Drop Down Menus

Famous Temples List In RangaReddy District | Telangana State

రంగారెడ్డి జిల్లాలోని ప్రముఖ దేవాలయాల జాబితా :

1. శ్రీ రామ ఆలయం , అమ్మాపల్లి :

ఈ ఆలయం శంషాబాద్ నుండి 5 కి. మీ దూరంలో కలదు. ఈ ఆలయం 13 వ శతాబ్దానికి చెందినది. ఈ ఆలయంలో శ్రీ రామ నవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. తెలుగు సినిమా షూటింగ్ కి ఈ ఆలయం చాలా ప్రసిద్ది చెందినది. 

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 1.00PM - 4.00PM TO 7.00PM.

2. శ్రీ సిద్దేశ్వర ఆలయం , శిధిలా గుట్ట (శంషాబాద్) :

ఈ ఆలయం వేడికొండ శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయం ప్రకృతి రమణీయల మధ్య , ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఆలయం శంషాబాద్ లోని అమ్మాపల్లి కి వెళ్ళే దారిలోనే రాళ్ళ గూడ లో కలదు. ఈ అలయం ని కూడా మనం చాలా సినిమా లో చూడవచ్చు. ఈ ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. 

ఆలయ దర్శించే సమయం : 7.00AM TO 1.00PM - 3.00PM TO 6.30PM.

3. శ్రీ శివ ఆలయం , మహేశ్వరం :

ఈ ఆలయం 350 సం || క్రితం ఆలయం. ఈ అలయని అక్కన , మాదన్నా వారు అభివృద్ధి పరిచారు. ఈ ఆలయంలో నీటి పుష్కరిణి కూడా ఉన్నది. 3 వైపులా నీటితో ఉంది మధ్యలో ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో మారియొక్క  విశేషం అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీగా పూజలు అందుకుంటారు. అమ్మవారు క్రింద అంతస్థులో స్వామి వారి పైన అంతస్థులో ఉంటారు. నవరాత్రి ఉత్సవాలు , చండీ దేవి పూజలు వైభవంగా జరుగుతాయి. 

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 3.00PM TO 7.30PM.

4. శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం , బుగ్గ :

ఈ ఆలయం 500 క్రితం ఆలయం . శివ లింగం క్రింద ఉద్భవించి, ఏడాది పొడవునా నిరతరంగా ప్రవహిస్తుంది . ఆలయం సమీపంలో ఒక చెరువులో సేకరించిన నీరు హైదరాబాద్ గుండా ప్రవహించే నది మూసి. ఈ ప్రదేశంలో నుండి పుట్టినది.

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 2.00PM TO 8.00PM.

5. శ్రీ అనంత పద్మనాభ స్వామి , అనంతగిరి :

ఈ ఆలయానికి 400 సం || చరిత్ర కలిగి ఉన్నది. నిజం నవాబ్ వారు వేటకు ఈ అనంత గిరి కొండకి వచ్చే వారు. హైదరాబాద్ నుంచి 75 కి.మీ దూరంలో కలదు. ఏకాదశి పుణ్య తిధులలో రద్దీ అధికంగా ఉంటుంది. ఈ ఆలయంలో స్వామి వారు కొండ క్రింద కొలువై ఉంటారు. వైకుంఠ ఏకాదశి రోజు భారీ ఎత్తున భక్తులు వస్తారు. 

ఆలయ దర్శించే సమయం : 7.00AM TO 1.00PM - 3.00PM TO 8.00PM.

6. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం , అల్వాల్ :

ఈ ఆలయం 18 వ శతాబ్ధం కి చెందినది. ఈ ఆలయం సికింద్రాబాద్ స్టేషన్ నుంచి 8 కి. మీ దూరంలో కలదు. ఆల్వాల్ తమిళ కవులు అయినా భగావతి మరియు భక్తుల యొక్క ప్రతిపాదకులు మరియు వేంకటేశ్వర స్వామి యొక్క భక్తుల అయినా ఆళ్వార్ ల నుంచి ఆల్వాల్ గా ఈ ప్రాంతానికి పేరు వచ్చింది. 

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 4.00PM TO 8.00PM.

7. శ్రీ వేంకటేశ్వర ఆలయం , జిల్లెల గూడ :

ఈ ఆలయంలో వేంకటేశ్వర స్వామి స్వయంభూ మూర్తి. ఈ ఆలయంలో ధనుర్మాసం , వైకుంఠ ఏకాదశి పండుగలని వైభవంగా నిర్వహిస్తారు. మిదాని, దిల్ సుఖ్ నగర్ నుంచి బస్ లు కలవు. 

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 3.00PM TO 9.00PM.

8. రత్న ఆలయం , శామీర్ పేట్ :

ఈ ఆలయంలో శ్రీ పద్మావతి & అళివేలు మంగమ్మ శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఈ ఆలయం 26 ఏప్రిల్ 2001 లో ప్రారంభించారు. కేవలం 22 నెలలో 19 ఫిబ్రవరి 2003 లో శ్రీ చిన్న జీయర్ స్వామి వారిచే ప్రారంభించబడినది. ప్రతి నెల అభిషేకం , కైకర్యం శవై వారికి వైభవంగా జరుగుతాయి. ఈ ఆలయం రాజీవ్ గాంధీ హైవేకి దగ్గరలో , సికింద్రాబాద్ నుంచి 25 కి.మీ దూరంలో కలదు. ఈ ఆలయంలో యజ్ఞశాల, కళ్యాణ కట్ట , ప్రవచనం హాల్ , గోశాల , కూడా ఉన్నాయి. ప్రతి రోజు 8 గంటలకి ప్రత్యేక హారతి ఉంటుంది.  

 ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 4.00PM TO 8.00PM.

9. భవీగి భద్రేశ్వర  స్వామి , తాండూర్ :

ఈ ఆలయం 1940 లో ప్రారంభించారు. ఈ ఆలయంలో భద్రప్ప ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ప్రతి ఏటా చైత్ర పూర్ణిమ , చైత్ర అష్టమి ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఆలయంలో శివరాత్రి మరియు నవరాత్రి ఉత్సవాలు కూడా చేస్తారు. సంగారెడ్డి నుంచి 50 కి. మీ  వికారాబాద్ నుంచి 40 కి. మీ దూరంలో కలదు. 

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 2.00PM TO 7.30PM.

10.  శ్రీ రంగనాయక స్వామి ఆలయం :

హయాత్ నగర్ నుంచి 8 కి. మీ దూరంలో గండి చెరువు వద్ద కలదు. ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయానికి 500 సం || చరిత్ర కలదు. నీరు సరిగా లేని ఈ ప్రదేశం లో ఈ రంగనాధుని కృప వల్ల పంటలు బాగా పండుతునాయి అని ఆధారాలు కలవు. ధనుర్మాసం , శ్రీ రామ నవమి ఉత్సవాలు కూడా జరుగుతాయి. హైదరాబాద్ నుంచి 32 కి. మీ దూరంలో మరియు హయాత్ నగర్ నుంచి ప్రైవేట్ ఆటో లు కూడా ఈ ఆలయనికి వెలుతాయి. 

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 3.00PM TO 7.00PM.

రంగారెడ్డి జిల్లాలోని కొత్తగా చేర్చిన ఆలయాల వివరాల కొరకు ఇక్కడ చేయండి. 

Telangana Temples District Wise



KeyWords : RangaReddy Famous Temples List, RangaReddy Surrounding Temples, Telangana Famous Temples List, Hindu Temples Guide
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.