Drop Down Menus

List of Famous Temples in Chittoor District | Andhra Pradesh

తిరుమల  తిరుపతి :
 ఈ పట్టణాన్ని ఆనుకొని ఉన్న కొండలపై వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న వూరు తిరుమల. ఈ రెండింటినీ కలిపి "తిరుమల తిరుపతి" అని వ్యవహరిస్తూ ఉంటారు. తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ప్రతిదినం లక్ష నుండి రెండు లక్షల వరకు భక్తులు సందర్శిస్తుంటారు. ప్రత్యేక దినాలలో 5 లక్షలమంది వరకూ దర్శనం చేసుకొంటారు. ఈ యాత్రాస్థలం శ్రీవైష్ణవ సంప్రదాయంలోని 108 దివ్యదేశాలలో ఒకటి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని పట్టణం తిరుపతి.

రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే బస్సుల కోసం తిరుపతిలో నాలుగు బస్టాండ్‌లు ఉన్నాయి. తిరుమలకు దగ్గరి లోని రైల్వే స్టేషను తిరుపతి. తిరుపతి స్టేషనుకు దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాల నుండి రైళ్ళు నడుస్తాయి. తిరుపతికి సమీపాన ఉన్న రేణిగుంట, తిరుమలకు అతి దగ్గరి విమానాశ్రయం. ఇక్కడికి ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాదు నుండి నేరుగా విమాన సేవలు ఉన్నాయి.

కాణిపాకం :
కాణిపాకంలో అనేక ప్రాచీన ఆలయాలున్నాయి. ఇక్కడ జనమేజయుడు కట్టించాడని అనుకునే ఒక పాత దేవాలయము ఉంది. మణికంఠేశ్వర స్వామి ఆలయాన్ని చోళ రాజైన రాజరాజేంద్ర చోళుడు కట్టించాడు. ఈ ఆలయంలోని అద్భుతమైన శిల్పసంపద చోళ విశ్వకర్మ శిల్పిశైలికి తార్కాణంగా పేర్కొనబడుతుంది. కాణి అంటే పావు ఎకరా మడిభూమి లేదా మాగాణి అని, పారకం అంటే నీళ్లు పొలంలోకి పారటం అని అర్ధం. ఈ రోజుకి ఇక్కడ స్వామివారి విగ్రహం నూతిలోనే వుంటుంది. అక్కడ ప్రాంగణములోనే ఒక్క బావి కూడా వున్నది దానిలో స్వామి వారి వాహనము ఎలుక ఉంది. అక్కడ స్వామివారికి, మనకి ఇష్టమైన పదార్థం ఏదైనా వదిలి వెస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని ప్రసిద్ధి.

 తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిపై, చిత్తూరు నుండి 12 కి.మీ. దూరంలో ఉంది. తిరుపతి నుండి ప్రతి 15 నిమిషములకు ఒక బస్సు ఉంది. చిత్తూరు నుండి ప్రతి 10 నిముషాలకు ఒక బస్సు ఉంది. ఆంధ్రప్రదేశ్ ఏమూల నుండి అయిననూ చిత్తూరుకు లేదా రేణిగుంట లేదా గూడూరు లకు రైళ్ళు ఉన్నాయి. తిరుపతి (రేణిగుంట) విమానాశ్రయానికి విమానాలు ఉన్నాయి.

శ్రీకాళహస్తి :
ఇది దక్షిణ భారతదేశంలోనే ప్రాచీనమైన, పంచభూతలింగము లలో నాల్గవ దైన వాయు లింగము గల గొప్ప శైవ పుణ్యక్షేత్రము. ఇక్కడ రెండు దీపాలలో ఒకటి ఎప్పుడూ గాలికి కదులుతూ ఉంటుంది, మరొకటి ఎల్లప్పుడు నిశ్చలముగా ఉంటుంది. ఇక్కడ ఉండే కళ్ళు చెదిరే మూడు గోపురాలు ప్రాచీన భారతీయ వాస్తు కళకు నిదర్శనాలుగా, విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల యొక్క పనితనానికి కాణాచిగా నిలుస్తాయి. వీటిలో ఎత్తైన గాలి గోపురం శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించబడింది. బాగా పెద్దదిగా కనిపించే వెయ్యి కాళ్ళ మంటపం కూడా ప్రధాన ఆకర్షణే. కళంకారీ కళకు కాళహస్తి పుట్టినిల్లు. శ్రీకాళహస్తి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాలో ఒక పట్టణము.

