ప్రతి సమస్యకు భగవద్గీత చెప్పిన పరిష్కారాలు ప్రశ్నల రూపం లో | Bhagavad Gita Give Solutions for every Problem 21st Question
21st Question :
ప్రశ్న ) నా మనస్సే నాకొక సమస్య అయి కూర్చుంది. కొంచం బాధ కలిగిందంటే తల్లకిందులైపోతాను. కొంచంకూడా తట్టుకోలేను. ఆ సుఖం నాకు లేదే! ఈ సుఖం నాకు లేదే! అని ఒక్కటే ఆరాటం. కోరి కోరి శ్రమతో వస్తువులను సంపాదించాను. అవి పోతాయోమోనని భయం. ఎవరైనా అవి కావాలంటే వారి పై క్రోధం. కొంచం మంచి కలిగితే దాన్ని గొప్పగా చెప్పుకుంటాను. కొంచం చెడు కలిగితే లోకాన్ని దేషిస్తాను నేనెలా ఉండాలి ?
దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః |
వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే ‖(2వ అ - 56వ శ్లో)
యః సర్వత్రానభిస్నేహస్తత్తత్ప్రాప్య శుభాశుభమ్ |
నాభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ‖(2వ అ - 57వ శ్లో)
జవాబు : మన మనస్సు మనం చెప్పిటనట్లు వింటే ఇక లోకంలో జయించలేనిదేది ఉండదు. అది అభ్యాసము తో రావాలి కాని ఒక పట్టున సమకూరేది కాదు. మి మనస్సు మి చెప్పుచేతల్లో లేదు కాబట్టి మీరు సుఖం కలిగిన దుఃఖం కలిగిన తల్లడిలిపోతున్నారు. ఆరాటం, భయం మిలొ తిష్టవేశాయి. ఎన్ని దుఃఖాలు కలిగినా మనస్సు సంక్షోభాన్ని పొందాకూడదు. సుఖాలు కలిగినప్పుడు కొంచం ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి. భయాన్ని రాగద్వేషాలను దగ్గరకు కూడా రానీయకూడదు. ఏ విషయంలోను విపరీతమైన రాగం ఉండకూడదు. అలా ఉండడానికి అభ్యాసం చేస్తే మంచి జరిగిన, చెడు జరిగిన వాటి ప్రభావాలు మీమీద పడవు. వాటిని మీరు పొగడడం లేదా ద్వేషించడం జరగదు. మీరు స్థితప్రజ్ఞులౌతారు.
తదుపరి భగవద్గీత యొక్క ప్రశ్నలు జవాబులు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
లలిత సహస్రం పిడిఎఫ్ పుస్తకం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
భగవద్గీత శ్లోకాలు వాటి భావాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment