Drop Down Menus

మంగళవారం అరుణాచలం లో గిరిప్రదక్షిణ చేస్తే ఏ ఫలితం ఉంటుంది...| Arunachal Giri Pradakshina results on Tuesday

మంగళవారం అరుణాచల గిరి ప్రదక్షిణ ఫలితాలు...

మంగళవారం మురుగ పెరుమాళ్‌కు శ్రేష్టమైన దినం. మహాశివుడి మూడో కంటి నుండి ఉద్భవించిన అగ్ని జ్వాలలుగా జనించి, ఆరు కార్తీక నక్షత్రాలు పోషించబడి, శరవణతీర్థంలో షణ్ముఖుడిగా జన్మించిన రోజు ఇదే.

మంగళవారం తిరుఅణ్ణామలై గిరి ప్రదక్షిణను అరుణాచలేశ్వరాలయంలోని బ్రహ్మతీర్థం సమీపంలో వేంచేసి యున్న గణపతిదేవుని నమస్కరించి ప్రారంభించాలి.

గో సంరక్షణ గణపతి

కోటి యుగాలపాటు కొలువుదీరిన అద్భుతమూర్తి ఈ గణపతి. ద్వాపరయుగంలో ఓమారు గోకులంలో పశువుల సంతతి బాగా తగ్గిపోవడంతో గోకులవాసులంతా శ్రీకృష్ణపరమాత్ముడితో కలిసి తిరుఅణ్ణామలైని గిరి ప్రదక్షిణ చేసి, అరుణాచలేశ్వరుడిని దర్శించి పొందిన గోవులను గణపతికి సమర్పించారు. ఆ సమయంలో శ్రీకృష్ణపరమాత్ముడు గణపతిని 'గో సంరక్షణ గణపతి' అంటూ కీర్తించి శ్రీవేణుగోపాలుడి రూపంలో దర్శనమిచ్చారు. ఆయనే నేటికీ మూలవిరాట్టుకు వెనుకవైపున, తొలి ప్రాకారంలోన మురళీగానలోలుని రూపంలో దర్శనమిస్తున్నారు.

శ్రీ పచ్చయమ్మన్ ఆలయం

చేర చోళ పాండ్య రాజులు మువ్వురూ అతీత బలంతో ఐకమత్యంగా రాజ్యాలు ఏలుతున్న ఓ సమయంలో పదాతి బలం పెంచేందుకు దోహదపడే గజ పూజను చేయటం మరచారు.

చతుర్థి దినాన సైన్యపు ఏనుగులన్నీ బారులు తీరి శ్రీగణపతికి పలు రకాల అభిషేక ఆరాధనలు నిర్వంహించేవారు. ఆ తర్వాత 108 ఏనుగులతో శైవ, వైష్ణవ పద్ధతుల్లో 'గజపూజ' జరుపుతుండేవారు. ఆ సమయంలో 108 ఏనుగులలో ఒకదానిపై గణపతి ఆవాహనం చెంది అనుగ్రహిస్తారు. ఆ మువ్వురు చక్రవర్తులు చతుర్థినాడు చేయాల్సిన గజపూజను మరచిపోవడంతో దళంలోని ఏనుగులు అడవిలోకి వెళ్లి అంతర్థానమయ్యాయి. ఆ ముగ్గురు రాజులు దిగ్భ్రాంతి చెందారు. పెద్దల ద్వారా కారణం తెలుసుకుని తిరుఅణ్ణామలై చేరుకు 'యానై పల్లం' (ఏనుగుల గొయ్యి) అనే చోట 1008 ఏనుగులతో గజపూజలు నిర్వహించారు. చతుర్థి, మంగళవారం కూడిన దినాన జరిపిన ఆ మహాగజపూజను భూలోకవాసులేక కాకుండా సమస్త లోకాలకు చెందినవారంతా తిలకించి సంతషించారు. శ్రీఅగస్త్యులవారు, అవ్వయార్‌ నేరుగా వెళ్లి హాజరై ఆ గజపూజలకు నిండుదనం చేకూర్చారు. ఆ పూజ ముగియగాను 'తిరుఅణ్ణామలైలో బ్రహ్మతీర్థపు గట్టున వేంచేసి యున్నాను. మీవద్దగల ఏనుగులన్నింటినీ తీసుకువచ్చి నాకు సమర్పించండి' అంటూ అశరీరవాణి పలికింది. ఆ మువ్వురు రాజులు ఆ విధంగానే తమ సైనిక దళంలోని ఏనుగులన్నింటినీ తీసుకువచ్చి గణపతి దేవుని ఎదుట సమర్పించారు.

నేటికీ గణపతి ఉపాసకులు తమ ఉపాసనా పుణ్యభాగ్యాన్ని 'గోసంరక్షణ గణపతి' వద్ద సమర్పిస్తే దైవీక జీవనంలో ఉన్నత స్థితిని పొందగలరు.

మంగళవారం గిరి ప్రదక్షిణ పద్ధతి

జనన కర్మలు తీరడానికి, దైవానుగ్రహం పొందటానికి గురు అనుగ్రహం అత్యంత అవసరం. అనువైన గురువును తప్పకుండా పొందాలి. ఇలా సద్గురువు కోసం అన్వేషించే భక్తులకు మంగళవారం గిరి ప్రదక్షిణ చేయడం వరదాయకమవుతుంది.

'దీక్ష' అంటే స్పర్శ ద్వారా ఎరుకపరచడం అని అర్థం. పలువిధాలైన దీక్షల ద్వారానే సద్గురువు అనుగ్రహం పొందగలం. అనుగ్రహదీక్ష, స్పర్శ దీక్ష, మానస దీక్ష, నేత్ర దీక్ష, గిరి ప్రదక్షిణ దీక్ష అని దీక్షలు పలురకాలు.

'అరుణాచలేశ్వరా! అనువైన సద్గురువును అనుగ్రహించు తండ్రీ!' అని వేడుకునేందుకు మంగళవారాల్లో తిరుఅణ్ణామలైని గిరి ప్రదక్షిణ చేస్తే, అరుణాచలేశ్వరుడే పలు రకాల అనుగ్రహ దీక్షలను దర్శన రూపంలో అందిస్తారు. వాటిలో కొన్ని దర్శనాలను గురించి ముచ్చటిద్దాం.

నయన దీక్ష దర్శనం

శ్రీ దుర్గ అమ్మవారి ఆలయం

మంగళవారం తిరుఅణ్ణామలైని గిరి ప్రదక్షిణ చేసి శ్రీదుర్గాదేవి ఆలయంవద్ద పగడపు కొండసహితంగా అరుణాచలేశ్వరుడిని రాహుకాల సమయంలో (మంగళవారం 3 - 4.30 pm) దర్శించడాన్నే నయన దర్శనం అని పిలుస్తారు. రాహుకాల సమయంలో ఈ దర్శనం పొందేలా ఈ గిరి ప్రదక్షిణ సమయాన్ని ఎంచుకోవాలి.

1. అరుణాచలేశ్వరుడి నయన దీక్ష ప్రాప్తిసుంది. నయనదీక్ష సద్గురువు అనుగ్రహాన్ని తలపింపచేస్తుంది. సద్గుణాలను పొందగలము.

2. ఆటంకాలు తొలగి కార్యసిద్ధి ప్రాప్తిస్తుంది.

3. క్రిమికీటకాల బారిన పడకుండా పంటలను కాపాడుకోగలం.

4. కాయగూరల ఉత్పత్తి అధికమవుతుంది.

స్పర్శ దీక్ష దర్శనం

మంగళవారంనాడు, మంగళ హోర సమయంలో (ఉదయం 6-7, రాత్రి 8-9, వేకువజాము 3-4) తిరుఅణ్ణామలైని ప్రదక్షిణ చేసి ఆలయ చిలుక గోపురం వద్దగల బ్రహ్మతీర్థం చేరువగా నిలచి అరుణాచలేశ్వరుడిని దర్శించటమే 'స్పర్శ దీక్ష దర్శనం'. స్పర్శదీక్ష దర్శనం వల్ల కాపురాలు సవ్యంగా సాగుతాయి. గురువు చూపిన ఆధ్యాత్మిక మార్గంలో పయనించడానికి వీలుకలుగుతుంది.

గురువును పొందటమే అరుదు. గురు మార్గంలో నడవడం మరీ అరుదు. దీనికి సంబంధించిన ప్రార్థనా పద్ధతులు, ఆధ్యాత్మిక శక్తిని స్పర్శ దీక్ష దర్శనం మనకు అందిస్తుంది.

