Drop Down Menus

తనని నమ్మిన భక్తులని రక్షించెందుకు ఆ పరమేశ్వరి ఎప్పుడు ఎలా వస్తుందో తెలుసా ? Hindu Gods & Goddesses Real Stories

నిజంగా జరిగిన సంఘటన..

తనని నమ్మిన భక్తులని కాచి రక్షించెందుకు ఆ పరమేశ్వరి ఎప్పుడు సిద్ధం గా ఉంటుంది..

అలా ఎన్నో సంఘటనలు జరిగాయి వాటిలో ఇదొకటి...

తిరుకడైవూర్ క్షేత్రం లొ అభిరామి అమ్మవారు సాత్విక రూపంలో వెలిసి ఉన్నారు అదే క్షేత్ర పరిధిలో అభిరామ భట్టు అనే భక్తుడు కూడా ఉండేవాడు ఈయన ప్రతి రోజు అమ్మవారి ఆలయంలొ ధ్యానంలోనే ఎక్కువ సమయం ఉండేవాడు..

ఆయన ధ్యానస్థితిలో ఉండగా అమ్మవారు ఆయనకి తరచూ దర్శనం ఇచ్చేది.

ఒక నాడు ఆలయం లొ ఆయన ధ్యానం చేసే సమయంలో తంజావూరు చక్రవర్తి అయిన తుందిరా మహారాజు అమ్మవారి దర్శనానికి వచ్చాడు.. అందరు లేచి నిలబడి స్వాగతం పలికారు ఒక్క అభిరామ భట్టు తప్ప అయన మౌనంగా లోపలకి వెళ్లిపోయాడు..

పూజా కార్యక్రమం ముగించుకొని బయటకు వస్తూ ఉండగా మళ్ళీ అందరు లేచి నిలబడ్డారు ఈయన తప్ప దాంతో మహారాజుకి కోపం వచ్చి ఎవరితను అనగా ఆలయ అర్చకులు పరుగు పరుగున వచ్చి ఈయనొక ఉన్మాది ప్రభూ మధిరా పానం వల్ల బాహ్య సృహ లేదు అన్నారు కానీ రాజుకి అనుమానం వచ్చింది.. కారణం ఆయన మొహం లో అమ్మవారి దర్శనం తాలూకా ఆనందం కళ రూపంలో మొహం వెలిగి పోతోంది వెంటనే ఆయన్ని లేపమని చెప్పాడు తుందిరా మహారాజు... భటుడు వెళ్లి కదపగా ధ్యానం నుండి బయటకి వచ్చాడు అభిరామ భట్టు...

వెంటనే మహారాజు ఆయన్ని ఇవాళ తిధి ఏంటి అన్నాడు దానికి అభిరామ భట్టు తడుముకోకుండా పౌర్ణమి అన్నాడు కారణం ఇప్పటి వరకు తను ధ్యానం లొ చంద్రబింబం లాంటి అమ్మవారి మోము చూడటమే చుట్టుపక్కల అందరు ఒక్కసారిగా తలలు పట్టుకున్నారు ఎందుకంటే ఆ రోజు అమావాస్య.. మహారాజు వెంటనే సరే నేను సాయంత్రం వస్తా నాకు చంద్ర దర్శనం చేయిస్తావా అన్నాడు దానికి ఒప్పుకున్నాడు అభిరాముడు.. ఒకవేళ సాయంత్రం చంద్ర దర్శనం నాకు కలుగక పోతే నిన్ను శిక్షిస్తాను అన్నాడు మహారాజు..

సాయంత్రం అయ్యింది అభిరామ భట్టు స్నానాధి కార్యక్రమాలు ముగించుకుని ఆలయంలోకీ వచ్చి అమ్మవారికి అంతాది రూపక ప్రార్ధన చేయటం మొదలెట్టాడు (అంటే ఒక శ్లోకం ఏ పదం తో ముగుస్తుందో తర్వాత శ్లోకం ఆ పదం తో మొదలెట్టడం అలా ఆయన ఎన్నో శ్లోకాలు రాసాడు వాటిని అభిరామ అంతాది అంటారు.

అలా శ్లోకాలు చెప్తూ ఉండగా చీకటి పడింది మహారాజు వచ్చాడు నాకు చంద్ర దర్శనం చేయించు అన్నాడు అభిరామ భట్టుతో..

అభిరామ భట్టు శ్లోకం చెప్పడం ఆపలేదు. రాజు మరొక్కసారి అడిగాడు కానీ అభిరామ భట్టు అలాగే చెప్పుకుంటూ పోతున్నాడు..

మహారాజుకి కోపం వచ్చి ఈ దూర్తుడిని శిక్షించండి అనబోతు ఉండగా ఆకాశం లొ ఒక ఆశ్చర్యం జరిగింది అప్పటి వరకు చిమ్మ చీకటిగా ఉన్న ఆకాశం ఒక్కసారిగా వెలుగులు సంతరించుకుంది అక్కడ నిండు చందమామ రూపం లొ అమ్మవారి చెవి తాటంకం ఉంది దాన్ని దర్శించిన తుందిరా మహారాజు,, ప్రజలు ఒక్కసారిగా అభిరామ భట్టుకు,, అభిరామి అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసారు..

Famous Posts:

Hindu Gods & Goddesses Real Stories, goddess story, durga story, goddess lakshmi story, durga maa story in telugu, goddess durga husband, beauty of goddess durga, durga killing mahishasura story, durga goddess

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.