Drop Down Menus

Famous Temples List In Suryapet District | Telangana State

సూర్యాపేట జిల్లాలోని ప్రముఖ దేవాలయాల జాబితా :

ఈ సూర్యాపేట నూతనంగా ఏర్పడిన జిల్లా ఇంతకు ముందు ఈ ప్రాంతం నల్గొండ జిల్లాలో ఉండేది. కానీ ఇప్పుడు నూతనంగా ఏర్పడినది.  

1. మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి , హుజూర్ నగర్ :

కృష్ణా తీరాన వున్న పంచ నారసింహ క్షేత్రాలలో తెలంగాణా రాష్ట్రంలోని మట్టపల్లి కూడా ఒకటి.  నల్గొండ జిల్లా, హుజూర్ నగర్ తాలూకా లో విలసిల్లిన ఈ క్షేత్రంలో నరసింహస్వామి స్వయంభువుడు.  సప్త ఋషులలో ఒకరైన భరద్వాజ మహర్షి ఇక్కడ గుహలో వున్న ఈ స్వామిని చాలా కాలం సేవించారు. అనారోగ్య బాధలు, దుష్ట గ్రహ బాధలు ఋణబాధలు వున్నవారు, సంతానము లేనివారు నా క్షేత్రమునకు వచ్చి 11 రోజులు మూడుపూటలు  కృష్ణలో స్నానం చేసి తడి బట్టలతో 32 ప్రదక్షిణలు చేసినచో మీ అన్ని కోర్కెలు తీరుస్తాను అని చెప్పారుట.

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 4.00PM TO 7.00PM.

2. శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం , పిల్లలమర్రి  :

ఈ ఆలయం లో శివ స్వామి చెన్న కేశవ స్వామిగా పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయం పిల్లలమర్రి గ్రామం , సూర్యాపేట టౌన్ కి అతి దగ్గరలో కలదు. ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయానికి 1000 సంవత్సరాల చరిత్ర కలదు. ఈ ఆలయం కాకతీయ కాలంలో బాగా అభివృద్ది జరిగినది. ఆలయం లో శిల్ప కళా సౌందర్యతో ఉట్టి పడుతుంది. ఈ ఆలయం మొత్తం రాతితో నిర్మించారు.  ఈ ఆలయంలో శివ రాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి.

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 4.00PM TO 7.00PM.

3. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం , యాదాద్రి :

యదా మహర్షి తపస్సు కి మెచ్చి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఈ కొండ పై వేలిసారు. స్వామి లక్ష్మీ సమెతంగా ఈ ఆలయంలో దర్శించవచ్చు. ఈ ఆలయంలో 2 ఆలయాలు కలవు. 1. కొత్త ఆలయం ,2 పాత గుట్ట . ఈ పాత గుట్ట ఆలయనికి బస్ స్టాండ్ నుంచి ప్రైవేట్ వాహనాలు బయలుదేరుతాయి. హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ బస్ లు అందుబాటలో ఉన్నాయి. భువనగరిలో ట్రైన్ లో వచ్చి అక్కడి నుంచి ఆటో లో కూడా ఈ ఆలయం కి చేరుకోవచ్చు. ప్రస్తుతం ఈ కొత్త ఆలయం కొత్త రూపురేఖలు దిద్దుకుంటుంది. ఈ క్షేత్ర పాలకుడు శ్రీ ఆంజనేయ స్వామి.

ఆలయ దర్శించే సమయం : 5.00AM TO 2.00PM - 3.30PM TO 9.30PM.

4. ఛాయా సోమేశ్వర ఆలయం , పానగల్లు :

ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ శివ స్వామి. ఈ ఆలయంలో శివ అలయంతో పాటు నంది  మండపాలు కలవు. దీనికి 66 స్తంభాలు కలవు. ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయంలో మరెక్కడా కనిపించని విశేషం ఉన్నది. ఆలయ గర్భాలయంలోని శివ లింగాన్ని నీడ(ఛాయా) కప్పేయడం విశేషం. కానీ ఆ నీడ ఏ స్తంభం నుంచి వస్తుందో ఇప్పటికీ అంతు చిక్కదు. ఒకనాటి కాకతీయ సమంతులైన కందురు చోళులు క్రీ. శ 10-11 మధ్య శతాబ్ధంలో ఈ ఆలయన్ని నిర్మించినట్టు అక్కడి శాసనాల ఆధారంగా తెలిసింది.

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 4.00PM TO 8.00PM.