శ్రీకాళహస్తి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రమైన తిరుపతికి ముఫ్ఫై ఎనిమిది కి.మీ.ల దూరంలో నెల్లూరుకు సుమారు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి నుంచి ఇక్కడికి ప్రతి ఐదు నిమిషాలకు బస్సు సౌకర్యం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లోని దాదాపు అన్ని ముఖ్య పట్టణాల నుండి ప్రతిరోజు బస్సు సదుపాయం ఉంది.  గూడూరు-తిరుపతి దక్షిణ రైలు మార్గంలో శ్రీకాళహస్తి రైల్వే స్టేషను ఉంది. గూడూరు చెప్పుకోదగ్గ జంక్షన్ కాబట్టి చాలా రైళ్ళు ఇక్కడ ఆగుతాయి.

నారాయణవనం :
శ్రీ వేంకటేశ్వర స్వామికి పద్మావతికి ఇక్కడే వివాహం జరిగిందని అంటుంటారు. దానికి ఋజువుగా ఇక్కడ అమ్మవారి నలుగు పిండికి అవసరమైన తిరగలి కనిపిస్తోంది. ప్రతిఏడూ అమ్మవారికి 18 రోజులపాటు జాతర జరుగుతింది. అది ఆగస్టు 22 - 26 తేదీల మద్యలో ప్రారంబమై సెప్టెంబరు 11 -12 తేదీలలో ముగుస్తుంది. ఈ అమ్మవారికి పూజలు చేస్తే పెళ్ళికానివారికి పెళ్ళి అవుతుందని, పిల్లలు కలగని వారికి పిల్లలు కలుగుతారని భక్తుల నమ్మిక. శ్రీ పద్మావతి అమ్మవారి తండ్రి అయిన ఆకాశ రాజుకు ఈ అమ్మవారి కటాక్షంతోనే పద్మావతి జన్మించిందని భక్తులు నమ్ముతారు. నారాయణవనం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన జనగణన పట్టణం. ఇది పుత్తూరుకి 5 కి.మి., తిరుపతికి 40 కి.మి. దూరంలో ఉంది.  ఇక్కడ జలపాతాలు సంవత్సరంలో 365 రోజులు ప్రవహిస్తూ ఉంటాయి.

నాగలాపురం :
ఈ ఊళ్ళో గల శ్రీ వేదనారాయణస్వామి దేవాలయం చాలా ప్రసిద్దమైనది.శ్రీమహావిష్ణువు మహర్షుల కోరికపై సొమకాసురుడిని వధించడానికి మత్స్యావతార మెత్తుతాడు. సోమకాసురుని సంహరించి వేదాలను బ్రహ్మకు తిరిగి ఇస్తాడు. ఇక్కడి విగ్రహాన్ని స్వయంభువుగా చెబుతారు. గర్భగుడిలో ఉన్న ఈ మత్స్యావతారమూర్తికి ఇరు ప్రక్కల శ్రీదేవి, భూదేవి ఉన్నారు. స్వామివారి చేతిలో సుదర్శన చక్రం ప్రయోగానికి సిద్దంగా ఉన్నట్లు ఉంటుంది. స్వామివారి నడుముకు దశావతార వడ్డాణం ఉంటుంది. ఈ ఆలయ విశిష్టత ఏమంటే........ ప్రతియేడు మార్చి నెల 25, 26, 27/26,27,28 వ తేదీలలో సాయంకాలం మూల విరాట్టుకు 630 అడుగుల దూరంలో ఉన్న రాజగోపురం నుండి సూర్య కిరణాలు నేరుగా వచ్చి, మొదటి రోజున స్వామి వారి పాదభాగాన, రెండో రోజున స్వామివారి నాభి భాగాన, మూడో రోజున స్వామివారి ముఖ భాగాన ప్రసరిస్తాయి.

చిత్తూరు జిల్లాకు చెందిన నాగలాపురం గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది .

కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం :
తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనలోని ఆలయాల్లో శ్రీనివాస మంగాపురం ఆలయం ఒకటి. పద్మావతీ శ్రీనివాసుల పెళ్ళి అనంతరం కొత్త పెళ్ళికూతురైన పద్మావతిని తీసుకుని వరాహక్షేత్రానికి దక్షిణంగా స్వర్ణముఖీ నది ఒడ్డునున్న అగస్త్యాశ్రమానికి విచ్చేస్తాదు శ్రీనివాసుడు. స్వర్ణముఖి, కల్యాణి, భీమనదుల త్రివేణీ సంగమంగా ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది.

