ఆయుర్వేద గ్రంధాలలో చెప్పబడిన రహస్య ఆరోగ్య సూక్తులు..
కొన్ని ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో ఆరోగ్యపరమైన సలహాలు అంతర్లీనంగా ఉన్నాయి . వాటిన్నింటిని నేను నా పరిశోధనలో భాగంగా సేకరించాను . వీటిని మీకు ఇప్పుడు తెలియచేస్తాను.
రహస్య సూక్తులు -
> రాత్రి యొక్క ఆఖరి ఆయామం అనగా బ్రహ్మముహూర్తం నందు నిద్ర నుండి మేల్కొనవలెను.
> ఉదయం , సాయంసమయం నందు స్నానం ఆచరించవలెను.
> మలమూత్ర మార్గములను , పాదములను ఎల్లప్పుడు శుభ్రముగా ఉంచుకొనవలెను.
> నిత్యం శిరస్సు , ముక్కు, పాదముల యందు తైలము ను ఉపయోగించుకొనవలెను
> వెంట్రుకలు , గోళ్లు , గడ్డము నందు రోమములు 15 రోజులకు మూడుసార్లు హరించవలెను
> పితృదేవతలకు పిండప్రదానం చేయువాడిగా ఉండవలెను .
> భయము లేకుండా దైర్యవంతునిగా ఉండవలెను . భయము కలుగుటచే రోగములు ఉద్భవించును.
> గొడుగు, తలపాగా, కర్ర సహాయంగా ఉంచుకొనుము . కొండలు ,సంచారం లేని ప్రదేశం నందు ఒంటరిగా ఇవి లేకుండా సంచరించరాదు.
> శ్రమ చేయుటకు ముందు శరీరముకు విశ్రాంతి ఇవ్వుము.
> ఆలోచనలతో భోజనము చేయరాదు. సకాలం నందు భొజనం చేయవలెను .
> రాత్రి కాని పగలు కాని భోజనం చేయకుండా ఉండటం వలన ఆయుక్షీణం .
> అజీర్ణం చేయుట , తినినవెంటనే మరలా తినుట వలన గ్రహణి వ్యాధికి కారణం అగును.
> కాలంకాని కాలము నందు ఆహారాం తీసుకోవడం వలన జఠరాగ్ని చెడును .
> అన్ని రకాల రుచులు అనగా తీపి , చేదు , కారం , వగరు , పులుపు , ఉప్పు ప్రతిరోజు తీసుకొనుట అలవాటుగా చేసుకొనవలెను . ఎల్లప్పుడూ ఒకేరూచి తీసుకోవడం బలహీనతకి కారణం అగును.
> ఆహారం అతిగా తీసుకోవడం వలన ఆమము శరీరం నందు సంచరించును. అనేక రోగాలు శరీరం నందు ఉద్భవించును.
> విరుద్ద ఆహారపదార్థాలు స్వీకరించరాదు.
> పాలు , నెయ్యి తృప్తిగా తినుటవలన ముసలితనం తొందరగా దరిచేరనివ్వదు.
> మజ్జిగ భోజనం చేసినతరువాత ప్రతిరోజు తీసుకోవడం వలన అగ్నిని వృద్ధి చేయను , విరుద్ద ఆహారపదార్థాలు తీసుకోవడం వలన కలుగు విషములను , గ్రహణి , మొలలు మొదలగు రోగములను నివారించును . పెరుగు నందు నాలుగోవ వంతు నీరు చేర్చిన ఆ మజ్జిగను తక్రమగును .ఇది అత్యంత గుణకారి .
> ప్రతి ఉదయం నోటి యందు నువ్వులనూనె పొసుకొని తెల్లటి నురుగు వచ్చేవరకు పుక్కిలించి బయటకి విడువవలెను . దీనిని దంతధావనం చేయుటకు పూర్వం చేయవలెను . ఆయిల్ పుల్లింగ్ అని వ్యవహరిస్తారు. దీనివలన దంతములు కు బలం కలుగును.దంతవ్యాధులు రానివ్వదు . నములువానికి రుచి తెలియును .