5. సురేంద్రపురి , యాదాద్రి :

కుంద సత్యనారాయణ కళాధమం ఈ ప్రాంతం. హైదరాబాద్ నుంచి 60 కి.మీ దూరంలో కలదు. భారత పురాతన ఇతిహాసాలు , కథలు , ఇక్కడ చాలా చూడవచ్చు. ఇది తన కుమారుడి జ్ఞాపకార్ధంగా కుందా సత్యనారాయణచే నిర్మించారు. భారతదేశంలోని ముఖ్యమైన దేవాలయాల ప్రతిరూపాలు ఇక్కడ చూడవచ్చు. పౌరాణిక దృశ్యాలు , శిల్పాలు , పూర్తిగా చూడవచ్చు. యాదాద్రి శ్రీ నరసింహ స్వామి ఆలయానికి వెళ్ళే దారిలోనే ఈ ప్రాంతం కలదు.

దర్శించే సమయం : 9.30AM TO 5.00PM.

6. శ్రీ హనుమాన్ ఆలయం , భువనగిరి :

ఈ ఆలయం భువనగిరి అనే కొండ పై కలదు. ఈ కొండయే ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణ. రాజు విక్రమాదిత్య కాలంలో నిర్మించిన కోట కొండ పై చూడవచ్చు. ఈ కొండ పైకి ఎక్కి పట్టణం మరియు చుట్టుపక్కల గ్రామాల పక్షి ఫ=దృశ్యం ద్వారా గొప్ప అనుభవాన్ని పొందవచ్చు.

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 4.00PM TO 6 .30PM.

7. శ్రీ పార్వతి జడలరామలింగేశ్వర స్వామి ఆలయం , నార్కెట్ పల్లి :

ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయం చేరువుగట్టు గ్రామం , నార్కెట్ పల్లి లో కలదు. శివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. నార్కెట్ పల్లి నుంచి 6 కి. మీ దూరంలో కలదు.

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 4.00PM TO 8.00PM.

8. లింగమంతుల ఆలయం , దూరజా పల్లి :

ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయానికి 400 సం || చరిత్ర కలదు. ఈ ఆలయం దూరజా పల్లి గ్రామం , సూర్యాపేట లో కలదు. భారత దేశంలో జరిగే పెద్ద జాతరాలలో ఈ జాతర ఒకటి. ప్రతి రెండు సం || ఒకసారి ఫిబ్రవరిలో ఈ ఆలయంలో నిర్వహిస్తారు

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 3.30PM TO 7.30PM.

9. శ్రీ రంగనాయక స్వామి ఆలయం , ఎదులాబాద్ :

ఈ ఆలయం ఎదులాబాద్ , ఘటకేసర్ మండలం లో కలదు. ఈ ఆలయం చారిత్రక కట్టడం. మరియు పురాతన ఆలయం . 350 సం || చరిత్ర కలదు. ప్రతి సం || స్వామివారికి భ్రమోత్సవాలు
నిర్వహిస్తారు.

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 4.00PM TO 7.00PM.

10. శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం , నార్కెట్ పల్లి :

నార్కెట్ పల్లి కి 4 కి. మీ దూరంలో గోపారాయ లో శ్రీ వారిజల వేణుగోపాల స్వామి ఆలయం కలదు. ఈ అలయని 1990లో పునఃనిర్మించారు. ఈ ప్రాంతానికి గోవర్ధన గిరి అనే మారియొక్క పేరు కూడా ఉన్నది. మకర తోరణం , తీరునామంతో ఉత్సవ మూర్తి కూడా ఉన్నది. ఈ క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామి .

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 3.00PM TO 8.00PM.

11. శ్రీ నరసింహ స్వామి ఆలయం , పాళ్లెం :

ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. 17 వ శతాబ్దానికి చెందినది. ఈ అలయాలో దేవత మూర్తి తవ్వకాలలో లభిచ్చింది. ఈ ఆలయ పళ్లెం గ్రామం , నకిరేకల్ మండలం లో కలదు. హైదరాబాద్ నుంచి 120 కి. మీ దూరంలో ఉన్నది. ప్రతి సం || స్వామివారి కి కళ్యాణ వేడుకలు జరుగుతాయి.

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 4.00PM TO 7.00PM.

సూర్యాపేట  జిల్లాలోని కొత్తగా చేర్చిన ఆలయాల వివరాల కొరకు ఇక్కడ చేయండి. 
Telangana Temples District Wise


KeyWords : Suryapet Famous Temples List, Suryapet District Surrounding Temples, Telangana Famous Temples List, Hindu Temples Guide
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.