మానస దీక్షా దర్శనం

మంగళ హోరలో ఉచ్చికాలాన (మద్యాహ్నం 12-1) గిరి ప్రదక్షిణను ప్రారంభించి, మంగళ హోరలో (మధ్యాహ్నం 1-2) దక్షిణ గోపుర ద్వారం నుండి కుడివైపు తిరిగితే లభించేదే 'మానస దీక్షా దర్శనం'.

1. నివాసగృహాల్లో, వ్యాపారం, కార్యాలయాల్లో ఎదురయ్యే సమస్యలు తొలగి శుభదాయకమైన స్థలమార్పిడి కలుగుతుంది, సకల సౌభాగ్యాలు కూడా ప్రాప్తిస్తాయి.

2. ఆధ్యాత్మికపరంగా గురువు చూపించే ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తే మన పూర్వజన్మపు కర్మఫలితాలవల్ల కలిగే ఆటంకాలన్నీ తొలగుతాయి.

సద్గురు మార్గంలో వెళితే కష్టాలు ఎందుకు ఎదురవుతాయి?

ఏ సద్గురువైనా తన శిష్యులు వారి కర్మఫలితాలను తొలగించడాన్నే కోరుకుంటారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని అద్బుతాలు జరుపరు. వాస్తవిక జీవితంలోని కర్మలు (ప్రాప్త కర్మం) అనుభవించి తీరాల్సిందే కాని ఆ కర్మఫలితాలను గురువులు మార్చేందుకు ఇష్టపడరు. అయితే కొత్త కర్మలు చేరకుండా కాపాడగలుగుతారు.

మన కర్మఫలితాలు కొద్ది కొద్దిగా తగ్గుతూ, కొత్త కర్మలు దరి చేరకుండా ఉంటే అదే జనన మరణరాహిత్య సార్థక జీవితానికి సంకేతమవుతుంది.

సద్గురువు ఆధ్యాత్మిక మార్గాలపై సంపూర్ణ విశ్వాసంతో వాటిని అనుసరిస్తే వారి భవిష్యత్‌ కర్మఫలితాలను ఈ జన్మలోనే అనుభవించేలా చేసి పునర్జన్మల సంఖ్యను తగ్గించగలరు. కనుకనే శిష్యగణాలు ఎంతటి మహత్కరమైన ఆధ్యాత్మిక జీవనం పొంది ఉన్నప్పటికీ జీవితంలో పలు కష్టాలను అనుభవిస్తుంటారు.

కనుక జీవితంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా 'గురువుల అనుగ్రహంతో వాటిని సమర్థవంతంగా ఎదుర్కోగలం' అన్న దృఢనిశ్చయాన్ని ఏర్పరచుకోవాలి. అదే సద్గురు అనుగ్రహాన్ని దైవానుగ్రహంగా మనకు అందిస్తుంది.

వాసక దీక్షా దర్శనం

శ్రీ అంగప్రదక్షిణ అణ్ణామలైయారు

జీవ సమాధి

మంగళవారంనాడు గురు హోరలో (వేకువజాము 5-6, మధ్యాహ్నం 12-1, రాత్రి 7-8, వేకువజాము 2-3) తిరుఅణ్ణామైలిని గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు దక్షిణ గోపురం సమీపాన తిరుమంజన వీథిలోని శ్రీకర్పగ వినాయకుడి ఆలయం నుండి అరుణాచలేశ్వరుడిని దర్శనం చేసుకుంటే అదే 'వాసక దీక్షా దర్శనం' అవుతుంది.

1. వృత్తి, విద్య, సంసారంలో ఏర్పడే ద్వేషం, శత్రుత్వం, కలహం, అవమానం వంటివి తొలగుతాయి.

2. సద్గురువు నిర్దేశించిన మార్గంలో పయనించేటప్పుడు కలిగే ఇడుములు తొలగి భగవద్‌ అనుగ్రహం ప్రాప్తిస్తుంది.

యోగ దీక్షా దర్శనం

కర్పగ వినాయకుడి ఆలయం నుండి నేరుగా వెళ్లి ముక్కూడలి రహదారంలో కుడివైపు తిరిగితే ప్రభుత్వ పాఠశాల సమీపాన లభించే దర్శనమే యోగ దీక్షా దర్శనం.

కలియుగంలో పలువురికి యోగమార్గంపై తీవ్రమైన ఆసక్తి ఏర్పడుతుంది. అందుకు సద్గురువు అవసరం. అసవ్యమైన యోగశిక్షణ అనారోగ్యాలను, మనో వ్యాధులను కలిగిస్తుంది. మంగళవారం తులా లగ్నంలో గిరి ప్రదక్షిణ చేసి యోగ దీక్షా దర్శనం పొందేవారికి యోగ అభ్యాసం సులువుగా లభించేందుకు మార్గదర్శి లభిస్తాడు.

పలు ఇళ్లల్లో పూర్వీకులు ధనలాభం, దోష నివృత్తి కోసం పూజించిన దైవీక యంత్రాలు, చక్రాలకు సవ్యమైన పూజలకు నోచుకోక నిరుపయోగంగా ఉంటాయి. అలా పూజలకు నోచుకోనందువల్ల ఆ యంత్రాలు చక్రాల దైవీక శక్తి క్రమేణా తగ్గుతుంది. నిత్యపూజల ద్వారానే వాటిలోని దైవీక శక్తులను ప్రేరేపించబడతాయి. పైగా ఆ యంత్రాలలో ఆవాహనం చేయబడిన దేవతలకు పూజలు, నైవేద్యం లేకపోవడం వల్ల వాటికి దేవతాకలి కలిగి దోషాలుగా మారుతాయి. (దైవీక నేరాలలో ఇది కూడా ఒకటి)

పైన పేర్కొన్న దోషాలకు పరిహారంగా మన ఇళ్లల్లోని యంత్రాలు / చక్రాలను పసుపు వస్త్రంలో ఉంచి, చేతులలో పెట్టుకుని మంగళవారంనాడు తిరుఅణ్ణామలైని గిరి ప్రదక్షిణం చేసి తులా లగ్న సమయంలో యోగా దీక్ష దర్శనం పొందాలి. ఈ దర్శనం వల్ల

1. కిరాణా వ్యాపారులు అభివృద్ధి చెందుతారు.

2. బ్యాంక్‌, ఆలయం, గణాంక శాఖ, విద్యుత్‌, తపాలా శాఖ, తనిఖీ శాఖ (జుతిఖిరిశిరిదీవీ / దీరీచీలిబీశిరిళిదీ)లలో పనిచేస్తున్నవారు పదోన్నతి, కోరుకున్న చోటుకు బదలీ పొందుతారు. కార్యాలయపు కష్టాలనుండి బయడపడతారు.

3. తమిళ వేదాలు, గ్రంథాలపై ఆసక్తిగలవారు, వ్యవసాయ రంగంలోనివారు జీవితంలో ఉన్నతస్థితికి చేరుకుంటారు.

అవుత్రీ దీక్షా దర్శనం

శ్రీరమణాశ్రమం వెళ్లే మార్గంలో ఇంద్ర తీర్థం సమీపంలో నెలపొడుపు ఆకారంలో అరుణాచలేశ్వరుడు దర్శనమిస్తారు. ఆ దర్శనమే అవుత్రీ దీక్షా దర్శనం. పలు తీవ్రమైన కర్మఫలితాలను నివారించగలదు. అవుత్రీ దీక్ష అంటే ఏమిటి?

జీవితంలో పలు సమయ సందర్భాలలో పలు రకాల కర్మలను చేసి పలువురు జీవిస్తుంటారు. దానికి ప్రాయశ్చిత్తం అన్వేషిస్తూ పరిహారాలు చేసేవారు కూడా ఉన్నారు.

ఏ తప్పిదాలకు పరిహారం అన్వేషిస్తుంటామో

1. వాటిని జీవితం మళ్లీ చేయకుండా ఉండటం

2. తప్పిదాలవల్ల బాధపడుతున్నవారికి నివారణ సహాయాలు అందించడం

3. పరిహార పద్ధతులు అందించటం

ఈ మూడింటి వలన ఎలాంటి కర్మఫలితాలకైనా నివారణ లభించగలదు.

