తిరుచెందూర్ తమిళనాడు రాష్ట్రం లో సముద్రపు ఒడ్డున గల సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం. ఆరుపడైవీడు క్షేత్రాలలో ఈ క్షేత్రం మాత్రమే సముద్రపు ఒడ్డున కలదు. తిరుచెందూర్ సుబ్రహ్మణ్య క్షేత్రం చాల శక్తివంతమైన క్షేత్రం. ఈ క్షేత్రం గురించి స్కాందపురాణం లో చెప్పబడింది. తిరుచెందూర్ క్షేత్రం లో ఆదిశంకరులు ధాన్యం లో ఉండగా సుబ్రహ్మణ్య స్వామి కనిపించగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చేశారు. ఈ భుజంగ స్తోత్రము ద్వారా, మనల్ని, మన వంశాలనీ పట్టి పీడించేసే కొన్ని దోషాలు ఉంటాయి, అటువంటి వాటిలో నాగ దోషం లేదా కాల సర్ప దోషం ఒకటి . దీనికి కారణం మనం తప్పుచేయకపోవచ్చు, ఎక్కడో వంశంలో తప్పు జరుగుతుంది, దాని ఫలితము అనేక విధాలుగా అనుభవిస్తూ ఉండవచ్చు. అటువంటి దోషములను కూడా పోగొట్టే సుబ్రహ్మణ్య శక్తి ఎంత గొప్పదో, శంకరులు ఈ సుబ్రహ్మణ్య భుజంగము ద్వారా తెలియజేశారు. ఎంతో అద్భుతమైన స్తోత్రం ఇది.
తిరుచెందూర్ వెళ్ళడానికి చెన్నై ఎగ్మోర్ స్టేషన్ నుంచి ప్రతిరోజూ సాయంత్రం 4 గంటలకు ట్రైన్ ఉంటుంది . మరుసటి రోజు ఉదయం 8 గంటలకు ట్రైన్ వెళ్తుంది. స్లీపర్ టికెట్ ధర 395/-. తిరుచెందూర్ నుంచి కన్యాకుమారి 90 కిమీ దూరం . మదురై నుంచి తిరుచెందూర్ 180 కిమీ , రామేశ్వరం నుంచి తిరుచెందూర్ 223 కిమీ దూరం.
పూజలు : ఉదయం 5 గంటలకు సుప్రభాతం తో ప్రారంభమై రాత్రి 9 గంటల వరకు ఆలయం తెరిచివుంటుంది .
5.10 : Subrapadam - Thirupalli Eluchi
5.30 : Viswaroopam Darshan
5.45 : Dwajasthamba Namaskaram
6.15 : Udaya Marthanda Abishegam
7.00 : Udaya Marthanda Deeparadhanai
8.00 to 8.30 : Kalasandhi Pooja
10.00 : Kalasha Pooja
10.30 : Uchikala Abishegam
12.00 : Uchikala Deeparadhanai
5.00 : Sayaratchai Pooja
7.15 : Arthasama Abishegam
8.15 : Arthasama Pooja
8.30 : Ekanda Seva
8.45 : Ragasia Deeparadhanai, Palliarai Pooja
9.00 : Nadai Thirukappiduthal
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment