Drop Down Menus

గాయత్రి మంత్ర మహిమ..!! Gayatri Mantra, Gayatri Mahima With Lyrics

గాయత్రి మంత్ర మహిమ..!!

ప్రాచీన కాలంలో నెల్లై నగరాన్ని ముఖ్యనగరంగా చేసుకొని పాండ్యరాజు ఒకరు పాలిస్తూ వుండేవారు. ఆ రాజుగారు  తీరని కడుపునెప్పి వ్యాధితో  అవస్ధ పడుతూండేవాడు.

వైద్యులు ఎంత మంది ప్రయత్నించినా గుణపర్చలేకపోయారు.

అప్పుడు , ఒకనాడు రాజుగారి సభకి ఒక జ్యోతిష్కుడు   వచ్చాడు. మహారాజును చూసి

" తమకి ఏ ఔషధాలు అవసరం లేదు.  జాతకరీత్యా వున్న దోష  విముక్తికి పరిహారం చేస్తే చాలు,  అని చెప్పాడు. జ్యోతిష్కుడు  చెప్పిన ప్రకారం, పరిష్కార పూజ  మొదలయింది. 

మంత్రాలతో ఒక యమధర్మరాజు బొమ్మని చేసి, ఆ బొమ్మ చేతిలో  ఒక  కత్తి ని అమర్చాడు జ్యోతిష్కుడు. 

పిదప , "రాజా !  యీ  యముని బొమ్మ చేతిలో వున్న కత్తిని కింద

పడేట్లు చేసిన వారికి , ధనాన్ని  ,సువర్ణాన్ని  బహుమతిగా ప్రకటించమని చెప్పాడు.

రాజావారు అలాగే తన దేశమంతా చాటింపువేయించాడు.

రాజుగారిచ్చే బహుమతి కోసం రాజ్యంలోని ప్రజలంతా

సభకి  వచ్చి  బొమ్మ చేతిలోని కత్తిని క్రింద పడవేసేందుకు ఎంతో ప్రయత్నించారు. కాని ఒక్కొక్కరు  ఆ బొమ్మ వద్దకి రాగానే.. ఆ బొమ్మ మూడు వ్రేళ్ళను ఎత్తి చూపేది. వచ్చిన వారికి ఏమీ అర్ధం కాక ఏం చేయాలో తెలియక  తిరిగి వెళ్ళి పోయేవారు. 

ఒకనాడు ఒక బ్రాహ్మణుడు రాజ సభకు వచ్చి  తను కూడా ప్రయత్నించి చూద్దామని ఆ మంత్రపు బొమ్మ దగ్గరకు రాగానే ప్రతిసారి లాగనే ఆ బొమ్మ మూడు వేళ్ళు ఎత్తి చూపింది. బ్రాహ్మణుడు అర్ధమైనట్లుగా

" కుదరదు"  అన్నాడు. వెంటనే బొమ్మ రెండు వేళ్ళు చూపించింది.  "అప్పుడు కూడా  ఒప్పుకోను"  అన్నాడు

బ్రాహ్మణుడు. తరువాత ఒక్క వేలు మాత్రమే ఎత్తి  చూపించింది బొమ్మ. దానికి   బ్రాహ్మణుడు సరేనని,  దగ్గర వున్న పాత్రలోని  నీటిని, తీసుకుని ఆ నీటి ధారతో దానం చేశాడు.

మరుక్షణమే  యమధర్మరాజు చేతిలోని కత్తి క్రింద పడిపోయింది. మరుక్షణమే  మహారాజు గారి కడుపునొప్పి  అదృశ్యమై పూర్ణ ఆరోగ్యవంతుడైనాడు. పిదప  , ఆ మంత్ర బొమ్మ మూడు వ్రేళ్ళ రహస్యం ఏమిటి ? అని రాజు ,బ్రాహ్మణుని అడిగాడు.

రాజా ! .. బొమ్మ మూడు వ్రేళ్ళు ఎత్తి  చూపి  , నేను మూడు పూటలా చేసే గాయత్రి మంత్ర  జప పుణ్యఫలం దానంగా అడిగినట్లు తలచి,  ' వీలుకాదు' అని ఒప్పుకోలేదు.

తరువాత రెండు వ్రేళ్ళను మాత్రమే చూపింది బొమ్మ, అప్పుడు కూడా, రెండు పూటలా జపించిన గాయత్రి మంత్ర జప  పుణ్య ఫలాన్ని అడుగుతున్నదని తలచి ఇవ్వను అని చెప్పాను. ఆఖరికి ఒక వ్రేలు చూపినది బొమ్మ.   మహారాజావారి ఆరోగ్యాన్ని కాపాడడం కోసం వెంటనే ఒక  పూట నేను జపించిన గాయత్రీ మంత్ర పుణ్య ఫలాన్ని యివ్వడానికి సమ్మతించి ఆ పుణ్యఫలాన్ని ధారపోశాను. దాని ఫలితంగా బొమ్మ కత్తిని క్రింద పడవేసింది.   అని బ్రాహ్మణుడు  వివరించాడు.

రాజు గారు , గాయత్రీ మంత్ర జప పుణ్యఫలాలను, అర్ధం చేసుకొని, బ్రాహ్మణునికి విలవైన కానుకలను యిచ్చి సత్కరించాడు.

ఒక పూట గాయత్రీ జపానికే అంతటి మహత్తు వుంటే , నిత్యమూ నియమ నిష్టలతో భక్తితో గాయత్రీ మంత్రాన్ని జపించేవారు మరెంతటి మహిమాన్విత శక్తులు కలిగివుంటారో ఊహించలేము స్వస్తి.....

ఓం భూర్ భువః స్వః

తత్-సవితుర్ వరేణ్యం |

భర్గో దేవస్య ధీమహి

ధియో యోనః ప్రచోదయాత్ ||

ఓం శ్రీ గాయత్రి మాత్రేనమః...

Famous Posts:

వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.

శివుడు చెప్పిన ‘ఆదివిద్య’లు


శివ గుణాలు లోకానికి సందేశాలు


భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?


కూతురా కోడలా ఎవరు ప్రధానం...? 


సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?


కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?

గాయత్రి మంత్రం, gayatri mantra in telugu, gayatri mantra meaning, gayatri mantra pdf, gayatri mantra, gayatri mantra, gayatri mantra benefits, gayatri mantra in sanskrit

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.