తిరుపతికి పది కిలోమీటర్ల దూరంలో తిరుపతి నుండి మదనపల్లికి వెళ్ళేదారిలో ఉంది. యాత్రికులు తప్పక దర్శించవలసిన క్షేత్రం ఇది. తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాల సందర్శనార్ధం బస్సులను ఏర్పాటు చేశారు. ఈ బస్సులు శ్రీనివాస మంగాపురం ఆలయానికి కూడా వెళ్తాయి.

అలమేలు మంగాపురం :

దీనిని అలమేలు మంగా పురమని కూడా అంటారు. ఇక్కడ వెంకటేశ్వరుని దేవేరి లక్ష్మీ దేవి అవతారమైన అలమేలు మంగ ఆలయం ప్రసిద్ధి చెందింది. త్రిమూర్తులను పరీక్షించే యత్నంలో కోపిష్టియైన భృగు మహర్షి విష్ణువు వక్ష స్థలాన్ని కాలితో తన్నాడు. తన నివాస స్థానాన్ని అవమానించినందుకు అలిగి లక్ష్మీదేవి కొల్హాపూర్ వెళ్ళింది. సిరి లేని శ్రీనివాసుడు తిరుమల కొండల్లో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. ప్రసన్నురాలైన శ్రీదేవి తిరుచానూరులోని పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి నాడు శుక్రవారం, ఉత్తరాషాఢ నక్షత్రంలో బంగారు పద్మంలో అవతరించింది. ఆ పద్మావతినే శ్రీనివాసుడు లక్ష్మి అనుజ్ఞతతో పెండ్లియాడాడు.

తిరుచానూరు లేదా అలమేలు మంగాపురం అనే ఊరు చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణం సమీపంలో ఉంది.  పబ్లిక్ బస్సు సర్వీసు, ప్రైవేట్ బస్సు సర్వీసు , రైల్వే స్టేషన్, ట్రాక్టరు సౌకర్యం, టాక్సీ సౌకర్యం , ఉన్నాయి.

అరగొండ - అర్ధగిరి :
ఆంజనేయుడు సంజీవని పర్వతాన్ని తీస్కుని వెళ్తున్న సమయం కాణిపాకం దగ్గర్లో పర్వతం నుంచి కొంతభాగం క్రింద పడినదని స్థలపురాణం. ఆ ప్రదేశాన్ని అర్ధగిరి అని పిలుస్తారు. అరకొండ అని పలకడం బదులు తమిళనాడు సరిహద్దుల్లో ఉండటం వల కొండ బదులు గొండ అయి మొత్తానికి అరగొండ గా మార్చారు. ఇక్కడ తీర్ధం సేవించడం  వల్ల  రోగాలు నయమౌతాయని చెబుతారు.

శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం, అప్పలాయగుంట :
అప్పలాయగుంట శ్రీ వేంకటేశ్వరాలయం అత్యంత ప్రాముఖ్యత వహించిన తిరుమల శ్రీ వేంకటేశ్వరాలయానికి చుట్టు ఉన్న ఏడు పురాతన శ్రీ వేంకటేశ్వరాలయాలలో ఒకటి. యిది అప్పలాయగుంట లో వెలసినది. శ్రీ వేంకటేశ్వరుడు నారాయణ వనం లో ఆకాశరాజు కుమార్తె పద్మావతిని వివాహమాడి తిరుమలకు కాలినడకన బయలుదేరి వెళ్తూ అప్పలాయగుంట లో తపస్సు చేసుకుంటున్న సిద్ధేశ్వర స్వామిని అభయ హస్తంతో ఆశీర్వదించి, ఈ ఆలయంలో కొలువు దీరాడు. తర్వాత ఇక్కడి నుండి కాలినడకన తొండవాడ లోని అగస్తేశ్వరు ని దర్శించి తర్వాత సమీపంలోనే ఉన్న శ్రీనివాస మంగా పురం లో ఆరునెలలు ఉండి అక్కడి నుండి శ్రీవారి మెట్టు ద్వారా (నూరు మెట్ల దారి) తిరుమల చేరాడని స్థల పురాణం.

అప్పలాయ గుంట తిరుపతికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. తిరుపతి నుండి ప్రతి గంటకు బస్సులు ఉంటాయి. తిరుపతి నుండి పరిసరప్రాంతాలలోని ఆలయ సందర్శన బస్సులు కూడ ఇక్కడి వస్తుంటాయి. తిరుపతికి వచ్చిన వారు తప్పక చూడవలసిన ఆలయమిది.

