Drop Down Menus

మనిషి చెప్పే మూడు అబద్ధాలు ఏమిటి? What are the three lies that man tells?

మనిషి చెప్పే మూడు అబద్ధాలు ఏమిటి?

భూమిపై ఆత్మజ్ఞానంతో జన్మించే మనుషులు నిరంతరం మూడు అబద్ధాలు చెబుతుంటారు. ఆ మూడు అబద్ధాలు చెప్పడం మానేస్తేనే వారు నిండుగా జీవించడం సాధ్యంకాదు.

శతాబ్దాలుగా తత్వవేత్తలు, ఋషులు, ఇపుడు మానసిక నిపుణులు ఈ విషయాన్ని పదేపదే చెబుతూనే ఉన్నారు. కానీ ఈ మనుషులు మాత్రం ఆ ముగ్గురి మాటలను పట్టించుకోలేదు. ఆ మూడు అబద్ధాలు ఏంటో ఓసారి పరిశీలిద్ధాం.

అబద్ధం 1 : 'ఇది నా వల్ల కాదు, ఈ పని నేను చేయలేను'. ఇతరులకు సాధ్యమయ్యే పని తమ వల్ల కాదని తమని తాము నమ్మించుకోడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు. కానీ 'ఎందుకు కాదు, దీని అంతు చూద్దాం' అనేవారు అరుదు. 'సాధనమున పనులు సమకూరు ధరలోన' అన్న మాట గుర్తుంచుకోవాలి. ముందుగా తమ వల్ల కాదనే మాట పక్కన పెట్టాలి. ఇతరులకు సాధ్యమయ్యే పని తనకు కూడా సాధ్యమేనని పట్టుదలతో శ్రమించాలి. తమ వంతు ప్రయత్నం చేయాలి.

అబద్ధం 2 : ప్రతి ఒక్కరు తమకు ఇంకా ఎంతో సమయం వుందని, తమని తాము మోసపుచ్చుకుంటారు. మనిషికి ఉన్నది ఒకే ఒక్క జీవితం. రోజుకు ఉన్నది కేవలం 24 గంటలు. ఈ గంట, ఈ రోజు గడిచిపోయిందంటే మరల రాదు. కనుక వర్తమానం మరిచి భవిష్యత్తు గురించి ఏవేవో ఊహల విహాయాసంలో తిరుగాడటంమానేయాలి. భవిష్యత్తు ఎంతో ఉందనుకుంటూ, రాబోయే కాలాన్ని గురించి ప్రణాళికలు రచిస్తుంటారు. తక్షణ కర్తవ్యాల్ని విస్మరించి గ్యారంటీ లేని భవిష్యత్తు గురించి తలపోస్తారు. ఎంతో సమయం వుంది లెమ్మనే స్వీయ అబద్ధంతో పొద్దుపుచ్చడమే దీనికి మూలం.

అబద్ధం 3 : అంతా తమ దురదృష్టం అని సోమరులు చాలాసార్లు వాపోతుంటారు. ఇది మరో అబద్ధం. ఒక పని చేయడానికి మీరు ఎంతగా శ్రద్ధాసక్తులు చూపుతారన్నది ముఖ్యం. అసలు చొరవ చూపకుండానే దురదృష్టం, తలరాత, విధిరాత అనే మాటలతో సరిపెట్టుకోవడం ఆత్మవంచన. నూటికి నూరుశాతం శ్రమించకుండా అదృష్టం బాగోలేదని వాపోవడం అర్థరహితం. 

ఈ విధంగా మూడు అబద్ధాలతో కాలాన్ని దొర్లించేస్తూ, ఏదో ఒక రోజున అనుకోకుండా పశ్చాత్తాపాలతో ఈ లోకం నుంచి నిష్క్రమిస్తుంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండివుంటే ఈ స్థితి వచ్చి వుండేది కాదని చింతిస్తుంటారు.

తమలోని శక్తి సామర్థ్యాలని నూటికి నూరుపాళ్ళు ఉపయోగించాలి. వీలైనంత మేరకు ఎక్కువమందికి మేలు చేకూరేలా జీవితాన్ని మలచుకోవాలి. ఎంతకాలం బతికామన్నది కాదు, ఎంత నిర్దిష్టంగా ఎలాంటి విలువలతో జీవించామన్నదే ప్రధానం. తాము జీవించిన కాలంలో తమ మాట, నడత ఎందరికి ఉపయోగపడుతుందన్నదే ముఖ్యం. దీనిని గుర్తు పెట్టుకుంటే అబద్ధాలతో ఆత్మవంచనతో గడపాల్సిన అగత్యం ఉండదు. ఈ భూమిపై తాము జీవించివున్నా.. లేక వెళ్లిపోయినా 10మంది తమని తలచుకునేలా గడపడమే బతికిన క్షణాలకు ధన్యత.

Famous Posts:

కొత్త కోడలు రాగానే సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు?


మంగళ, శుక్రవారాల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదా?


భర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ?


వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.


శివుడు చెప్పిన ‘ఆదివిద్య’లు


శివ గుణాలు లోకానికి సందేశాలు


భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?


కూతురా కోడలా ఎవరు ప్రధానం...?


సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?

top 5 lies guys tell, lies guys tell their girlfriends, most common lies guys tell, most common lies told in a relationship, 3 most told lies, most common lies funny, common lies married man will tell you, devotional storys telugu

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.