Drop Down Menus

భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ? Goddess Lakshmi and Lord Vishnu Story

ఆధునికయుగం, హడావుడి జీవితం, యాంత్రికంగా మారిన ప్రజలు.. సడలిపోతున్న కుటుంబ విలువలు. ప్రస్తుతం ఇదే.. మానవ జీవితంగా మారిపోయింది. ఎప్పుడూ ఉద్యోగాలు, హడావుడిగా గడిపేయడం ప్రస్తుతం ప్రజలు బాగా అలవాటు పడిపోయారు. వీటికి తోడు ఆధునిక పరికరాలు వచ్చేశాక వాటితో గడిపే వారి సంఖ్య కూడా పెరిగిపోతుంది. 
ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా. ఈ రెండింటి ప్రభావంతో కుటుంబంలోని సభ్యులు ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోని పరిస్థితి ఏర్పడింది. అయితే సోషల్ మీడియా కొన్ని నెగటివ్ ఫలితాలను ఇచ్చినా.. మరికొన్ని సందేశాలు, ఉపయోగకరమైన విషయాలను కూడా వాటిలో పోస్టు చేయడం జరుగుతుంది.

ఇలా పురాతన అంశాలు, యోగా, ఆధ్యాత్మికం వంటి సంస్కృతికి సంబంధించిన అంశాలు కూడా సోషల్ మీడియా ప్రస్తుతం కథనాల రూపంలో చక్కర్లు కొడుతున్నాయి. అలాంటి వాటిలో ఓ చిన్న కథనం గురించి ఇప్పుడు చూద్దాం.. ప్రస్తుతం భార్యాభర్తల మధ్య అనుబంధాలు అంతంత మాత్రంగానే వున్నాయి. భార్యాభర్తలు అన్యోన్యంగా జీవించడాన్ని చాలామటుకు విస్మరిస్తున్నారు. 
యాంత్రిక జీవితానికి అలవాటుపడి ప్రేమను దూరం చేసుకుంటున్నారు. అయితే స్థితికర్త విష్ణుమూర్తికి శ్రీమహాలక్ష్మీదేవి అంటే పరమ ఇష్టం. అందుకే తిరుమల కొండకు వచ్చే ముందు భక్తులు తిరుచానూరు అమ్మవారిని దర్శించుకుని వచ్చాకే వెంకన్నను దర్శించుకుంటారు. అమ్మవారిని దర్శించుకుని కొండపైకి తన వద్దకు వచ్చే భక్తులంటే శ్రీవారికి చాలా ఇష్టమట.

అలాంటి శ్రీహరి అంటే కూడా శ్రీలక్ష్మికి పరమ ప్రీతి. అలాంటి శ్రీలక్ష్మి మహావిష్ణువు కాళ్లను ఎందుకు వత్తుతూ కనిపిస్తుందనే దానిపై సోషల్ మీడియాలో కథనం వచ్చింది. ఆ కథనంలో మహావిష్ణువు కాళ్లను లక్ష్మీదేవి వత్తడం వెనుక ఓ రహస్యం వుందట.
పురుషుల మోకాలి నుంచి పాదాల వరకు శనీశ్వరుడు నివాసం వుంటాడట. అలాగే మహిళల మోచేతి నుంచి చేతివేళ్ల వరకు శుక్రుడు నివాసం చేస్తాడట. 

అలా మహిళలు తమ చేతులారా పురుషుల (భర్తలు) కాళ్లను వత్తడం ద్వారా శనీశ్వరుడిపై ఒత్తిడి పడుతుందట. ఇలా శుక్రుడు ఒత్తిడి శనిపై పడితే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం. అందుకే లక్ష్మీదేవి.. శ్రీపతి కాళ్లను వైకుంఠంలో వత్తుతూ వుంటుందట. అలా చేయడం ద్వారానే లక్ష్మీ దేవి సిరులకు అధిపతిగా మారిందని నమ్మకం.
ధనసంపదనిచ్చే మంత్రం:
కుబేరత్వం ధనాధీశ గృహేతే కమలా స్థితా తాందేవం
తేషయా సునమృద్ధి త్వం మద్ గృహే తే నమో నమః
(ఈ మంత్రాన్ని నిష్టగా రోజుకు 108 పర్యాయాల చొప్పున 21రోజులు జపించాలి)
Related Posts:
సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు
ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు
ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే
అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం
> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి
100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం
> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం
అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం
ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే


Lakshmi Narayan, Lakshmi Narayana Story, Goddess lakshmi, Lord Vishnu, goddess lakshmi story in telugu, goddess lakshmi story, vishnu and lakshmi separation, lakshmi goddess, lord vishnu and lakshmi love story, star of lakshmi, lakshmi narayana god, lakshmi facts, wife and husband relation, marriage
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.