అయితే అవుత్రీ దీక్ష ద్వారా ఎలాంటి చెడు కర్మఫలితాలైనా ఎలాంటి పరిహారం లేకుండా నివారణం పొందవచ్చు. మంగళవారం నెలపొడుపు కూడిన వేళ తిరుఅణ్ణామలైని గిరి ప్రదక్షిణ చేసి త్రిమూర్తి లింగ దర్శనం పొంది శ్రీత్రిమూర్తి హోమం, దానధర్మాలు చేసిన మీదటే అవుత్రీ దీక్షా దర్శనం పొందగలం.

అయితే మంగళవారం చంద్రహోర సమయంలో (ఉదయం 10-11, సాయంత్రం 5-6, రాత్రి 12-1) తిరుఅణ్ణామలైని గిరి ప్రదక్షిణ చేసి అవుత్రీ దీక్షా దర్శనం పొంది, 101 సార్లు నమస్కరిస్తే అవుత్రీ దీక్ష శక్తి సులువుగా ప్రాప్తిస్తుంది. ఈ దర్శనం పొంది నిరుపేదలు నివసించే ప్రాంతాల్లో హోమాలు జరిపి, ఎరుపు రంగు వస్త్రాలు దానం చేస్తే కుటుంబంలో ఎలాంటి సమస్యలెదురైనా సులువుగా పరిష్కరింపబడుతాయి.

జ్ఞాన దీక్షా దర్శనం

పలు సంవత్సరాలుగా దైవానుగ్రహం పొందటానికి అవసరమైన ఉత్తమ గుణాలను జ్ఞానదీక్షా దర్శనంతో క్షణాలలో పొందగలుగుతారు. చెడు తలంపులు, చెడు గుణాలు తొలగి ఉత్తమ గుణాలు దేహంలోను, మనస్సులోను ఏర్పరచే అద్భుతమైన దర్శనమిది!

తిరుఅణ్ణామలైలో జ్ఞానదీక్షా దర్శనం పొందిన మహర్షులలో గుహ నమశ్శివాయులు, శ్రీకుళందైయానంద స్వాములు, కుంభకోణంలో జీవ సమాధిపొందిన శ్రీత్యాగానంద స్వాములు, శ్రీఅమావాస్య సిద్ధులు ఉన్నారు.

అరుణాచలేశ్వరుడే తన సంపూర్ణ అనుగ్రహాన్ని ప్రాప్తింపచేయగల ఈ అద్భుత దర్శనాన్ని మంగళవారం రాహుకాలంలో గిరి ప్రదక్షణ చేసి ప్రార్థిస్తే పొందగలము.

క్రియా దీక్ష దర్శనం

మన దేహంలో దాగి ఉన్న మూలాధార శక్తిని ప్రేరేపింపజేసి, వెన్నెముకలోని ధవళ నరం ద్వారా పైకెగసి సహస్రారాన్ని చేరేలా చేసేదే కుండలినీ యోగ పద్ధతి. కుండలినీ శక్తి పైకెగసేటప్పుడు దేహంలో ఉష్ణం ఏర్పడుతుంది. పలురకాలైన సిద్థులు చేకూరుతాయి. వాటిని భరించగల దేహ దారుఢ్యం, మనోపక్వం పొందటానికి గురువు అనుగ్రహం అత్యంత ఆవశ్యకం. కనుక తగిన సద్గురువు ద్వారా కుండలినీ యోగాన్ని నేర్చుకోవడమే మంచి పద్ధతి.

కుండలినీ యోగ పద్ధతిని అనుసరిస్తున్నవారికి క్రియా దీక్షా దర్శనం బాగా దోహదపడుతుంది. వీరు ఎరుపు రంగు మాణిక్యం, పగడపు చెవి పోగులు ధరించి గిరి ప్రదక్షిణ చేయడం వల్ల కుండలినీ యోగ పద్ధతులను త్వరగా తెలుసుకోగలం.

గిరి ప్రదక్షిణ మార్గంలో ఓ చోట అంగారక గ్రహపు కాంతి, తిరుఅణ్ణామలై శిఖరాగ్రంతో కలిసి, నిట్టనిలువుగా దర్శనమిస్తుంది. దీనినే 'అంగారక రక్తక్రియా దీక్షా దర్శనం' అని పిలుస్తుంటారు.

1. జ్యోతిష్యం, పవితాత్మ్ర అనుగ్రహం కలిగి జ్యోతిష్యం చెప్పేవారు, యోగ చక్రాలను పూజించేవారు, ఊలిజిలిచీబిశినీగి లో నిష్ణాతులైనవారు తమ శాఖలలో అభివృద్ధి చెందగలరు.

