందులో ఎంత మంది ముందుగా ఆదివారాహస్వామి ని దర్శించుకుంటున్నారు. లక్ష మందిలో సగం కూడా ముందుగా స్వామి వారిని దర్శించుకోవడం లేదు. ఇకపై మీరు ఆ తప్పు చేయకండి.  ముందుగా కొండమీదకు వెళ్ళగానే మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించే ముందు  ఆదివారాహస్వామి వారిని దర్శించండి. స్వామి వారి పుష్కరిణి పక్కనే ఆదివారాహస్వామి వారు కూడా ఉంటారు . ఈసారి మీరు తిరుమలకు వెళ్ళినపుడు తప్పకుండ ఆదివారాహస్వామిని  దర్శనం చేసుకోండి ఆ వేంకటేశ్వరుని దీవెనలు పొందండి. 


శ్రీవరాహమూర్తి, వరాహావతారము, వరాహ స్వామి   ఇవన్నీ శ్రీమహావిష్ణువు మూడవ అవతారమును వర్ణించే నామములు. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధుపరిరక్షణకొఱకు, దుష్టశిక్షణ కొఱకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. వానిలో అతిముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు. ఈ దశావతారాలలో మూడవ అవతారము వరాహావతారము. మహాలక్ష్మిని సంబోధించే "శ్రీ" పదాన్ని చేర్చి శ్రీవరాహమూర్తి అని ఈ అవతార మూర్తిని స్మరిస్తారు. వరాహావతారం హిరణాక్షుడిని చంపి, భూమిని ఉద్ధరించి, వేదములను కాపాడిన అవతారము. స్వామి ప్రార్థనలలో ఒకటి:
ఆది వరాహ మూర్తి, యజ్ఞవరాహ మూర్తి, మహా సూకరం అని నామాలు కూడా ఉన్నాయి. తిరుమల కొండలపై మొదట వెలసిన స్వామి వీరే, వీరి అనుమతితోనే వేంకటేశ్వరుడు అక్కడ నివాసము ఏర్పాటుచేసుకున్నారు. రాక్షసునితో భయంకరంగా యుద్ధం చేసి, చక్రాయుధంతో వానిని సంహరించి, భూమాతని జలము పై నిలిపిన స్వామి, వేదాలను రాక్షసుల బారినుండి రక్షించిన స్వామి.


ముందుగా వరాహస్వామిని ఎందుకు దర్శించుకోవాలి?
అశేష భక్తజనానికి ఆరాధ్యదైవం అయిన తిరుమల వేంకటాచలంలో ఆదిదైవం వరాహస్వామి. వరాహస్వామికి అంత ప్రాముఖ్యత ఎందుకంటే అసలు భూమాతను రక్షించింది వరాహావతారమేగా మరి.
హిరణ్యాక్షుడు భూమాతను సముద్రంలోకి విసిరేయగా రక్షించేందుకు, విష్ణుమూర్తి వరాహావతారం ఎత్తాడు. అప్పటికీ పశ్చాత్తాపం లేకుండా హిరణ్యాక్షుడు హేళన చేయగా, విష్ణుమూర్తి ఆగ్రహావేశాలకు పోకుండా భూమాతను జాగ్రత్తగా తన మూతిపై నిలిపి పట్టుకున్నాడు. సురక్షితంగా సముద్రంలోంచి పైకి తీశాడు. అదీ వరాహస్వామి కథ. ఇక వైకుంఠం వదిలి వచ్చిన శ్రీనివాసునికి భూలోకంలో స్థలాన్ని ప్రసాదించింది కూడా వరాహస్వామివారే. ఈ కారణంగానే తిరుమల దివ్యక్షేత్రంలో వేంకటేశ్వరుని కంటే ముందుగా ఆది వరాహస్వామి దర్శనం అవుతుంది.


‘‘మహావరాహో గోవిందః సుషేణాః కనకాంగది’’ ఆదివరాహమూర్తే గోవిందుడు. తిరుమల ప్రధానంగా ఆయన క్షేత్రమే. శ్రీనివాసుడు వచ్చి అక్కడ ఉండటానికి అనుమతి కోరితే అందుకు వరాహస్వామి అంగీకరించాడు.అందుకు కృతజ్ఞతగా తన వద్దకు వచ్చే భక్తులకు తనకన్నా ముందే ఆయననే దర్శించుకుంటారనిశ్రీవారు వరాహమూర్తికి మాట ఇచ్చారు. అందుకే తిరుమల వెళ్లే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకుని ఆ తర్వాత వేంకటేశ్వరుణ్ని దర్శించుకుంటే యాత్రాఫలం దక్కుతుంది.
 ఈ ఆచారం ఈనాటిది కాదు. శతాబ్దాలుగా ఈ ఆచారమే కొనసాగుతోంది. భక్తులు వరాహస్వామిని దర్శించిన తర్వాతే శ్రీవారి దర్శనం చేసుకుంటారు. అందుకే తిరుమల పుణ్య తీర్థాన్ని ''ఆది వరాహ క్షేత్రం'' అని కూడా అంటారు. 

మరిన్ని తిరుమల సమాచారం కోసం ఈ క్రింది లైక్స్ పై క్లిక్ చేయండి :
Related Postings :







adivarahaswamy history in telugu, varahaswamy information in telugu, tirumala, tirumala varahaswamy temple, tirumala yatra information, tirumala angapradakshana, temple timings, accommodation details, hindu temples guide.
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

  1. అంత బాగే ఉంది అండి కాని మీరు ఇచ్చిన information కాపీ చేసుకోడానికి విలు లేదు. ప్రింట్ అవుట్ కూడ తీసుకో రావడం లేదు.

    ReplyDelete
  2. Sir. This information should be in other languages also. It will be too good.

    ReplyDelete

Post a Comment

FOLLOW US ON