Drop Down Menus

శ్రీ వెంకటేశ్వరునికి గోవింద అనే నామం ఎందుకొచ్చిందో తెలుసా..? Do you know why Sri Venkateswara got the name Govinda?

శ్రీ వెంకటేశ్వరునికి గోవింద అనే నామం ఎందుకొచ్చిందో తెలుసా..?

నామ విశిష్టత ఏంటో తెలుసా..?

గోవింద అనగానే ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా అనే మాట ప్రతీ తెలుగువాడికి వెంటనే మదిలో మెదులుతుంది. ఆ శ్రీవారి సన్నిధి కోసం ఎదురుచూసే సమయంలో భక్తుల గోవిందనామస్మరణతోనే ఆలయం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అసలు గోవిందా అనే పేరు ఎలా వచ్చింది? ఎందుకు అలా అంటారో తెలుసుకోవాలంటే, గోకులంనాటి కథ తెలుసుకోవాలి.

ఇంద్రుడు దేవతల అధిపతి,

ఇంద్రుడు దేవతల అధిపతి, పరమ గర్విష్టి. ఇంద్రయాగం అని చేస్తుండేవారు గోకులంలో పెద్దలు. వానలు ఇచ్చేవాడు ఇంద్రుడని వారి విశ్వాసం. ఒకరోజు గోకులంలో పెద్దలంతా ఇంద్రయాగం చేయ తలపెట్టారు.

గోకులంలోని ప్రజలంతా

గోకులంలోని ప్రజలంతా ఇంద్రుని పూజించుకునేందుకు సిద్ధపడుతుంటే అలాంటి అవసరం ఏదీ లేదంటూ కృష్ణుడు వారిస్తాడు. ప్రతి యేడూ వర్షఋతువుకోసం గోకులంలో గోపాలురు ఇంద్రుడికి యజ్ఞయాగాదులు చేసుకుంటూ పిండివంటలు చేసి ఇంద్రుడికి అర్పించే పద్ధతి ఉండేది.

అయితే కృష్ణుడి ఇదేంటో తెలుసుకోవాలని కూతుహలపడి,

అయితే కృష్ణుడి ఇదేంటో తెలుసుకోవాలని కూతుహలపడి, పెద్దలని ఆడిగాడు. అయితే వారు వర్షాలు ఇచ్చే వరణుడు, ఇంద్రుడి ఆదీనంలోనే ఉంటాడుకదా, ఆ వర్షాలు వస్తేనేకదా మనకు పంటలు పండుతాయి, గోవులకు ఆహారం లభిస్తుంది. ఆ గోవుల పాడిపై మన జీవనం ఆధారపడి ఉంది అందుకే చేస్తున్నాం అని చెప్పారు. అయితే ఇంద్రుడు దేవతల అధిపతి, ఒక ఉద్యోగి, ఇలాంటివారెందరో తన ఆధీనంలో పని చేస్తున్నవారు ఉన్నారు ఈ విశ్వం యొక్క స్థితి కోసం.

ఆ ఇంద్రుడి కి చేయటం ఏంటీ,

అలాంటిది తాను ఇక్కడే ఉంటుంటే తనను మరచిపోయి, ఆ ఇంద్రుడి కి చేయటం ఏంటీ, ఆ ఇంద్రుడు ఇవ్వాలన్నా తాను వెనకనుండి ఇస్తేనేకదా, ఇవ్వగలడు అని, ఆ ఇచ్చేవాన్ని నేనిక్కడే ఉండగా నన్ను కాదని చేస్తున్నారే అని శ్రీకృష్ణుడు అనుకున్నాడు. అయితే శ్రీకృష్ణుడు మాత్రం ఒప్పుకోక ప్రకృతికి నిలయమైన పర్వతములు దైవనిర్ణితములని, పర్వతములకు తాము చేయు ప్రార్థనలతో పిండివంటలు అర్పించవలెనని చెప్పి వారితో ఆ పద్ధతే చేయించాడు.

ఫలితంగా గోకులంలోని ప్రజలు ఇంద్రుని ఆగ్రహానికి గురి అయ్యారు

ఫలితంగా గోకులంలోని ప్రజలు ఇంద్రుని ఆగ్రహానికి గురి అయ్యారు... తన కోపాన్ని ప్రదర్శించేందుకు ఇంద్రుడు వారి మీద ఉరుములు, పిడుగులతో కూడిన భీకర వర్షాన్ని కురిపిస్తాడు.ఏడు రోజులు ఏకధాటిగా తెరిపిలేకుండా గోకులంలో వర్షము, గాలితో ప్రళయము సృష్టిస్తాడు. గోపాలురను, గోకులాన్ని భయకంపితులను చేశాడు. గోకులమంతా శ్రీకృష్ణుడికి మొరపెట్టుకున్నాయి, ఈ విపత్తునుంచి కాపాడమని, విన్నపాలు చేసుకున్నారు.

గోవర్థన పర్వతాన్ని ఎత్తి గోకులాన్నంతా కాపాడి ఇంద్రుడికి గర్వభంగం చేశాడు.

