శ్రీవరాహమూర్తి, వరాహావతారము, వరాహ స్వామి ఇవన్నీ శ్రీమహావిష్ణువు మూడవ అవతారమును వర్ణించే నామములు. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధుపరిరక్షణకొఱకు, దుష్టశిక్షణ కొఱకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. వానిలో అతిముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు. ఈ దశావతారాలలో మూడవ అవతారము వరాహావతారము. మహాలక్ష్మిని సంబోధించే "శ్రీ" పదాన్ని చేర్చి శ్రీవరాహమూర్తి అని ఈ అవతార మూర్తిని స్మరిస్తారు. వరాహావతారం హిరణాక్షుడిని చంపి, భూమిని ఉద్ధరించి, వేదములను కాపాడిన అవతారము. స్వామి ప్రార్థనలలో ఒకటి:
ఆది వరాహ మూర్తి, యజ్ఞవరాహ మూర్తి, మహా సూకరం అని నామాలు కూడా ఉన్నాయి. తిరుమల కొండలపై మొదట వెలసిన స్వామి వీరే, వీరి అనుమతితోనే వేంకటేశ్వరుడు అక్కడ నివాసము ఏర్పాటుచేసుకున్నారు. రాక్షసునితో భయంకరంగా యుద్ధం చేసి, చక్రాయుధంతో వానిని సంహరించి, భూమాతని జలము పై నిలిపిన స్వామి, వేదాలను రాక్షసుల బారినుండి రక్షించిన స్వామి.
ముందుగా వరాహస్వామిని ఎందుకు దర్శించుకోవాలి?
అశేష భక్తజనానికి ఆరాధ్యదైవం అయిన తిరుమల వేంకటాచలంలో ఆదిదైవం వరాహస్వామి. వరాహస్వామికి అంత ప్రాముఖ్యత ఎందుకంటే అసలు భూమాతను రక్షించింది వరాహావతారమేగా మరి.
‘‘మహావరాహో గోవిందః సుషేణాః కనకాంగది’’ ఆదివరాహమూర్తే గోవిందుడు. తిరుమల ప్రధానంగా ఆయన క్షేత్రమే. శ్రీనివాసుడు వచ్చి అక్కడ ఉండటానికి అనుమతి కోరితే అందుకు వరాహస్వామి అంగీకరించాడు.అందుకు కృతజ్ఞతగా తన వద్దకు వచ్చే భక్తులకు తనకన్నా ముందే ఆయననే దర్శించుకుంటారనిశ్రీవారు వరాహమూర్తికి మాట ఇచ్చారు. అందుకే తిరుమల వెళ్లే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకుని ఆ తర్వాత వేంకటేశ్వరుణ్ని దర్శించుకుంటే యాత్రాఫలం దక్కుతుంది.
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
అంత బాగే ఉంది అండి కాని మీరు ఇచ్చిన information కాపీ చేసుకోడానికి విలు లేదు. ప్రింట్ అవుట్ కూడ తీసుకో రావడం లేదు.
ReplyDeletelet u try Screen shot
DeleteSir. This information should be in other languages also. It will be too good.
ReplyDelete