శ్రీ మొగిలీశ్వరస్వామివారి ఆలయం :
చిత్తూరు జిల్లాలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి తరువాత పేర్కొనదగిన ప్రసిద్ధ శైవక్షేత్రం మొగిలి. ఇక్కడ వెలిసివున్న దేవుడు మొగిలీశ్వరుడు. దేవత కామాక్షి. ఈ దేవాలయం రెండు శతాబ్దాల ప్రాచీనతను సంతరించుకుని ఉంది. ఈ దేవాలయానికి బంగారుపాళ్యం జమీందారులు వంశపారంపర్యంగా ధర్మకర్తలుగా ఉంటున్నారు. ఈ దేవాలయంలోని శివలింగం భూగర్భము నుండి ఆవిర్భవించింది. కామాక్షీదేవి విగ్రహము మాత్రము ప్రతిష్ఠించింది. మొగిలి, చిత్తూరు జిల్లా, బంగారుపాలెం మండలానికి చెందిన గ్రామం.

గుడిమల్లం :
ఈ మధ్యకాలంలో ఈ ఆలయంలోని స్వామి వారి ఫోటోలు నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. విగ్రహం చూడగానే ఆలయం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది. ఇచట ఆంధ్ర శాతవాహనుల కాలం నాటి పురాతన శివాలయం ఉంది. ఇది క్రీ .పూ 2 లేదా 3 శతాబ్దములో నిర్మించినట్లు ఇక్కడ బయలుపడిన శాసనాలద్వారా చరిత్రకారులు నిర్ణయించారు. గుడిమల్లం శివాలయం లోని శివుడు పరశురామేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడి శివలింగానికి ఎంతో విశిష్టత ఉంది.ఈ ఆలయములో గర్భాలయము అంతరాలయము, ముఖ మండపముల కన్నా లోతులో ఉంటుంది . ఇక్కడ గర్భ గృహములో ప్రతిష్ఠించబడిన శివలింగము లింగ రూపములో కాకుండా శివుడు మానవ రూపములో మహావీరుడైన వేటగాని వలె ఉన్నాడు. ఈ లింగము ముదురు కాఫీరంగులో ఉన్న రాతితో చేయబడిన మానుష లింగము. ఈ ఆలయం వున్న గ్రామం చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం లో వుంది.

కోదండ రామాలయం, తిరుపతి :
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతిలోని కోదండ రామాలయం ప్రాచీనమైన మరియు ప్రఖ్యాతమైన హిందూ దేవాలయం. ఇక్కడ మూలమూర్తులు కోదండరాముడు, సీతాదేవి, లక్ష్మణస్వామి. ఈ ఆలయం ఎదురుగా భక్తాంజనేయస్వామి వెలసియున్నారు. భవిష్యోత్తర పురాణంలో శ్రీరాముడు సీతాన్వేషణ సఫలమగుటకు శ్రీవారి పుష్కరిణిలో స్నానమాచరించినట్లు చెప్పబడింది. ఆ కాలంలో ప్రస్తుతము ఆలయమున్న ప్రదేశంలో ఒక గుహ వెలసి ఉండేదని ప్రతీతి. అందుండి దివ్యమైన తేజస్సు వెలువడుతుండేది.

తిరుపతి రైల్వే స్టేషన్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో మరియు తిరుమల తిరుపతి బాలాజీ ఆలయం నుండి 24 కిలోమీటర్ల దూరంలో, కోదండరామ స్వామి ఆలయం తిరుపతి పట్టణం నడిబొడ్డున ఉంది.

తలకోన :
ఇది ప్రముఖ పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. చుట్టూ ఎత్తైన కొండలతో, దట్టమైన అరణ్యప్రాంతం మధ్యలో వెలసిన ఈ జలపాతం నిత్యం పర్యాటకుల రద్దీతో కళకళలాడుతుంటుంది. చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతికి దాదాపు 45 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ జలపాత ప్రదేశం అత్యంత రమణీయ ప్రకృతి ప్రదేశాల్లో ఒకటిగా చెప్పవచ్చు. తలకోన శేషాచల కొండల వరుసలో తల భాగంలో వున్నందున దీన్ని తలకోన అంటారు. ఇక్కడున్న జలపాతం ఎత్తు సుమారు మూడు వందల అడుగులు. ఈ జలపాత దృశ్యం నయనానంద కరంగా వుంటుంది. ఇక్కడ చేరగానే మొదట మనం కనుగొనేది సిద్దేశ్వరాలయము మరియు అమ్మవారు, విఘ్నేశ్వరుడు, సుబ్రమణ్యస్వామి ఆలయాలు.