> రాత్రి సమయం నందు పెరుగు నిషిద్ధం .
> అన్ని పాలకంటే ఆవుపాలు శ్రేష్టం .
> వృక్షసంభందమైన నూనెలలో అన్నింటికంటే నువ్వులనూనె శ్రేష్టమైనది .
> నెయ్యిలన్నింటిలో ఆవునెయ్యి శ్రేష్టమైనది.
> పప్పుధాన్యాలలో అన్నింటికంటే పెసలు శ్రేష్టమైనవి .
> ఆకుకూరలలో పాలకూర శ్రేష్టం .
> దుంపజాతుల్లో అల్లం శ్రేష్టం .
> ఫలములలో ద్రాక్ష శ్రేష్టం .
> ఉప్పులలో సైన్ధవ లవణం శ్రేష్టం .
> చెరుకు నుండి తయారగు పంచదార శ్రేష్టం
> మినుములు అతిగా వాడరాదు.
> వర్షాకాలం నందు నదుల యందు ఉండు వర్షపు నీరు ప్రకృతి హితం కాదు.
> చవిటి ఉప్పు మంచిది కాదు.
> గొర్రెపాలు , గొర్రెనెయ్యి వాడకం మంచిది కాదు.
> పండ్లలో నిమ్మపండు అతిగా వాడరాదు.
> దుంపల యందు బంగాళాదుంప అతిగా వాడరాదు.
> మలమూత్ర వేగములను ఆపరాదు .
> ఆహారం అరగనప్పుడు ఉప్పు నీటిలో వేసి తాగిన ఆహారమని ద్రవరూపంలో మార్చి అరిగించును.
> హృదయముకి మేలు చేయటంలో ఆమ్లరసం శ్రేష్టమైనది .
> స్నానం శ్రమని తొలగించడంలో శ్రేష్టమైనది .
>విరిగిన పెరుగు మలమూత్ర మార్గములను అడ్డగించును.
> గేదెపాలు నిద్రని కలిగించడంలో శ్రేష్టమైనవి .
> ఉసిరికపచ్చడి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తీసుకొవడం వలన వయస్సు నిలుపును .
> నెయ్యి వాతముని , పిత్తమును తగ్గించును
> నువ్వులనూనె వాతముని , శ్లేష్మముని తగ్గించును .
> తేనె శ్లేష్మమును , పిత్తమును తగ్గించును .
> కరక్కాయ ఎల్లకాలములలో వాడుకొనవచ్చు.
> ఇంగువ వాతమును , కఫమును తగ్గించును . ఆహారదోషములను కడుపు నుంచి మలరూపంలో బయటికి తోసివేయును జఠరాగ్ని వృద్ధిపరచును.
> ఉలవలు అమ్లపిత్త వ్యాధిని కలుగజేయును .
> మినుములు శ్లేష్మముని , పిత్తమును వృద్ధిచేయును .
> అరటిపండు పాలతో , మజ్జిగతో తినకూడదు హానికరం .
> నిమ్మకాయ పాలతో , పెరుగుతో , మినపప్పు తో కూడి తినకూడదు .
> పాలుత్రాగడానికి ముందు గాని , పాలుత్రాగిన అనంతరం గాని నిమ్మరసం వాడరాదు .
> స్మృతి మద్యం వలన హరించును . మద్యం తాగరాదు.
> ఆహారానికి ముందు వ్యాయమం చేయవలెను . వ్యాయామం వలన శరీరభాగములు స్థిరత్వం పొందును .
> బ్రహ్మచర్యం ఆయువుని వృద్ధిపొందించును .
