Drop Down Menus

నవరాత్రి వ్రతం పూర్తయిన తర్వాత ఉద్వాసన ఏవిధంగా చేయాలి? కలశాన్ని ఏమి చేయాలి? Devi Navaratrulu - Kalasam Pooja

నవరాత్రి వ్రతం పూర్తయిన తర్వాత ఉద్వాసన ఏవిధంగా చేయాలి? కలశాన్ని ఏమి చేయాలి?

నవరాత్ర వ్రతం పూర్తి అయిన తరువాత చెయ్యవలసిన దానిని ఉద్వాసన అంటారు. ఉద్వాసన అంటే మళ్ళీ తమ నెలవులకు పంపుట అని అర్థం. అమ్మవారిని ఆరాధించినప్పుడు ఎక్కడినుంచో తీసుకురారు. సర్వవ్యాపినియైన శక్తిని మనం మంత్రం ద్వారా, భావన ద్వారా మననుండే అందులో ఆవహింపజేస్తాం.

ఆ జగదంబను వివిధ విధములుగా ఆరాధించిన తర్వాత ఏ బింబమునందు ఆరాధించామో ఆ బింబములోని శక్తి మనం స్వీకరించితే మన హృదయంలో అమ్మవారు ఉండి మనలను అనుగ్రహిస్తారు. అందుకు ఆ కలశానికి ఉద్వాసన చెప్తారు. అనగా కలశంలో ఉన్న శక్తిని తిరిగి మన లోపలకి స్వీకరించి ఆ కలశమును ఇంక కదుపుతారు. ఇది ఎప్పుడు చేయాలంటే 'శ్రవణేన విసర్జయేత్' అని చెప్పినట్లుగా... నవమి ఉన్నప్పటికీ శ్రవణా నక్షత్రంలో కూడి ఉన్నప్పుడు ఆ రోజునే విసర్జించాలి అని చెప్పారు. ఆవిధంగా బింబమును తొలగించి బింబము లోని శక్తిని మనలోకి స్వీకరిస్తాం. ఇది ఉద్వాసన కలశాన్ని కదపడంలో ఉన్న ఆంతర్యం.

అయితే చాలా మందికి కలశంపై ఉంచిన కొబ్బరికాయను ఏమి చేయాలో అర్ధం కాదు.కలశం మీద పెట్టిన కొబ్బరికాయను పూజ చేయించటానికి వచ్చిన బ్రాహ్మణులకు ఇవ్వచ్చు.

ఒకవేళ బ్రాహ్మణులు లేకపోతే పారే నీటిలో నిమజ్జనం చేయవచ్చు.కొబ్బరికాయను బ్రాహ్మణులకు ఇచ్చిన లేదా పారే నీటిలో నిమజ్జనం చేసిన ఎటువంటి దోషాలు ఉండవు.

దేవాలయంలో కలశాన్ని పెడితే పూర్ణాహుతి చేస్తారు.అదే ఇంటిలో కలశాన్ని పెడితే కొబ్బరికాయను బ్రాహ్మణులకు ఇవ్వడం లేదా పారే నీటిలో నిమజ్జనం చేస్తూ ఉంటారు.ఇది మన పూర్వీకుల నుంచి ఒక ఆచారంగా వస్తుంది.

మన పెద్దలు చెప్పిన సంప్రదాయాలను అనుసరించటం మన విధి.

[బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి సమాధానం]

Famous Posts:

ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే

అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం

> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి

100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

navaratrulu, kalasam, devi navaratrulu pooja, durga, kalasam pooja, navaratrulu udwasana, kalasam pooja telugu

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.