తలకోనకు తిరుపతి, పీలేరు నుండి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. పీలేరు నుంచి 50 కిలోమీటర్లు, తిరుపతి నుంచి 49 కిలోమీటర్ల దూరంలో ఉంది.తిరుపతి బస్ స్టాండ్ నుండి ప్రతి రోజు ఉదయం 7 గంటలకు నేరుగా తలకోనకు బస్సు సౌకర్యం ఉంది, మళ్ళి తలకోన నుండి తిరుపతికి సాయింత్రం 4 గంటలకు ఇదే బస్సు ఉంది.

బోయకొండ గంగమ్మ :
 కొన్నేళ్ల క్రితం వరకు అతి సాధారణ గ్రామ దేవత ఆలయంగా వున్న ఈ ఆలయం కొన్ని సంవత్సరాల నుండి చాల ప్రాముఖ్యత వహిస్తున్నది. చిత్తూరు జిల్లాలో ఈ తరహా గ్రామ దేవతల ఆలయాలన్నింటి కన్న ఈ ఆలయం అతి ప్రసిద్ధి పొందినది. ఈ అలయం ఒక చిన్న కొండపై వెలసి ఉంది. ఇది కర్ణాటకకు తమిళ నాడు రాష్ట్రాలకు కూడా దగ్గరగా వున్నందున ఆ యా రాష్ట్రాల భక్తులు కూడా వస్తుంటారు. ఇక్కడ జరుగుతున్న బలులు, వంట కార్యక్రమాలు హైదరాబాద్ లోని బంజార హిల్సు లోని పెద్దమ్మ గుడి వద్ద జరిగే కార్యక్రమాలను తలపిస్తుంది.

బోయ కొండ గంగమ్మ దేవాలయం చిత్తూరు జిల్లాలో పుంగనూరు దగ్గర ఉంది. ఇది గ్రామ దేవత ఆలయం. ఈ ఆలయానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమీప విమానాశ్రయం తిరుపతి. ఈ ఆలయానికి తరచుగా రోడ్డు రవాణా అందుబాటులో ఉంది. గంగమ్మ ఆలయానికి చేరుకోవడానికి పకాలా రైల్వే జంక్షన్ సమీప రైల్వే స్టేషన్ మరియు ఈ ప్రదేశం నుండి 21 కిలోమీటర్ల దూరంలో ఉంది.

కైలాసకోన గుహాలయం :
చిత్తూరు జిల్లా నారాయణపురానికి సమీపంలో కైలాసకోనలో ఉన్న గుహాలయం దర్శించుకోదగ్గ ఆలయం. ఇది కైలాస కోన కొండపై ఉంది. నారాయణపురంలో పద్మావతీ వేంకటేశ్వరుల కల్యాణ మహోత్సవాన్ని చూసేందుకు కైలాసం నుండి విచ్చేసిన శివపార్వతులు ఇక్కడి ప్రకృతి రమణీయతకు పరవశించి కొంతకాలం ఈ పర్వతం మీదే గడిపారట. పార్వతీపరమేశ్వరులు నివసించడం వల్ల ఈ కొండకు కైలాస కోన అనే పేరు వచ్చిందనే కథనం బహుళ ప్రచారంలో ఉంది. చిత్తూరు జిల్లా నారాయణపురానికి సమీపంలో కైలాసకోనలో ఉన్న గుహాలయం దర్శించుకోదగ్గ ఆలయం.

కైలాసకోన జలపాతం లేదా కోన్ జలపాతం ఉత్తూకోట్టై - పుత్తూరు - తిరుపతి రహదారిపై ఉంది. ప్రధాన జలపాతం కారు ద్వారా సులభంగా చేరుకోవచ్చు. కార్ పార్కింగ్ వద్ద 10 కి పైగా కార్లు పార్క్ చేయడానికి తగినంత స్థలం ఉంది. కార్ పార్కింగ్ నుండి, ప్రధాన జలపాతం 3 నుండి 5 నిమిషాల నడక ద్వారా, చక్కగా వేయబడిన దశల ద్వారా చేరుకోవచ్చు. ఈ మార్గం రాత్రి సమయంలో ప్రకాశిస్తుంది.

                

famous temples in chittoor district, chittoor famous for, famous temples in andhra pradesh, waterfalls near chittoor, places to visit near kanipakam, temples near tada, temples in tirupati, famous temples near madanapalle
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.