> నెలసరి సమయంలో స్త్రీ సంగమం వలన రోగాలు సంప్రాప్తిన్చును . నపుంసకత్వం సంభవించును.
> మలమూత్ర సమయం నందు వేరే కార్యక్రమాలు చేయరాదు .
> పిల్లలు , ముసలివారు , మూర్ఖులు , నపుంసకులు వీరితో ఎల్లప్పుడు సఖ్యం చేయరాదు .
> సంధ్యాకాలం నందు భోజనం , అధ్యయనం , స్త్రీసంగమం , నిద్ర చేయరాదు .
> రాత్రి సంచరించకూడని ప్రదేశములు యందు సంచరించకూడదు.
> మిక్కిలి వేగముగా ప్రవహించు జలం నందు స్నానం చేయరాదు .
> స్నానం చేసిన వస్త్రముతో తలని తుడుచుకోకూడదు .
> బడలిక తీరకుండా, ముఖం కడుగుకొనకుండా , వస్త్రము లేకుండా స్నానం చేయరాదు .
> నొటికి ఆచ్చాదన లేకుండా , ఆవలింత, తుమ్ము , నవ్వు ప్రవరింప చేయకూడదు .
> భూమిని గీయకూడదు , గడ్డి తుంచకూడదు.
> మట్టిబెడ్డలు చేతితో నలపకూడదు .
> అవయవములతో విషమమగు చేష్టలు చేయరాదు .
> ముక్కుతో శబ్దం చేయకూడదు .
> పళ్ళు కొరకకూడదు .
పైన చెప్పబడిన ఆరోగ్యరహస్య సూక్తులు తప్పక పాటించవలెను . ప్రతి 40 రోజులకు శరీరం నందు అనేక మార్పులు జరుగుతుంటాయి . ఈ రోజు మీరు తీసుకున్న ఆహారం యెక్క రస ప్రభావం 40 రొజుల వరకు మీ శరీరం పైన ఉంటుంది. అందుకే దీక్షలు మండలం రోజులు ఉంటాయి . మండలం అనగా ఆయుర్వేద శాస్త్ర ప్రకారం 40 రోజులు . ఈ 40 రొజులు శుద్ధమైన ఆహారం , సాత్విక ఆహారం తీసుకొనడం వలన శరీరం శుద్ది అవుతుంది. అదేవిదంగా ప్రతి 28 రోజులకి మనిషి రక్తంలో మార్పు సంభంవించును . పాము కుబుసం విడిచినట్లే మనిషి కూడా చర్మ కణాలను విడుస్తాడు . వాటిని మృతకణాలు అంటారు. ఆంగ్లము నందు Dead Skin Cells అంటారు. ఇవి అత్యంత సూక్ష్మరూపంలో ఉంటాయి. వీటిగురించి ఆయుర్వేదం ఎప్పుడో వివరించింది. రక్తం నందు మర్పు సంభవించు సమయంలో ఆ రోజంతా మగతగా ఉంటుంది. వొళ్ళు విరవడం ఎక్కువుగా జరుగును. ఇలాంటివన్నీ ఆయుర్వేద గ్రంథాలలో నిగూఢముగా ఉన్నాయి.
Related Postings:
> TTD Telugu Sapthagiri Magazine June Month 2017 Free Download
> Virat Parvam Harikadha By Sri Chachidananda Sastry Garu
> Telugu Devotional Books Free Download
> 17 Special Lord Shiva Temple In India
> History of Ujjain Mahakaleswar Jyothirlinga Temple In Telugu
> Cheruvugattu Sri Jadala Ramalingeswaraswamy Temple In Telugu
> Toli Tirupati Sri Srugaravallabhaswamy Temple Information
Ayurvedam, Tealth Tips in Ayurvedam, Ayurvedam in Health Tips, Health Tips, Medical, Ayurvedam in Telugu, Pracheena Ayurvedam, Arogya Rahasyalu, Hindu temples guide.
Comments
Post a Comment