చిన్నికృష్ణుడు ఏడేండ్ల ప్రాయముగలవాడు వారికి ధైర్యం చెప్పి గోవర్థన పర్వతాన్ని ఎత్తి గోకులాన్నంతా కాపాడి ఇంద్రుడికి గర్వభంగం చేశాడు. అప్పుడు బ్రహ్మ, ఇంద్రాది దేవతలు శ్రీకృష్ణుడికి క్షమాపణ చెబుతూ పాదాలు కడిగినారు. అప్పటినుండి స్వామి పాదాలు బ్రహ్మకడిగిన పాదములని భక్తులచేత కీర్తించబడినాయి.

గోవులను, గోకులాన్ని కాపాడినప్పుడు పిల్చిన నామం గోవిందా.. గోవిందా నామం.

ఈ ఏడు రోజులు గోవర్థన పర్వతాన్ని తన చిటికెన వ్రేలుపై నిలబెట్టి గోపాలురని, గోవులను, గోకులాన్ని కాపాడినప్పుడు పిల్చిన నామం గోవిందా.. గోవిందా నామం.

స్వయంగా శ్రీకృష్ణుని దర్శించుకుని,

స్వయంగా శ్రీకృష్ణుని దర్శించుకుని, క్షమాపణలు వేడుకునేందుకు అదే సమయంలో కృష్ణుని వద్దకు గోమాత అయిన కామధేనువు కూడా వస్తుంది. తన బిడ్డలైన గోవులన్నింటినీ రక్షించిన కృష్ణుని పట్ల కృతజ్ఞతగా,ఆయనను తన పాలతో అభిషేకించేందుకు పూనుకుంటుంది.

ఆ దృశ్యాన్ని చూసి పరవశించిపోయిన ఇంద్రుడు

ఆ దృశ్యాన్ని చూసి పరవశించిపోయిన ఇంద్రుడు తన వాహనమైన ఐరావతాన్ని కూడా గంగాజలంతో కృష్ణుని అభిషేకించవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. అటుపై ‘నేను కేవలం దేవతలకు మాత్రమే ఇంద్రుడిని (అధిపతిని).

అలా కృష్ణుడు ‘గోవిందుడు’ అన్న నామంతో పూజలందుకుంటున్నాడు.

కానీ మీరు గోవులన్నింటికీ కూడా అధిపతి. అందుచేత మీరు గోవిందునిగా కూడా పిలవబడతారు,' అని పేర్కొటాడు. అప్పటి నుంచి అలా కృష్ణుడు ‘గోవిందుడు' అన్న నామంతో పూజలందుకుంటున్నాడు.

జలములనుండి భూమిని పైకి తీసుకొని వచ్చి సృష్టికి కారణమైనవాడు

జలములనుండి భూమిని పైకి తీసుకొని వచ్చి సృష్టికి కారణమైనవాడు కనుక గోవింద నామం ఇవ్వబడినది, పిలువబడినది. గోవులంటే ప్రీతి, ప్రేమ. వాటి కాపరిగా ఉండటం చేత గోవిందా గోవిందా అని పిలువబడ్డాడు. ఈ నామమెంతో మధురం, సర్వపాపహరం.

భూమికి వసుంధర అని పేరు వచ్చింది.

మనం ప్రతి వస్తువు భూమి నుండే పొందుతాం కనుక భూమికి వసుంధర అని పేరు వచ్చింది. భూమిని కాపాడినవాడు, పోషించువాడు కనుక వసుంధరుడు గోవిందా.. గోవిందా అని పిలువబడ్డాడు. ఆవులలో సమస్త దేవతలు వచ్చి ఉంటారు. వాటిని కాచేవాడుగా, పాలించేవాడిగా ఉండటంవల్ల గోవింద నామం వచ్చింది.

గోసేవ చేస్తే చిత్తశుద్ధి కలుగుతుందంటారు.

గోసేవ చేస్తే చిత్తశుద్ధి కలుగుతుందంటారు. గోదానంవల్ల పుణ్యం దక్కుతుంది. గోదానంవల్ల అక్రూరుడు పుట్టాడు. అక్రూరుడనగా క్రూరత్వం లేనివాడు. శుద్ధ బ్రాహ్మణుడు. శమంతకమణిని ఎవరూ తీసుకోలేనపుడు అక్రూరుడు ఆ మణిని ధరించి రాజ్యపాలన చేసిన ధర్మాత్ముడు.

‘గో’ అనే పదానికి ఒక్క అర్థం కాదు అనేక అర్థాలున్నాయి.

‘గో' అనే పదానికి ఒక్క అర్థం కాదు అనేక అర్థాలున్నాయి. ఏ ఒక్క నామం ద్వారానైనా మనం ఈశ్వరుణ్ణి చేరవచ్చు. గోపూజ గోవిందపూజతో సమానం. గోవిందనామం సర్వపాపహరం.

Famous Posts:

స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?


సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము


శనేశ్వరుడు శనివారాల నోము


శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత


శివదేవుని సోమవారపు నోము కథ

venkateswaraswamy, govinda, ttd, tirumala, tirupati, vishnu, om namo venkatesa

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.