2. కుండలినీ యోగం నేర్చుకునేవారికి, యోగ శిక్షకులకు యోగ శక్తి అధికమవుతుంది.

3. జీవితంలో ఎదురయ్యే కష్టాలను తెలుసుకొని వాటి నుండి కాపాడుకునేందుకు ఈ దర్శనం దోహదపడుతుంది.

సుభిక్ష దీక్షా దర్శనం

గురువు వద్దే ఉంటూ సేవలు చేసి ఆయన నేర్పే దైవీక విషయాలను పాటించి దైవకార్యాలను చేయువారికి సద్గురువైనవారు 'సుభిక్షా దీక్ష'ను అందించి అనుగ్రహిస్తుంటారు.

మంత్ర దీక్ష, యోగ దీక్ష వంటి పలు కఠినమైన పూజా పద్ధతులు, వ్రత పద్ధతులు లేకుండా చాలా సులువుగా గురు అనుగ్రహంతో కూడిన దైవానుగ్రహాన్ని సైతం అందించే పద్ధతే సుభీక్షా దీక్ష పద్ధతి.

సద్గురువును పొంది ఆయనతోనే ఉంటూ సకమ్రంగా సేవలు చేయాలనుకునేవారు మంగళవారాల్లో విశాఖ నక్షత్రంతో కూడి శుభసమయాన తిరుఅణ్ణామలైని గిరిప్రదక్షిణ చేయాలి. లేదా మూడేళ్లు క్రమం తప్పకుండా గిరి ప్రదక్షిణ చేసి పూజిస్తే అరుణాచలేశ్వరుడు సద్గురువును ఎరుకపరచి, ఆయనకు సేవచేసే భాగ్యాన్ని అందించగలరు.

'కలియుగంలో సద్గురువును పొందటమే అరుదైన విషయం. ఈ స్థితిలో గురుసేవ ఎలా చేయడం? అని తలంచకండి. నేటికీ ఎందరో సద్గురువులు తమ పరిపూర్ణమైన దైవీ శక్తిని ఎరుకపరచకుండా సామాన్య మానవుల్లా జీవిస్తున్నారు. నిజమైన దైవ విశ్వాసం కలిగినవారు మాత్రమే వీరిని గుర్తించగలరు.

మన దగ్గరే ఉన్నా వారిని కనుగొనలేకపోవడం మన తప్పిదమే కాదా! మన జీవనపు సమస్యలు తీరడానికి, సుఖయోగాలు, సంతోషాలు కోరటానికే వారిని వెంబడించడం ఎలా న్యాయమవుతుంది? అమృత భాండాగారాన్నే మనముందు ఉంచడానికి సద్గురువులు సిద్ధంగా ఉన్నప్పుడు వారిని కనుగొనకుండా ఉండటం ఎవరి నేరం?

కనుక తగిన సద్గురువు కావాలనుకునేవారు విశాఖ నక్షత్రంతో కూడిన మంగళవారాల్లో మూడేళ్లపాటు (1095 రోజులు) తిరుఅణ్ణామలైని గిరిప్రదక్షిణ చేస్తే తప్పకుండా తగిన సద్గురువును పొందగలుగుతారు.

Famous Posts:

ఆదివారం అరుణాచల గిరి ప్రదక్షిణ ఫలితాలు.

సోమవారం అరుణాచల గిరి ప్రదక్షిణ ఫలితాలు.

మంగళవారం అరుణాచల గిరి ప్రదక్షిణ ఫలితాలు.

బుధవారం అరుణాచల గిరి ప్రదక్షిణ ఫలితాలు.

గురువారం అరుణాచల గిరి ప్రదక్షిణ ఫలితాలు.

శుక్రవారం అరుణాచల గిరి ప్రదక్షిణ ఫలితాలు.

శనివారం అరుణాచల గిరి ప్రదక్షిణ ఫలితాలు.

arunachalam, giri pradakshina, arunachalam temple giri pradakshina dates, arunachalam temple, arunachalam temple giri, arunachalam temple giri pradakshina images, arunachalam giri pradakshina starting point, arunachalam giri pradakshina benefits, arunachalam temple giri pradakshina in telugu

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.