అంత్యక్రియలు అప్పుడు కుండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి పగలగొడతారు ఎందుకో తెలుసా? Definition of antyakriyalu
జీవితంలో మనిషికి ముఖ్యమైనవి రెండే రెండు రోజులు. ఒకటి తను ప్రపంచంలోకి అడుగుపెట్టిన రోజు. ఇంకొకటి తను ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయిన రోజు. అంటే జననం ఇంకా మరణం. పుట్టిన తర్వాత బారసాల అన్నప్రాసన, చనిపోయిన తర్వాత అంత్యక్రియలు మనిషి ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి.
సాధారణంగా మనిషి ఆయుష్షు 120 సంవత్సరాలు. కాలక్రమేణా వంద సంవత్సరాల కి వచ్చింది. ఇంక ఇప్పుడు జనరేషన్ లో మనుషులు వాడే మందులు కారణంగా 60 70 ఏళ్ల కి వచ్చేసింది. ఇది సాధారణంగా ఒక మనిషి బతికే కాలం. కానీ నిజం చెప్పాలంటే చావు ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో తెలీదు.మనిషి కంటే అతను సంపాదించిన దానికే ఎక్కువ విలువనిచ్చే ఈ కాలంలో, అలా ఆ మనిషి ఆరోగ్యాన్ని కూడా పక్కనపెట్టి కష్టపడుతూ ఉంటుండడంతో ఆరోగ్య సమస్యలు, ఒత్తిడి వల్ల మరణించే సమయం ఇంకా ముందే వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
మీరు సినిమాల్లో ఒక మనిషి చనిపోయిన తరువాత తన శరీరం లో నుండి అదే మనిషి రూపం బయటికి వచ్చి పడిపోయిన తన శరీరాన్ని లేపడం, తన బంధువులతో స్నేహితులతో తను చనిపోలేదు బతికే ఉన్నాను అని చెప్పడం చూసే ఉంటారు. దాన్ని ఆత్మ అంటారు. ఆశ్చర్యం ఏమిటంటే నిజజీవితంలో కూడా ఇలానే జరుగుతుంది.మనిషి చనిపోయిన తర్వాత తన అంతక్రియలు అయ్యేవరకు తన ఆత్మ మనిషి లోపలి కి వెళ్లి మళ్ళీ లేవడానికి ప్రయత్నిస్తుంది. శరీరం ఆత్మ రెండు వేరు వేరు. ఆత్మ చెప్పినట్టు శరీరం వినాలి అంటే ఆ మనిషి ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే బతికే ఉండాలి. చనిపోయిన తర్వాత ఆత్మ చెప్తే శరీరం వినే పరిస్థితిలో ఉండదు. అందుకే ఆత్మ తన వాళ్లతో కలిసి ఉండడానికి శరీరాన్ని లేపి అందులోకి దూరడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.
చనిపోయిన తర్వాత శరీరం మీద ఒక మూటలో కట్టిన బియ్యపు గింజలను తీసి పరుస్తారు. ఆ గింజల అన్ని ఆత్మ సూర్యోదయం అయ్యే లోపు లెక్కించాలి. అప్పుడే ఆత్మకు తన వాళ్ళని చూసే అవకాశం వస్తుంది. ఒకవేళ సూర్యోదయం లోపు లెక్కించలేకపోతే మళ్ళీ మొదటి నుండి లెక్కించాల్సి వస్తుంది.మనిషి చితి చుట్టూ పట్టుకొని తిరిగే కుండ ఆ మనిషిని సూచిస్తుంది. అందులో ఉన్న నీళ్లు మనిషి ఆత్మ. చనిపోయిన తర్వాత ఎలాగైతే ఆత్మ మన లో నుండి బయటికి వెళ్లి పోతుందో అలాగే నీరు కూడా మెల్ల మెల్లగా బయటికి వెళ్లి పోవడానికి రంధ్రాలను పెడతారు.
ఆత్మ చెప్పినట్టు శరీరం వినాలంటే... శరీరం ఆరోగ్యంగా ఉండాలి. శరీరంలో ప్రాణం ఉన్నంత సేపు అందులో ఆత్మ ఉంటుంది. శరీరం చనిపోయిందంటే ఆత్మ అందులో ఉండలేదు. ఎందుకంటే ఆత్మ చెప్పినట్టు శరీరం వినే స్థితిలో లేదు.
(డెలివరీ అయి బిడ్డ బతికి చనిపోయిన ఆడవాళ్ళకి ఆవాలను కడతారు) విప్పి కింద పోస్తారు. ఎందుకంటే.. శరీరాన్ని కాల్చిన తర్వాత కూడా ఇంటి మీద.. తన వాళ్ళ మీద.. ఇష్టంతో ఆత్మ ఇంటికి రావాలంటే శరీరం మీద చల్లిన ప్యాలాలను, ఈ బియ్యాన్ని, పూర్తిగా ఒక్కో గింజను లెక్కించిన తర్వాతనే... ఆత్మకి తన వాళ్లను చూడడానికి అనుమతి దొరుకుతుంది. అది కూడా సూర్యోదయం లోపు మాత్రమే.. అంతలోపు లెక్కించకపోతే, మళ్ళీ... తిరిగి మొదటి నుండి లెక్కించాలి.
ఇలా ఎందుకు చేస్తున్నారు, అంటే...
ఏమో నాకు తెలియదు మా తాత ఇలాగే చేసాడు నేను ఇలాగే చేస్తున్నాను
కానీ.. ఎందుకు చేస్తున్నానో తెలియదు.
> తిరిగి అతుక్కునే శివలింగం ఎక్కడ ఉందో తెలుసా?
> విచిత్ర వినాయక దేవాలయము ఓ అద్భుతమైన దేవాలయం ఉంది
> ఇంటి ఇల్లాలు చేయకూడని కొన్ని పనులు
> రాబోయే రోజుల్లో బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించిన ఈ నిజాలు మీకు తెలుసా ?
> ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలో మీకు తెలుసా ?
> ఈ విచిత్ర దేవాలయాల గురించి మీకు తెలుసా?
> తెలుగు సంవత్సరాలు 60 మాత్రమే ఎందుకు ఉంటాయో తెలుసా
అంత్యక్రియలు, Definition of antyakriyalu, funeral meaning in telugu, Hindu samradayam, Funeral Meaning In Telugu, Funeral Rites Meaning in Telugu, funeral ceremony meaning in telugu
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment